మా మదిలో మీరు.. మీ స్ఫూర్తికి జోహారు
‘భారతీయ పత్రికా రంగాన్ని మలుపుతిప్పిన ప్రజ్ఞాశాలి.. సినీరంగంలో తనదైన శైలిలో అద్భుతాలను ఆవిష్కరించిన ఘనాపాఠి.. ప్రపంచమే గర్వించే స్థాయిలో అతిపెద్ద సినీ స్టూడియో నిర్మించిన దార్శనికుడు.. పారిశ్రామిక రంగంలో తిరుగులేని విజయాలతో దూసుకెళ్లిన విజేత.. కలం బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పి.. ప్రజా సమస్యల పరిష్కారానికి వెన్నుదన్నుగా నిలిచిన ధీశాలి.. రామోజీరావు.’.. అంటూ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కొనియాడారు.
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణసభ
‘భారతీయ పత్రికా రంగాన్ని మలుపుతిప్పిన ప్రజ్ఞాశాలి.. సినీరంగంలో తనదైన శైలిలో అద్భుతాలను ఆవిష్కరించిన ఘనాపాఠి.. ప్రపంచమే గర్వించే స్థాయిలో అతిపెద్ద సినీ స్టూడియో నిర్మించిన దార్శనికుడు.. పారిశ్రామిక రంగంలో తిరుగులేని విజయాలతో దూసుకెళ్లిన విజేత.. కలం బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పి.. ప్రజా సమస్యల పరిష్కారానికి వెన్నుదన్నుగా నిలిచిన ధీశాలి.. రామోజీరావు.’.. అంటూ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ శివారులోని కృష్ణా జిల్లా కానూరులో రామోజీ సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభను గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరవ్వగా.. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామోజీరావు ఏ రంగంలో ప్రవేశించినా.. అకుంఠిత దీక్ష, పట్టుదల, క్రమశిక్షణతో విజయతీరాలను చేరేవారని, ఆయన చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శనీయమని ప్రముఖులు కొనియాడారు. సంస్మరణ సభలో వేలాది మంది సామాన్య ప్రజలు పాల్గొని మహనీయునికి నివాళులర్పించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రామోజీరావు జీవిత ప్రస్థానం చిత్ర ప్రదర్శన ఆకట్టుకుంది.
ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రసంగిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
మంత్రి కొల్లు రవీంద్ర, ఉమా తదితరుల నివాళి
రామోజీరావు జీవిత విశేషాలపై చిత్ర ప్రదర్శన
సభకు తరలివచ్చిన ప్రజలు
నివాళి అర్పిస్తున్న ‘ఈనాడు’ తెలంగాణ ఎడిటర్ డి.ఎన్.ప్రసాద్
అంజలి ఘటిస్తున్న ‘ఈనాడు’ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు
సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు
దగ్గుబాటి సురేష్బాబు
బోయపాటి శ్రీను
శ్యాంప్రసాద్ రెడ్డి
సినీ నటి జయసుధ
కీరవాణి, రాజమౌళి
కోనసీమ గోడిలంక నుంచి రామోజీ విగ్రహాన్ని తీసుకొస్తున్న మాధవరావు కుమారులు
తరలివస్తున్న నారీమణులు
అడుగడుగునా అభిమానమే..
‘మార్పు’ చిత్రంలో అతిథి పాత్రలో..
అలరించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శన
ఈనాడు, అమరావతి న్యూస్టుడే, కానూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన్యం బాలలకు కార్పొరేట్ విద్య!
[ 30-06-2024]
ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునేలా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (ఉత్తమ పాఠశాలలు) పథకాన్ని పునరుద్ధరించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. -
ఆంగ్లం చదవలేరు.. తెలుగు రాయలేరు!
[ 30-06-2024]
ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దిగజారడంపై జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. -
పేదల ఆరోగ్యానికి సర్కారు భరోసా
[ 30-06-2024]
పేదల ఆరోగ్య భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను గుర్తించి వాటిని ప్రక్షాళన చేసే దిశగా చర్యలు చేపట్టింది. -
రెండు రోజుల్లో ఖర్చుల వివరాలు సమర్పించాలి
[ 30-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల ఖర్చుల వివరాలను రెండు రోజుల్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ పేర్కొన్నారు. -
గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తాం
[ 30-06-2024]
గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ పేర్కొన్నారు. పాడేరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని శనివారం ఆయన సందర్శించారు. -
జీవో నం.3 పునరుద్ధరించాలని వినతి
[ 30-06-2024]
తెదేపా జాతీయ కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను శనివారం అమరావతిలో పాడేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. -
మా భూముల జోలికొస్తే ఊరుకోం
[ 30-06-2024]
మాజీ సైనికుల పేరిట పలువురు తమ భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని గరుగుబిల్లి పంచాయతీ సింగవరం గ్రామస్థులు పేర్కొన్నారు. -
సీలేరులో గల్లంతై.. తిరిగిరాని లోకాలకు..
[ 30-06-2024]
నదిలో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు పడి గల్లంతైన బాలుడు సింకు(7) మృతిచెందాడు. అతడి మృతదేహం శనివారం ఉదయం కనిపించింది. -
గంజాయి కేసులో ముగ్గురికి రెండేళ్ల జైలు
[ 30-06-2024]
గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడిన ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ స్థానిక తొమ్మిదో అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్ తీర్పు వెల్లడించారు.