వనరుల దోపిడీకి వత్తాసు
వైకాపా పాలనలో పోలీసులే కాదు రెవెన్యూ, ఇంజినీరింగ్, అటవీ అధికారుల్లో చాలామంది అప్పటి నేతలతో అంటకాగి తిరిగారు.
వైకాపా నేతల సేవలో తరించిన అధికారులు
ఈనాడు, రంపచోడవరం, అనకాపల్లి : వైకాపా పాలనలో పోలీసులే కాదు రెవెన్యూ, ఇంజినీరింగ్, అటవీ అధికారుల్లో చాలామంది అప్పటి నేతలతో అంటకాగి తిరిగారు. తమ పరిధిలో భూములు, సంపదను చేతనైనంతగా దోచిపెట్టారు. అక్రమ సంపాదనకు మార్గాలను చూపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి ఇంజినీరింగ్ విభాగంలో ఈఎన్సీ వరకు అంతా వైకాపా నేతలు చెప్పినట్టే తలూపారు. నియమాలు, నిబంధనలను తుంగలోకి తొక్కి నాటి నేతలకు మేలు చేయడానికే ప్రాధాన్యమిచ్చారు. పనిలో పనిగా తామూ కొంత వెనుకేసుకున్నారు.
అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని కొంతమంది అధికారులు దోచుకో.. దాచుకో అన్నతీరున వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. కండువా వేసుకోని వైకాపా కార్యకర్తల్లా అధికారులే పనిచేయడంతో నాటి విపక్షాలు ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో కొత్త నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రదక్షిణలు చేస్తున్నారు..
కోడ్ వచ్చినా లెక్కేలేదీ తహసీల్దారుకు..
అనకాపల్లి తహసీల్దారుగా పనిచేసిన గంగాధర్కు వైకాపా నేతలు చెప్పిందే వేదం. వారు చెప్పిన వారికే మ్యుటేషన్ చేసేవారు.. లేకుంటే నెలల తరబడి తిప్పేవారు. జగనన్న కాలనీలను ఆనుకుని వైకాపా నేతలు ఆక్రమించిన స్థలాలకు ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లు (ఎల్పీసీ) జారీచేసి ప్రభుత్వ భూములను పరులపరం చేసేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఈయన రాత్రికి రాత్రి సుమారు 500 పైగా ఎల్పీసీలపై సంతకాలు చేసి ఇచ్చినట్లు తెదేపా నేతలు ఆందోళనలు చేశారు. ఇందుకుగాను వైకాపా నేతల నుంచి భారీగా సొమ్ములు ముట్టినట్లు ఆరోపణలూ ఉన్నాయి. ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్న ఈయన్ని ఎన్నికల వేళ వేరే విభాగానికి మార్చారు.
చోడవరం నియోజకవర్గంలో ఏసీబీ వలలో చిక్కుకున్న అప్పటి తహసీల్దారు రవికుమార్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. జగనన్న లేఅవుట్ల చదునులో, భూ రికార్డుల బదలాయింపులో లంచాలు భారీగా దండుకునేవారు. మీరిచ్చే నగదులో కొంత ఎమ్మెల్యేకి కూడా ఇవ్వాలని దర్జాగా చెప్పేవారు. మ్యుటేషన్ నిమిత్తం రూ.12 లక్షలు లంచం డిమాండ్ చేసి కొంత నగదు కార్యాలయంలోనే తీసుకుంటుండగా దొరికిపోయారు..
అనంత బాబుకు అడవినే అప్పగించేశారు..
రంపచోడవరం డీఎఫ్వో నరేంద్రియన్ ఎమ్మెల్సీ అనంత బాబుతో పాటు వైకాపాకు అనుకూలంగా వ్యవహరించేవారనే ఆరోపణలున్నాయి. ఏజెన్సీ నుంచి విలువైన కలప అక్రమ తరలిపోతున్నా ఎమ్మెల్సీ చెబితే అటుగా కన్నెత్తి చూసేవారు కాదు. అటవీ బీటు అధికారి నుంచి రేంజర్ వరకు అంతా ఆయన కనుసన్నల్లోనే పనిచేశారు. ఒకవిధంగా అడవి మొత్తం అనంత బాబుకు అడ్డగోలుగా అప్పగించేశారు. ఇదివరకు ఓసారి రోజ్వుడ్తో చేసిన ఫర్నిచర్ను పట్టుకుని స్టేషన్లో పెట్టి మరుసటి రోజునే వదిలేశారు. ‘ఇదేమిటి సార్?, నిన్న మేమే కదా సమాచారం ఇచ్చి పట్టుకోమన్నాం కదా?’ అని భాజపా నాయకురాలు ఒకరు అటవీ రేంజర్ని ప్రశ్నించారు. ‘బాబుగారు ఫోన్చేసి చెప్పారమ్మా.. అందుకే వదిలేశాం!’ అని చెబుతూ స్వామిభక్తిని చాటుకున్నారు.
బూడి మాటే వేదంగా..
మాడుగుల నియోజకవర్గంలో తాజా మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పిందే అక్కడి రెవెన్యూ అధికారులకు వేదం. ఆయన అనుమతి లేకుండా ఎలాంటి భూ లావాదేవీలు జరగడానికి వీల్లేదని ఆదేశించారు. వాటిని అధికారులు శిరసా వహించేవారు. మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి తహీసీల్దార్లుగా పనిచేసిన పీవీ రత్నం, రాణి, మర్రి లక్ష్మి, రమేష్బాబులు తమ పరిధిలోని బంజరు, ప్రభుత్వ, దేవాదాయ భూముల్ని మంత్రితో పాటు వారి అనుచర గణానికి కట్టబెట్టేశారు. ఇసుక మాఫియాకు తలుపులు బార్లా తీశారు. రేయింబవళ్లు ఇసుక తరలిపోతున్నా, ఏ మాత్రం పట్టించుకోకుండా తమ వాటా తమకు అందుతుందో లేదో చూసుకునే వారు. తెదేపాకు చెందిన వారెవరైనా పొలాల్లోకి మట్టి తీసుకెళ్లినా వారిపై అక్రమ కేసులు బనాయించి, వైకాపా మంత్రికి విధేయత చూపించేవారు.
పని చేయకున్నా బిల్లులు ఇచ్చేశారు..
రంపచోడవరం ఐటీడీఏలో గిరిజన సంక్షేమశాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా పనిచేస్తున్న జి.డేవిడ్రాజు అనంత బాబుకు నమ్మినబంటులా వ్యవహరించేవారు. ఆయన చెప్పిన వారికి మాత్రమే రోడ్లు, భవనాలు, మంచినీటి ట్యాంకుల నిర్మాణాలను అప్పగించేవారు. గత ఏడాది పనులు మొదలుపెట్టకుండానే వైకాపా నేతలకు రూ.9.40 కోట్లు అడ్వాన్స్గా చెల్లించేశారు. దీనిపై ఆడిట్ అధికారులు గుర్తించి అభ్యంతరం తెలిపారు. ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే గత ఏడాది సెప్టెంబరులో ఈఈ డేవిడ్రాజును గిరిజన సంక్షేమ శాఖకు సరెండర్ చేశారు. అయితే ఎమ్మెల్సీ అనంత బాబు అండదండలతో నెల రోజులు గడవకుండానే మరల ఈఈగా విధుల్లో చేరారు.
- చోడవరం పంచాయతీరాజ్ సబ్ డివిజన్ డీఈఈ ప్రసాదరావు పనిచేస్తున్నారు. ఈయన స్వగ్రామం రావికమతం మరుపాక. ప్రసాదు భార్య పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి గ్రామంలో పనులను డీఈఈ అడ్డుకుంటున్నారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధర్మశ్రీ కలుగజేసుకుని సమస్య పోలీసుల వరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. విప్ సిపార్సు చేసిన పనులకు బిల్లులు చేయడమే ఈయన విధి.
- అరకులోయ నియోజకవర్గంలో మిషన్ కనెక్ట్ పాడేరు రోడ్ల పనులన్నీ తాజా మాజీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ చెప్పిన గుత్తేదారుకే అప్పగించారు. అక్కడ ఈఈగా పనిచేసి ప్రస్తుతం ఈఎన్సీగా చేస్తున్న శ్రీనివాసరావు తన బినామీలతో అరకొరగా పనులు చేయించి బిల్లులు పూర్తిగా మార్చుకునేవారు. వాటిలో కొంత మొత్తాన్ని ఎమ్మెల్యేకు కమీషన్గా చెల్లించేవారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భార్యలిద్దరు.. ‘మూడో పెళ్లి చేశారు’
[ 01-07-2024]
భర్తకు ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లి చేశారు. వారే పెళ్లి పెద్దలుగా వ్యవహరించి అక్షింతలు వేశారు. పెదబయలు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కూటమి హయాం.. ఐటీడీఏలకు జీవం!
[ 01-07-2024]
గిరిజనులకు అండగా నిలుస్తూ.. గిరిజనాభివృద్దిని దిశా నిర్దేశం చేసిన ఐటీడీఏలు వైకాపా పాలనలో భ్రష్టుపట్టాయి. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ వెలుగు వెలిగిన గిరిజనాభివృద్ధి సంస్థలు 2019-2024 మధ్య నిర్వీర్యమయ్యాయి. -
మేమున్నామని.. మీకేం కాదని!
[ 01-07-2024]
వైద్యో నారాయణ హరి అన్నది పెద్దలు చెప్పినమాట. ఆపద సమయంలో ప్రాణంపోసే వైద్యుడిని దేవుడితో సమానంగా చూస్తాం. రాత్రి, పగలు తేడాలేకుండా నిరంతరం విధినిర్వహణలో ఉంటూ సేవలందించే వారిలో వైద్యులే ముందువరుసలో ఉంటారు. -
తుక్కు బస్సులతో.. అవస్థలు
[ 01-07-2024]
ఆర్టీసీ బస్సు ఛార్జీలను మూడుసార్లు పెంచేసిన వైకాపా ప్రభుత్వం బస్సుల నిర్వహణను మాత్రం గాలికొదిలేసింది. తుక్కు కింద మార్చాల్సిన వాటిని రోడ్డెక్కించేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. వాటిని సక్రమంగా నిర్వహించకపోవడంతో కొన్ని బస్సుల్లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. -
సందర్శకుల భద్రతే ముఖ్యం
[ 01-07-2024]
పర్యటకం అభివృద్ధి చెందడం ఎంత ముఖ్యమో, ఆ కేంద్రాలను చూడటానికి వచ్చే సందర్శకుల భద్రత అంతకన్నా ముఖ్యమని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. దేవీపట్నం మండలం పోశమ్మగండి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఆయన పర్యటించారు. -
భారీ వర్షానికి పొంగిన వాగులు
[ 01-07-2024]
మండలంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత కురిసిన భారీ వర్షానికి ఆదివారం వాగులు పొంగి ప్రవహించాయి. వీఆర్పురం- ఉమ్మడివరం మధ్య ప్రధాన రహదారిపైన అన్నవరం వాగు పొంగి ప్రవహించింది. -
ప్రధాని అరకు కాఫీని ప్రశంసించడం గర్వకారణం
[ 01-07-2024]
మన్ కీ బాత్ కార్యక్రమంలో అరకు కాఫీ గురించి ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావించడం.. ప్రశంసించడం గిరిజన సహకార సంస్థకి (జీసీసీ) గర్వకారణమని సంస్థ ఎండీ సురేష్కుమార్ తెలిపారు. -
ప్రమాద బాధితులను ఆదుకుంటే పారితోషికం
[ 01-07-2024]
రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు మానవత్వంతో స్పందించి వెంటనే బాధితులను సమీప ఆసుపత్రిలో చేర్చిన వారికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రూ.5 వేలు నగదు బహుమతి ఇవ్వనున్నట్లుగా రవాణాశాఖ మంత్రి ఎం.రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు. -
గంజాయి స్మగ్లర్లు కటకటాల పాలు
[ 01-07-2024]
రాజీవ్ రహదారి మీదుగా సినీఫక్కీలో పనస పండ్ల మధ్య 33 కిలోల గంజాయిని బొలెరో వాహనంలో తరలిస్తున్న స్మగ్లర్ల ముఠాను సైబరాబాద్ పోలీసులు శామీర్పేట టోల్గేట్ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకుని ముగ్గురిని రిమాండ్కు తరలించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాగ్ అశ్విన్ పాత ఫొటో.. మోక్షజ్ఞ కొత్త స్టిల్: వైరల్
-
ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయండి..! గాజావాసులకు ఇజ్రాయెల్ మరోసారి ఆదేశం
-
ఏపీ మాజీ సీఎం జగన్ నివాసం వద్ద హై సెక్యూరిటీ ఏర్పాట్లు తొలగింపు
-
అర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్కుమార్కు అదనపు బాధ్యతలు
-
అందుకే ‘భారతీయుడు 2’ తీశా.. పార్ట్ 3 రిలీజ్ అప్పుడే: శంకర్
-
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు చేసిన ఎన్డీయే