సందర్శకుల భద్రతే ముఖ్యం
పర్యటకం అభివృద్ధి చెందడం ఎంత ముఖ్యమో, ఆ కేంద్రాలను చూడటానికి వచ్చే సందర్శకుల భద్రత అంతకన్నా ముఖ్యమని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. దేవీపట్నం మండలం పోశమ్మగండి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఆయన పర్యటించారు.
పర్యటక శాఖ మంత్రి దుర్గేష్
బోటుపై వెళ్తున్న మంత్రి కందుల దుర్గేష్, సబ్ కలెక్టర్ ప్రశాంత్కుమార్
దేవీపట్నం, న్యూస్టుడే: పర్యటకం అభివృద్ధి చెందడం ఎంత ముఖ్యమో, ఆ కేంద్రాలను చూడటానికి వచ్చే సందర్శకుల భద్రత అంతకన్నా ముఖ్యమని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. దేవీపట్నం మండలం పోశమ్మగండి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఆయన పర్యటించారు. కంట్రోల్ రూంను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేరంటాలపల్లి వద్ద వర్షాకాలంలో ఆలయానికి వెళ్లి వచ్చే సందర్శకులు ఇబ్బందులు పడకుండా (మొబైల్ స్టెప్స్) ఏర్పాటు చేస్తామన్నారు. కొరుటూరు వద్ద బస ఉండటానికి వసతులు సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు. బోట్ల భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. వీటిలో గ్యాస్ బండలు తీసుకు వెళ్లొద్దన్నారు. పోలవరం ప్రాజెక్టు నీటిమట్టం స్థాయిని బట్టి శాశ్వత కట్టడాలు అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మారేడుమిల్లి మండలంలోని గుడిసె ప్రాంతం సందర్శకులను అద్భుతంగా ఆకట్టుకుంటోందన్నారు. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధిచేసి సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ‘పుష్ప’ సినిమా చిత్రీకరించిన ప్రాంతాలు సందర్శకులు చూసేందుకు అనువుగా ఏవిధంగా తయారు చేయాలనే దానిపై నివేదికలు తెప్పించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గడిచిన అయిదేళ్లలో పర్యటక రంగానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. పోశమ్మగండి నుంచి బోటుపై పూడిపల్లి వరకు మంత్రి వెళ్లారు. దేవీపట్నంలో జనసైనికులు మంత్రితో ఫొటోలు తీసుకున్నారు.
విహార యాత్రికులతో ముఖాముఖి.. పాపికొండల విహారయాత్రను ముగించుకుని పోశమ్మగండి చేరుకున్న సందర్శకులతో మంత్రి దుర్గేష్ ముచ్చటించారు. పాపికొండల విహారయాత్ర ఎలా జరిగింది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏం చేయాలో సూచనలు చేస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. బోటు పాయింట్ వద్ద వెయిటింగ్ రూం ఏర్పాటుతోపాటు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని సందర్శకులు కోరారు. రాజమహేంద్రవరం నుంచి పోశమ్మగండికి వచ్చే మార్గంలో కొంతమేర రహదారి అధ్వానంగా ఉందని పర్యటకులు చెప్పారు. అనంతరం మంత్రి బోటు నిర్వాహకులతో మాట్లాడారు.గండిపోశమ్మ దర్శనం చేసుకుని తిరిగి వెళ్లి పోయారు. మంత్రి పర్యటనలో సబ్ కలెక్టర్ ప్రశాంతకుమార్, గోకవరం రేంజ్ అధికారి దుర్గాకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్లూరి స్మారకాల అభివృద్ధిపై ఆశలు
[ 04-07-2024]
మన్యం ప్రాంత ప్రజల గుండెల్లో చెదరని స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు. గిరిజనులతో కలిసి విల్లంబులు, బాణాలతో బ్రిటిష్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడు ఆయన. -
అన్నదాతలకు అండగా.. ఆదివాసీలకు తోడుగా..
[ 04-07-2024]
ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. సమస్య నుంచి ఎలా బయటపడాలన్నదే ముఖ్యమని కర్షకులకు ఆర్డీఎస్ఎస్ కౌన్సెలింగ్ ఇప్పిస్తోంది. ఆ సంస్థసీఈవో గాడి శ్రీను అలియాస్ బాలు కిసాన్ మిత్రా హెల్ప్లైన్ ప్రారంభించారు. -
రంగులు మార్చే సీతాకోకచిలుక
[ 04-07-2024]
సీతాకోకచిలుక.. దీని పేరు చెబితేనే అనేక ఆకట్టుకునే రంగులు గుర్తుకొస్తాయి. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు ఒళ్లు జలదరించే స్థితి నుంచి అందంతో అందరినీ ఆకట్టుకునేలా తనని తాను తీర్చిదిద్దుకుంటుంది. -
ఆ ఇళ్ల సంగతేంటి?
[ 04-07-2024]
జిల్లాలో పక్కా ఇళ్ల నిర్మాణ పనులు నెమ్మదించాయి. వీటి నిర్మాణాలకు సంబంధించి కొత్త ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. జిల్లాలో పునాదుల కోసం గోతులు తవ్విన ఇళ్లే దాదాపు 15,487 వరకు ఉన్నాయి. -
సమస్యలపై నిర్వాసితుల మొర
[ 04-07-2024]
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దినేశ్కుమార్ ఆధ్వర్యంలో బుధవారం చింతూరు ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించారు. -
‘చీకట్లో మగ్గుతున్నాం’
[ 04-07-2024]
రొంపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల్లో నేటికీ విద్యుత్తు సౌకర్యం కల్పించలేదని అక్కడి ప్రజలు కాగడాలతో నిరసన తెలిపారు. -
పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు
[ 04-07-2024]
రెండు రోజులుగా మండలంలోని ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వాగులు పొంగి పొర్లాయి. వట్టిగెడ్డ జలాశయంలో నీరు అధికంగా చేరింది. -
నచ్చినోళ్లకు.. నిధులు కుమ్మరింత!
[ 04-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
సింహగిరిపై వైభవంగా వరద పాయస ఉత్సవం
[ 04-07-2024]
దేశంలో పంటలు బాగా పండేందుకు, అంతా సుభిక్షం ఉండేందుకు, వర్షాలు సమృద్ధిగా కురిపించాలని వైకుంఠ నారాయణనుడిని భక్తులు వేడుకున్నారు. -
ప్రమాదకరం ఘాట్రోడ్డు ప్రయాణం
[ 04-07-2024]
వాలమూరు నుంచి చింతూరు మండలం తులసిపాక వరకు 30 కిలోమీటర్ల మేర ఘాట్రోడ్డు ప్రమాదకరంగా ఉంది. ఇరుకైన మలుపులు, పక్కనే లోతైన అగాధాలు, మరోపక్క ఎత్తయిన కొండలతో ఉండే ఈ మార్గంలో వాహనాల రాకపోకలు కత్తిమీద సామే.