గంజాయి కేసులో ముగ్గురికి రెండేళ్ల జైలు
గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడిన ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ స్థానిక తొమ్మిదో అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్ తీర్పు వెల్లడించారు.
చోడవరం, న్యూస్టుడే: గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడిన ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ స్థానిక తొమ్మిదో అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్ తీర్పు వెల్లడించారు. జైలు శిక్షతోపాటు రూ.20 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. శిక్ష పడిన వారిలో పి.నాగేశ్వరరావు, ముక్కి సిద్దేశ్, మోహన్ ఉన్నారు. వీరు ముగ్గురూ ముంచంగిపుట్టు మండలం మకర గ్రామానికి చెందిన వారు. 2016 అక్టోబరులో చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పోలీసులకు పట్టుబడ్డారు.
రూ.13 లక్షల విలువైన గంజాయితో ఇద్దరి అరెస్టు
చోడవరం పట్టణం: పోలీస్స్టేషన్ సమీపంలో పెట్రోలు బంకు వద్ద శనివారం ఓ కారును తనిఖీ చేసిన పోలీసులకు 300 కేజీల గంజాయి పట్టుబడింది. సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. పాడేరు నుంచి చోడవరం మీదుగా విశాఖకు కారులో గంజాయి రవాణా అవుతోందన్న సమాచారంతో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా వస్తున్న కారును పెట్రోలు బంకు వద్ద ఆపి తనిఖీ చేయగా రూ.13 లక్షల విలువైన గంజాయి పట్టుబడింది. కోరాపుట్కు చెందిన అనంత పాంగి, కిముడు నిరంజన్ను అదుపులోకి తీసుకుని కారు, గంజాయి ప్యాకెట్లను సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించినట్లు సీఐ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాళ్లు ఏడిపించారు.. వీళ్లు ఏడువేలిచ్చారు!
[ 02-07-2024]
కూటమి సర్కారు ఏర్పడి నెలరోజులు గడవకుండానే తొలి సంక్షేమ ఫలం పేదల ఇంటికి చేరింది. అవ్వాతాతలకు ఇచ్చే పింఛను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడమే కాదు గత మూడు నెలల బకాయిలు కలిపి ఒకేసారి రూ.7 వేలు అందించి ఎన్నికల హామీని ఆచరణలో చూపారు చంద్రబాబు. -
ఆదివాసీల మోముల్లో ఆనందోత్సాహాలు
[ 02-07-2024]
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ మన్యంవ్యాప్తంగా పండగలా జరిగింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లిపింఛన్లు పంపిణీ చేశారు. -
హుద్హుద్ కాలనీల కథ అంతేనా?
[ 02-07-2024]
గిరిజనులకు హుద్హుద్ తుపాను చేసిన గాయం ఇప్పటివరకు నయం కాలేదు. హుద్హుద్ తుపాను కారణంగా ఇళ్లు నష్టపోయిన గిరిజనులకు రక్షిత ప్రాంతంలో కాలనీలు నిర్మించి సొంత గూడు కల్పించాలని అప్పటి తెదేపా ప్రభుత్వం సంకల్పించింది. -
రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం
[ 02-07-2024]
రహదారుల నిర్మాణ పనులకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ పేర్కొన్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి
[ 02-07-2024]
స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యుల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.లక్ష్మి కేక్ను కోసి వైద్యులు, సిబ్బందికి అందించారు. -
జాతీయస్థాయి కుస్తీ పోటీలకు పయనం
[ 02-07-2024]
కొయ్యూరు కస్తూర్బా విద్యాలయంలో చదువుతున్న ఆరుగురు విద్యార్థినులు జాతీయస్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు సోమవారం బయలుదేరారు. -
నమ్మండి.. ఇది రహదారేనండి!
[ 02-07-2024]
దారెల పంచాయతీలోని 14 గ్రామాలకు వెళ్లే రహదారి నిర్మాణం కంకరరాళ్లకే పరిమితమైంది. పేదపేట నుంచి పేటమాలిపుట్టు, కుమ్మరిపుట్టు, డీంగుడ కూడలి వరకు రహదారి నిర్మాణం ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు. -
వాగులు పొంగే... రాకపోకలు ఆగే..
[ 02-07-2024]
కొండవాగులు పొంగితే ఆ రెండు గ్రామాల గిరిజనులు బయట ప్రాంతాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
404 కేజీల గంజాయి స్వాధీనం
[ 02-07-2024]
వేర్వేరు చోట్ల 404 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి తీసుకొచ్చి గంజాయిని ఒక చోట నిల్వ ఉంచి రవాణాకు సిద్ధపడుతుండగా ఒకరిని అరెస్టు చేసినట్లు చింతపల్లి సీఐ రమేశ్ తెలిపారు. -
గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన నిందితుడికి జైలు
[ 02-07-2024]
యువతిని గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన కేసులో నిందితుడికి పదేళ్ల కారాగార శిక్షతోపాటు రూ.7వేల జరిమానా విధిస్తూ పదకొండో అదనపు జిల్లా న్యాయస్థానం కమ్ ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) న్యాయస్థానం న్యాయమూర్తి పి.శ్రీసత్యదేవి తీర్పునిచ్చారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీజీఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్
-
ఈ నెలలోనే అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే!
-
టీ20 ప్రపంచ కప్ 2026 స్వరూపం ఇదే! 12 జట్లకు నేరుగా అర్హత
-
ఆ రోజు రోహిత్ శర్మ ఫోన్ చేయకపోయి ఉంటే..: ద్రవిడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మాకు 80 సీట్లు వచ్చినా ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్ యాదవ్