logo

Adilabad: జిల్లా జైలు నుంచి ముగ్గురు ఖైదీల విడుదల

వివిధ నేరాలకు పాల్పడి జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ఖైదీలు అర్హత సాధించారు.

Published : 03 Jul 2024 18:50 IST

ఎదులాపురం: వివిధ నేరాలకు పాల్పడి జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ఖైదీలు అర్హత సాధించారు.  ఆ ముగ్గురు కూడా హత్య కేసుల్లో నేరస్తులుగా 13 ఏళ్లుగా జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.  జైలు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. విడుదలైన వారిలో ఇద్దరు తమ వ్యవసాయం చూసుకుంటామని చెప్పారని, ఒకరికి స్థానిక జిల్లా జైలు నిర్వహిస్తున్న పెట్రోల్ పంపులో ఉపాధి కల్పించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని