logo

Adilabad: రిమ్స్‌ను గ్రీన్ ఛానెల్‌గా మారుస్తున్నాం

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో వెయ్యి మొక్కలు నాటేలా లక్ష్యం పెట్టుకున్నామని, ఆసుపత్రిని గ్రీన్ ఛానల్ గా మారుస్తామని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు.

Published : 03 Jul 2024 15:56 IST

ఎదులాపురం: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో వెయ్యి మొక్కలు నాటేలా లక్ష్యం పెట్టుకున్నామని, ఆసుపత్రిని గ్రీన్ ఛానల్ గా మారుస్తామని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. బుధవారం స్థానిక రిమ్స్ క్వార్టర్స్‌లో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. రిమ్స్‌లో పచ్చదనం పెంపొందించడానికి ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రిమ్స్‌లో పచ్చదనం పెంచడం కారణంగా ఇటీవల గ్రీన్ ఛానెల్ అవార్డు కూడా వచ్చిందని గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని