ప్రమాద బాధితులను ఆదుకుంటే పారితోషికం
రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు మానవత్వంతో స్పందించి వెంటనే బాధితులను సమీప ఆసుపత్రిలో చేర్చిన వారికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రూ.5 వేలు నగదు బహుమతి ఇవ్వనున్నట్లుగా రవాణాశాఖ మంత్రి ఎం.రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు.
నిబంధనల బోర్డులను ఆవిష్కరిస్తున్న మంత్రి రామ్ప్రసాద్రెడ్డి
విశాఖపట్నం, న్యూస్టుడే: రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు మానవత్వంతో స్పందించి వెంటనే బాధితులను సమీప ఆసుపత్రిలో చేర్చిన వారికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రూ.5 వేలు నగదు బహుమతి ఇవ్వనున్నట్లుగా రవాణాశాఖ మంత్రి ఎం.రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆదివారం విశాఖ విమానాశ్రయానికి విచ్చేసిన ఆయనకు రవాణాశాఖ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ హాలులో ట్రాఫిక్ నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన డిస్ప్లే బోర్డులు, కరపత్రాలను ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించి వాటి నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జేటీసీ వి.సుందర్, విశాఖ, అనకాపల్లి విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి, మన్యం జిల్లాల డీటీఓలు జి.సి.రాజారత్నం, జి.మనోహర్, మణికుమార్, ఏ.చంద్రశేఖర్రెడ్డి, లీలాప్రసాద్, శశికుమార్.. ఆర్టీవో ఆర్.సి.హెచ్. శ్రీనివాస్, పలువురు రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు.
‘ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం’
రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన శాఖా మంత్రి ఎం.రామ్ప్రసాద్రెడ్డి అన్నారు. విశాఖ నగర పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు గజమాలతో మంత్రిని సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రయాణికులను నిత్యం గమ్యస్థానాలకు చేర్చుతున్న ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అయితే కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధంగా ఉండాలని సూచించారు. అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిన ఆర్టీసీ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. అనంతరం మంత్రి రోడ్డు మార్గంలో నగరంలోకి వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్లూరి స్మారకాల అభివృద్ధిపై ఆశలు
[ 04-07-2024]
మన్యం ప్రాంత ప్రజల గుండెల్లో చెదరని స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు. గిరిజనులతో కలిసి విల్లంబులు, బాణాలతో బ్రిటిష్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడు ఆయన. -
అన్నదాతలకు అండగా.. ఆదివాసీలకు తోడుగా..
[ 04-07-2024]
ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. సమస్య నుంచి ఎలా బయటపడాలన్నదే ముఖ్యమని కర్షకులకు ఆర్డీఎస్ఎస్ కౌన్సెలింగ్ ఇప్పిస్తోంది. ఆ సంస్థసీఈవో గాడి శ్రీను అలియాస్ బాలు కిసాన్ మిత్రా హెల్ప్లైన్ ప్రారంభించారు. -
రంగులు మార్చే సీతాకోకచిలుక
[ 04-07-2024]
సీతాకోకచిలుక.. దీని పేరు చెబితేనే అనేక ఆకట్టుకునే రంగులు గుర్తుకొస్తాయి. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు ఒళ్లు జలదరించే స్థితి నుంచి అందంతో అందరినీ ఆకట్టుకునేలా తనని తాను తీర్చిదిద్దుకుంటుంది. -
ఆ ఇళ్ల సంగతేంటి?
[ 04-07-2024]
జిల్లాలో పక్కా ఇళ్ల నిర్మాణ పనులు నెమ్మదించాయి. వీటి నిర్మాణాలకు సంబంధించి కొత్త ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. జిల్లాలో పునాదుల కోసం గోతులు తవ్విన ఇళ్లే దాదాపు 15,487 వరకు ఉన్నాయి. -
సమస్యలపై నిర్వాసితుల మొర
[ 04-07-2024]
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దినేశ్కుమార్ ఆధ్వర్యంలో బుధవారం చింతూరు ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించారు. -
‘చీకట్లో మగ్గుతున్నాం’
[ 04-07-2024]
రొంపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల్లో నేటికీ విద్యుత్తు సౌకర్యం కల్పించలేదని అక్కడి ప్రజలు కాగడాలతో నిరసన తెలిపారు. -
పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు
[ 04-07-2024]
రెండు రోజులుగా మండలంలోని ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వాగులు పొంగి పొర్లాయి. వట్టిగెడ్డ జలాశయంలో నీరు అధికంగా చేరింది. -
నచ్చినోళ్లకు.. నిధులు కుమ్మరింత!
[ 04-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
సింహగిరిపై వైభవంగా వరద పాయస ఉత్సవం
[ 04-07-2024]
దేశంలో పంటలు బాగా పండేందుకు, అంతా సుభిక్షం ఉండేందుకు, వర్షాలు సమృద్ధిగా కురిపించాలని వైకుంఠ నారాయణనుడిని భక్తులు వేడుకున్నారు. -
ప్రమాదకరం ఘాట్రోడ్డు ప్రయాణం
[ 04-07-2024]
వాలమూరు నుంచి చింతూరు మండలం తులసిపాక వరకు 30 కిలోమీటర్ల మేర ఘాట్రోడ్డు ప్రమాదకరంగా ఉంది. ఇరుకైన మలుపులు, పక్కనే లోతైన అగాధాలు, మరోపక్క ఎత్తయిన కొండలతో ఉండే ఈ మార్గంలో వాహనాల రాకపోకలు కత్తిమీద సామే.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జుడియో, మింత్రాకు పోటీగా.. భారత్లోకి షీయెన్ బ్రాండ్ రీఎంట్రీ!
-
దేవభూమిని వణికిస్తున్న వర్షాలు.. 100 రహదారులు మూసివేత
-
రికార్డుల వద్ద ప్రారంభమై.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
స్వదేశానికి టీమ్ఇండియా.. భారత స్టార్లు బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నారంటే?
-
దిల్లీ, హరియాణాల్లో వారితో పొత్తు లేనట్లే...! కాంగ్రెస్
-
మొన్న ఆర్మీ ట్రైనింగ్.. ఇప్పుడు పాత పరుపులపై ప్రాక్టీస్.. పాక్పై ట్రోలింగ్