logo

Adilabad: ఆర్జీయూకేటీకి ముగ్గురు విద్యార్థుల ఎంపిక

నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బోర్గాం జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు బుధవారం బాసరలోని ఆర్జీయూకేటీలో సీట్లు సాధించారు.

Published : 03 Jul 2024 19:21 IST

తానూరు: నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బోర్గాం జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు బుధవారం బాసరలోని ఆర్జీయూకేటీలో సీట్లు సాధించారు. పాఠశాలకు చెందిన బి.ధనుంజయ్ పదవ తరగతిలో 10/10 జీపీఏ, సీహెచ్. దినేష్ 9/8 జీపీఏ, సీహెచ్. స్నేహ 9/8 జీపీఏ సాధించారు. ఈ ముగ్గురు విద్యార్థులు ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు బోర్గాం ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రతిభ చాటారు. వారిని ప్రధానోపాధ్యాయులు కె.శంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని