రెండు రోజుల్లో ఖర్చుల వివరాలు సమర్పించాలి
సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల ఖర్చుల వివరాలను రెండు రోజుల్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ పేర్కొన్నారు.
ఏజెంట్లతో సమావేశమైన ఎన్నికల వ్యయ పరిశీలకులు పంకజ్ సింగ్, కలెక్టర్ దినేష్కుమార్, జేసీ భావన
పాడేరు, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల ఖర్చుల వివరాలను రెండు రోజుల్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అభ్యర్థులు, ఏజెంట్లు, ప్రతినిధులతో సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో చేసిన ఖర్చుల వివరాలను సంబంధిత రికార్డుల్లో నమోదు చేసి సమర్పించాలని సూచించారు. పూర్తిగా పరిశీలించిన తరువాత ఎన్నికల కమిషన్కు పంపించాల్సి ఉంటుందన్నారు. నిధులు ఎక్కడ నుంచి వచ్చాయి, ఎవరు ఇచ్చారు. వంటి వివరాలతో ఖర్చులను పక్కాగా అందజేయాలని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ భావన, ఎన్నికల వ్యయ పరిశీలకులు పంకజ్ సింగ్, నోడల్ అధికారి సువర్ణ ఫణి తదితరులు పాల్గొన్నారు.
- పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరభ కుమార్ ప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ భావన, డీఆర్డీఏ పీడీ పాల్గొన్నారు.
- గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్కుమార్ పేర్కొన్నారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు.
అభివృద్ధి పనులకు నిధులివ్వాలని వినతి
ముంచంగిపుట్టు, న్యూస్టుడే: దారెల పంచాయతీలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని సర్పంచి పాండురంగస్వామి, తెదేపా నాయకులు శనివారం జిల్లా కలెక్టర్ దినేష్కుమార్కు వినతిపత్రం అందించారు. పెదపేట నుంచి తలింభా వరకు, డీంగుడ నుంచి పనస వరకు తారురోడ్డు నిర్మించాలని, దారెల, పేటమాలిపుట్టు, తలింబ, డొక్రిపుట్టు, గన్నెడ గ్రామాల్లో సిమెంటు రోడ్లు, కాలువలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు.
డుంబ్రిగుడ, న్యూస్టుడే: అరుకు పంచాయతీలో నెలకొన్న సమస్యలపై కలెక్టర్ దినేష్కుమార్కు వినతిపత్రం అందజేసినట్లు సర్పంచి శారద తెలిపారు. మురుగు కాలువల నిర్మాణానికి సహకరించాలని కోరారు. ప్రతి శుక్రవారం జరిగే వారపు సంతలో పారిశుద్ధ్య సమస్య నెలకొంటోందని, దీన్ని పరిష్కరించాలని పేర్కొన్నారు.
పాడేరు: కలెక్టర్ దినేష్కుమార్ను భాజపా నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భాజపా జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు, ఎస్టీ మోర్చా అధ్యక్షులు ఉమామహేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, పాడేరు నియోజకవర్గం అధ్యక్షులు కృష్ణారావు, మఠం శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాళ్లు ఏడిపించారు.. వీళ్లు ఏడువేలిచ్చారు!
[ 02-07-2024]
కూటమి సర్కారు ఏర్పడి నెలరోజులు గడవకుండానే తొలి సంక్షేమ ఫలం పేదల ఇంటికి చేరింది. అవ్వాతాతలకు ఇచ్చే పింఛను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడమే కాదు గత మూడు నెలల బకాయిలు కలిపి ఒకేసారి రూ.7 వేలు అందించి ఎన్నికల హామీని ఆచరణలో చూపారు చంద్రబాబు. -
ఆదివాసీల మోముల్లో ఆనందోత్సాహాలు
[ 02-07-2024]
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ మన్యంవ్యాప్తంగా పండగలా జరిగింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లిపింఛన్లు పంపిణీ చేశారు. -
హుద్హుద్ కాలనీల కథ అంతేనా?
[ 02-07-2024]
గిరిజనులకు హుద్హుద్ తుపాను చేసిన గాయం ఇప్పటివరకు నయం కాలేదు. హుద్హుద్ తుపాను కారణంగా ఇళ్లు నష్టపోయిన గిరిజనులకు రక్షిత ప్రాంతంలో కాలనీలు నిర్మించి సొంత గూడు కల్పించాలని అప్పటి తెదేపా ప్రభుత్వం సంకల్పించింది. -
రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం
[ 02-07-2024]
రహదారుల నిర్మాణ పనులకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ పేర్కొన్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి
[ 02-07-2024]
స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యుల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.లక్ష్మి కేక్ను కోసి వైద్యులు, సిబ్బందికి అందించారు. -
జాతీయస్థాయి కుస్తీ పోటీలకు పయనం
[ 02-07-2024]
కొయ్యూరు కస్తూర్బా విద్యాలయంలో చదువుతున్న ఆరుగురు విద్యార్థినులు జాతీయస్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు సోమవారం బయలుదేరారు. -
నమ్మండి.. ఇది రహదారేనండి!
[ 02-07-2024]
దారెల పంచాయతీలోని 14 గ్రామాలకు వెళ్లే రహదారి నిర్మాణం కంకరరాళ్లకే పరిమితమైంది. పేదపేట నుంచి పేటమాలిపుట్టు, కుమ్మరిపుట్టు, డీంగుడ కూడలి వరకు రహదారి నిర్మాణం ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు. -
వాగులు పొంగే... రాకపోకలు ఆగే..
[ 02-07-2024]
కొండవాగులు పొంగితే ఆ రెండు గ్రామాల గిరిజనులు బయట ప్రాంతాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
404 కేజీల గంజాయి స్వాధీనం
[ 02-07-2024]
వేర్వేరు చోట్ల 404 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి తీసుకొచ్చి గంజాయిని ఒక చోట నిల్వ ఉంచి రవాణాకు సిద్ధపడుతుండగా ఒకరిని అరెస్టు చేసినట్లు చింతపల్లి సీఐ రమేశ్ తెలిపారు. -
గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన నిందితుడికి జైలు
[ 02-07-2024]
యువతిని గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన కేసులో నిందితుడికి పదేళ్ల కారాగార శిక్షతోపాటు రూ.7వేల జరిమానా విధిస్తూ పదకొండో అదనపు జిల్లా న్యాయస్థానం కమ్ ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) న్యాయస్థానం న్యాయమూర్తి పి.శ్రీసత్యదేవి తీర్పునిచ్చారు.