logo

Adilabad: విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి చెందిన సంఘటన మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఆర్‌కే కాలనీలో బుధవారం చోటుచేసుకుంది.

Published : 03 Jul 2024 19:22 IST

ఎదులాపురం: విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి చెందిన సంఘటన మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఆర్‌కే కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. ఇన్‌ఛార్జి ఎస్‌ఐ ముజాహిద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బజార్ హత్నూర్ మండలం భూతాయికి ఫడ్ బాలాజీకి కుమారుడు గోపాల్ కాలనీలో ఆడుకుంటూ సందు గుండా వెళుతుండగా ప్రమాదవశాత్తు రఫీక్ ఇంటి కిటికీకి అమర్చిన కూలర్‌ను ముట్టుకున్నాడు. కూలర్‌కు కరెంటు సరఫరా అవుతుండటంతో విద్యుదాఘాతానికి గురై పక్కనే ఉన్న డ్రెయిన్‌లో పడి మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కూలర్‌ ఏర్పాటు చేసి నిర్లక్ష్యంగా వదిలేసిన రఫీక్‌పై ఏఎస్‌ఐ యూనుస్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని