ఆంగ్లం చదవలేరు.. తెలుగు రాయలేరు!
ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దిగజారడంపై జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఉమ్మడి జిల్లాలో దిగజారిన విద్యా ప్రమాణాలు
స్థాయీ సంఘ సమావేశంలో జడ్పీటీసీ సభ్యుల ఆవేదన
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర, చిత్రంలో సీఈఓ పోలినాయుడు
విశాఖపట్నం, న్యూస్టుడే: ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దిగజారడంపై జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు అత్యంత నాసిరకంగా ఉన్నాయని, పదో తరగతి ఫలితాల్లో అనేక మంది విద్యార్థులు తప్పుతున్నారని, విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శనివారం జడ్పీ సమావేశ మందిరంలో ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన స్థాయీ సంఘ సమావేశం జరిగింది.
అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు మాట్లాడుతూ ఇటీవల రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం తేలిక పాటి పరీక్ష నిర్వహిస్తే హాజరైన విద్యార్థుల్లో ఒకరిద్దరు మినహా మిగిలినవారు ఫెయిలయ్యారన్నారు. పదోతరగతిలో 528 మార్కులు వచ్చిన విద్యార్థి ఆంగ్ల పదాలు చదవలేకపోవడం, తెలుగులో సైతం రాయలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడు మత్స్యలింగం మాట్లాడుతూ ఉపాధ్యాయులు పాఠాలు సరిగా చెప్పడం లేదని, సమయపాలన పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలను కూడా తరచూ తనిఖీ చేయడం లేదన్నారు. డీఈఓ బ్రహ్మాజీ స్పందిస్తూ గిరిజన ప్రాంతాల్లో 16 ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండడంతో పర్యవేక్షణ తగ్గిందని, ఇక మీదట పనితీరు మెరుగుపర్చుతామన్నారు.
ఎమ్మెల్యేగా ఎన్నికైన మత్స్యలింగంను సత్కరిస్తున్న జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర, జడ్పీటీసీ సభ్యులు
జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వానికి, సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడికి అభినందనలు తెలిపారు. సామాజిక పింఛన్ల మొత్తం పెంపుపై సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం మాట్లాడుతూ ఉద్యాన తోటల పెంపకంలో భాగంగా రైతులకు నాసిరకం మొక్కలను అందజేస్తున్నారని తెలిపారు. పాయకరావుపేట జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి మాట్లాడుతూ వాహన కొనుగోలు పథకంలో రాయితీ నిధులు విడుదల చేసేందుకు పరిశ్రమల కేంద్రం అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారని ఆరోపించారు. జడ్పీటీసీ సభ్యులు లేవనెత్తిన అంశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఛైర్పర్సన్ ఆదేశించారు. జడ్పీ సీఈఓ పోలినాయుడు, పలువురు జడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరకు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు మత్స్యలింగంను ఛైర్పర్సన్ సుభద్ర, జడ్పీటీసీలు సత్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాళ్లు ఏడిపించారు.. వీళ్లు ఏడువేలిచ్చారు!
[ 02-07-2024]
కూటమి సర్కారు ఏర్పడి నెలరోజులు గడవకుండానే తొలి సంక్షేమ ఫలం పేదల ఇంటికి చేరింది. అవ్వాతాతలకు ఇచ్చే పింఛను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడమే కాదు గత మూడు నెలల బకాయిలు కలిపి ఒకేసారి రూ.7 వేలు అందించి ఎన్నికల హామీని ఆచరణలో చూపారు చంద్రబాబు. -
ఆదివాసీల మోముల్లో ఆనందోత్సాహాలు
[ 02-07-2024]
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ మన్యంవ్యాప్తంగా పండగలా జరిగింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లిపింఛన్లు పంపిణీ చేశారు. -
హుద్హుద్ కాలనీల కథ అంతేనా?
[ 02-07-2024]
గిరిజనులకు హుద్హుద్ తుపాను చేసిన గాయం ఇప్పటివరకు నయం కాలేదు. హుద్హుద్ తుపాను కారణంగా ఇళ్లు నష్టపోయిన గిరిజనులకు రక్షిత ప్రాంతంలో కాలనీలు నిర్మించి సొంత గూడు కల్పించాలని అప్పటి తెదేపా ప్రభుత్వం సంకల్పించింది. -
రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం
[ 02-07-2024]
రహదారుల నిర్మాణ పనులకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ పేర్కొన్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి
[ 02-07-2024]
స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యుల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.లక్ష్మి కేక్ను కోసి వైద్యులు, సిబ్బందికి అందించారు. -
జాతీయస్థాయి కుస్తీ పోటీలకు పయనం
[ 02-07-2024]
కొయ్యూరు కస్తూర్బా విద్యాలయంలో చదువుతున్న ఆరుగురు విద్యార్థినులు జాతీయస్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు సోమవారం బయలుదేరారు. -
నమ్మండి.. ఇది రహదారేనండి!
[ 02-07-2024]
దారెల పంచాయతీలోని 14 గ్రామాలకు వెళ్లే రహదారి నిర్మాణం కంకరరాళ్లకే పరిమితమైంది. పేదపేట నుంచి పేటమాలిపుట్టు, కుమ్మరిపుట్టు, డీంగుడ కూడలి వరకు రహదారి నిర్మాణం ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు. -
వాగులు పొంగే... రాకపోకలు ఆగే..
[ 02-07-2024]
కొండవాగులు పొంగితే ఆ రెండు గ్రామాల గిరిజనులు బయట ప్రాంతాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
404 కేజీల గంజాయి స్వాధీనం
[ 02-07-2024]
వేర్వేరు చోట్ల 404 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి తీసుకొచ్చి గంజాయిని ఒక చోట నిల్వ ఉంచి రవాణాకు సిద్ధపడుతుండగా ఒకరిని అరెస్టు చేసినట్లు చింతపల్లి సీఐ రమేశ్ తెలిపారు. -
గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన నిందితుడికి జైలు
[ 02-07-2024]
యువతిని గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన కేసులో నిందితుడికి పదేళ్ల కారాగార శిక్షతోపాటు రూ.7వేల జరిమానా విధిస్తూ పదకొండో అదనపు జిల్లా న్యాయస్థానం కమ్ ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) న్యాయస్థానం న్యాయమూర్తి పి.శ్రీసత్యదేవి తీర్పునిచ్చారు.