logo

Adilabad: ధర్నా కార్యక్రమానికి తరలిరావాలి

కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని కోరుతూ ఈనెల 15న హైదరాబాదులోని కార్మిక శాఖ కమిషనరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నారు.

Published : 01 Jul 2024 16:50 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని కోరుతూ ఈనెల 15న హైదరాబాదులోని కార్మిక శాఖ కమిషనరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు తరలి రావాలని భవన నిర్మాణ కార్మిక సంఘం(ఏఐటీయూసీ అనుబంధం) జిల్లా ప్రధాన కార్యదర్శి గాజంగుల రాజు పిలుపు ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామం నుంచి తాపీ మేస్త్రీలు, పెయింటర్లు, వడ్రంగులు, ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు అధిక సంఖ్యలో హాజరై ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా కార్మిక సంఘాల నాయకులు ఎస్.కె.నూర్, రమేష్, భీమ్ రావు, ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు