logo

ప్రధాని అరకు కాఫీని ప్రశంసించడం గర్వకారణం

మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో అరకు కాఫీ గురించి ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావించడం.. ప్రశంసించడం గిరిజన సహకార సంస్థకి (జీసీసీ) గర్వకారణమని సంస్థ ఎండీ సురేష్‌కుమార్‌ తెలిపారు.

Published : 01 Jul 2024 02:11 IST

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో అరకు కాఫీ గురించి ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావించడం.. ప్రశంసించడం గిరిజన సహకార సంస్థకి (జీసీసీ) గర్వకారణమని సంస్థ ఎండీ సురేష్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో అరకు కాఫీ ప్రస్తావన రావడం గర్వంగా ఉందన్నారు. గిరిజన కాఫీ రైతులు, జీసీసీ సిబ్బంది, కాఫీ సాగుతో ముడిపడిన అన్ని శాఖలకు ఈ ప్రశంస ఎంతో ఉత్తేజమిస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని