సీలేరులో గల్లంతై.. తిరిగిరాని లోకాలకు..
నదిలో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు పడి గల్లంతైన బాలుడు సింకు(7) మృతిచెందాడు. అతడి మృతదేహం శనివారం ఉదయం కనిపించింది.
కొత్తపల్లిలో బాలుడి విషాదాంతం
కుమారుడి మృతదేహాన్ని పట్టుకుని విలపిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు
మోతుగూడెం, న్యూస్టుడే: నదిలో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు పడి గల్లంతైన బాలుడు సింకు(7) మృతిచెందాడు. అతడి మృతదేహం శనివారం ఉదయం కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి మోతుగూడెం ఎస్సై జి.గోపాలరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా మడతల్ గ్రామానికి చెందిన సోయం ముఖేష్ భువనేశ్వర్లో ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన తన ఏడేళ్ల కుమారుడు సింకును వెంటబెట్టుకుని శుక్రవారం చింతూరు మండలం కొత్తపల్లిలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చారు. బాలుడు అక్కడ ఉన్న కొంతమందితో కలిసి సీలేరు నది వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులో జారిపడి గల్లంతయ్యాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, బంధువులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. అతడు తప్పిపోయిన స్థలానికి కొంత దూరంలో శనివారం మధ్యాహ్నం మృతదేహం లభ్యమైంది. తిరిగొస్తాడనుకున్న బాలుడు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. చింతూరు ఏరియా ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాళ్లు ఏడిపించారు.. వీళ్లు ఏడువేలిచ్చారు!
[ 02-07-2024]
కూటమి సర్కారు ఏర్పడి నెలరోజులు గడవకుండానే తొలి సంక్షేమ ఫలం పేదల ఇంటికి చేరింది. అవ్వాతాతలకు ఇచ్చే పింఛను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడమే కాదు గత మూడు నెలల బకాయిలు కలిపి ఒకేసారి రూ.7 వేలు అందించి ఎన్నికల హామీని ఆచరణలో చూపారు చంద్రబాబు. -
ఆదివాసీల మోముల్లో ఆనందోత్సాహాలు
[ 02-07-2024]
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ మన్యంవ్యాప్తంగా పండగలా జరిగింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లిపింఛన్లు పంపిణీ చేశారు. -
హుద్హుద్ కాలనీల కథ అంతేనా?
[ 02-07-2024]
గిరిజనులకు హుద్హుద్ తుపాను చేసిన గాయం ఇప్పటివరకు నయం కాలేదు. హుద్హుద్ తుపాను కారణంగా ఇళ్లు నష్టపోయిన గిరిజనులకు రక్షిత ప్రాంతంలో కాలనీలు నిర్మించి సొంత గూడు కల్పించాలని అప్పటి తెదేపా ప్రభుత్వం సంకల్పించింది. -
రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం
[ 02-07-2024]
రహదారుల నిర్మాణ పనులకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ పేర్కొన్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి
[ 02-07-2024]
స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యుల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.లక్ష్మి కేక్ను కోసి వైద్యులు, సిబ్బందికి అందించారు. -
జాతీయస్థాయి కుస్తీ పోటీలకు పయనం
[ 02-07-2024]
కొయ్యూరు కస్తూర్బా విద్యాలయంలో చదువుతున్న ఆరుగురు విద్యార్థినులు జాతీయస్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు సోమవారం బయలుదేరారు. -
నమ్మండి.. ఇది రహదారేనండి!
[ 02-07-2024]
దారెల పంచాయతీలోని 14 గ్రామాలకు వెళ్లే రహదారి నిర్మాణం కంకరరాళ్లకే పరిమితమైంది. పేదపేట నుంచి పేటమాలిపుట్టు, కుమ్మరిపుట్టు, డీంగుడ కూడలి వరకు రహదారి నిర్మాణం ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు. -
వాగులు పొంగే... రాకపోకలు ఆగే..
[ 02-07-2024]
కొండవాగులు పొంగితే ఆ రెండు గ్రామాల గిరిజనులు బయట ప్రాంతాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
404 కేజీల గంజాయి స్వాధీనం
[ 02-07-2024]
వేర్వేరు చోట్ల 404 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి తీసుకొచ్చి గంజాయిని ఒక చోట నిల్వ ఉంచి రవాణాకు సిద్ధపడుతుండగా ఒకరిని అరెస్టు చేసినట్లు చింతపల్లి సీఐ రమేశ్ తెలిపారు. -
గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన నిందితుడికి జైలు
[ 02-07-2024]
యువతిని గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన కేసులో నిందితుడికి పదేళ్ల కారాగార శిక్షతోపాటు రూ.7వేల జరిమానా విధిస్తూ పదకొండో అదనపు జిల్లా న్యాయస్థానం కమ్ ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) న్యాయస్థానం న్యాయమూర్తి పి.శ్రీసత్యదేవి తీర్పునిచ్చారు.