logo

Adilabad: రేషన్ బియ్యం పట్టివేత

ఆదిలాబాద్ పట్టణం తిర్పల్లిలోని ఓ గోడౌన్‌లో నిల్వ ఉంచిన దాదాపు వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం టూటౌన్ పోలీసులు పట్టుకున్నారు.

Published : 02 Jul 2024 20:32 IST

ఎదులాపురం: ఆదిలాబాద్ పట్టణం తిర్పల్లిలోని ఓ గోడౌన్‌లో నిల్వ ఉంచిన దాదాపు వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం టూటౌన్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ అశోక్, పోలీసులు నరేష్, రమేష్, క్రాంతి గోదామును పరిశీలించి ఈ మేరకు నిల్వలను గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని