గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తాం
గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ పేర్కొన్నారు. పాడేరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని శనివారం ఆయన సందర్శించారు.
రోగులకు అందుతున్న వైద్యసేవలు పరిశీలిస్తున్న కలెక్టర్ దినేష్కుమార్,
చిత్రంలో ఆసుపత్రి పర్యవేక్షకురాలు విశ్వామిత్ర తదితరులు
పాడేరు, న్యూస్టుడే: గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ పేర్కొన్నారు. పాడేరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని శనివారం ఆయన సందర్శించారు. ఆసుపత్రిలోని పలు విభాగాలు తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ.. బోధనా ఆసుపత్రి అనుమతులు జారీ చేయడానికి ఇటీవల ఎన్ఎంసీ బృందం పరిశీలించిందన్నారు. ఆపరేషన్ థియేటర్కు ఆక్సిజన్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఖాళీలు భర్తీ చేయాలని రీజనల్ డైరెక్టర్ను కోరతామని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతం వల్ల వైద్యులు ఇక్కడ పనిచేసేందుకు ముందుకు రావడం లేదని, అదనపు ఇన్సెంటివ్ ఇచ్చి వారిని నియమిస్తామని తెలిపారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దీన్ని పరిష్కరిస్తామని చెప్పారు. జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకురాలు విశ్వామిత్ర, వైద్య కళాశాల ప్రిన్సిపల్ హేమలత, గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు కొండలరావు, తహసీల్దార్ కల్యాణ్ చక్రవర్తి, ఎంపీడీఓ నవీన్, ఏటీడబ్ల్యూఓ రజని, ఆసుపత్రి వైద్యాధికారులు పాల్గొన్నారు.
వైద్య కళాశాల నిర్మాణ పనుల తనిఖీ
పాడేరులో 35 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్ల వ్యయంతో జరుగుతున్న వైద్య కళాశాల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. వైద్య విద్యార్థుల తరగతి గదులు, ల్యాబ్లు, బాలురు, బాలికల వసతిగృహాలు, నర్సింగ్ కళాశాల భవనాల నిర్మాణాలను తనిఖీ చేశారు. పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని ఎన్సీసీ ప్రతినిధులను ఆదేశించారు. వైద్య కళాశాల నిర్మాణ మ్యాప్లను పరిశీలించారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ హేమలత, ఏపీఎస్ఎంఐడీసీ ఈఈ అచ్చెన్నాయుడు, తహసీల్దార్ కల్యాణ్చక్రవర్తి, ఎంపీడీఓ నవీన్, ఏఈ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాళ్లు ఏడిపించారు.. వీళ్లు ఏడువేలిచ్చారు!
[ 02-07-2024]
కూటమి సర్కారు ఏర్పడి నెలరోజులు గడవకుండానే తొలి సంక్షేమ ఫలం పేదల ఇంటికి చేరింది. అవ్వాతాతలకు ఇచ్చే పింఛను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడమే కాదు గత మూడు నెలల బకాయిలు కలిపి ఒకేసారి రూ.7 వేలు అందించి ఎన్నికల హామీని ఆచరణలో చూపారు చంద్రబాబు. -
ఆదివాసీల మోముల్లో ఆనందోత్సాహాలు
[ 02-07-2024]
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ మన్యంవ్యాప్తంగా పండగలా జరిగింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లిపింఛన్లు పంపిణీ చేశారు. -
హుద్హుద్ కాలనీల కథ అంతేనా?
[ 02-07-2024]
గిరిజనులకు హుద్హుద్ తుపాను చేసిన గాయం ఇప్పటివరకు నయం కాలేదు. హుద్హుద్ తుపాను కారణంగా ఇళ్లు నష్టపోయిన గిరిజనులకు రక్షిత ప్రాంతంలో కాలనీలు నిర్మించి సొంత గూడు కల్పించాలని అప్పటి తెదేపా ప్రభుత్వం సంకల్పించింది. -
రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం
[ 02-07-2024]
రహదారుల నిర్మాణ పనులకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ పేర్కొన్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి
[ 02-07-2024]
స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యుల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.లక్ష్మి కేక్ను కోసి వైద్యులు, సిబ్బందికి అందించారు. -
జాతీయస్థాయి కుస్తీ పోటీలకు పయనం
[ 02-07-2024]
కొయ్యూరు కస్తూర్బా విద్యాలయంలో చదువుతున్న ఆరుగురు విద్యార్థినులు జాతీయస్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు సోమవారం బయలుదేరారు. -
నమ్మండి.. ఇది రహదారేనండి!
[ 02-07-2024]
దారెల పంచాయతీలోని 14 గ్రామాలకు వెళ్లే రహదారి నిర్మాణం కంకరరాళ్లకే పరిమితమైంది. పేదపేట నుంచి పేటమాలిపుట్టు, కుమ్మరిపుట్టు, డీంగుడ కూడలి వరకు రహదారి నిర్మాణం ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు. -
వాగులు పొంగే... రాకపోకలు ఆగే..
[ 02-07-2024]
కొండవాగులు పొంగితే ఆ రెండు గ్రామాల గిరిజనులు బయట ప్రాంతాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
404 కేజీల గంజాయి స్వాధీనం
[ 02-07-2024]
వేర్వేరు చోట్ల 404 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి తీసుకొచ్చి గంజాయిని ఒక చోట నిల్వ ఉంచి రవాణాకు సిద్ధపడుతుండగా ఒకరిని అరెస్టు చేసినట్లు చింతపల్లి సీఐ రమేశ్ తెలిపారు. -
గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన నిందితుడికి జైలు
[ 02-07-2024]
యువతిని గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన కేసులో నిందితుడికి పదేళ్ల కారాగార శిక్షతోపాటు రూ.7వేల జరిమానా విధిస్తూ పదకొండో అదనపు జిల్లా న్యాయస్థానం కమ్ ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) న్యాయస్థానం న్యాయమూర్తి పి.శ్రీసత్యదేవి తీర్పునిచ్చారు.