logo

Adilabad: పునరావాస కేంద్రాన్ని సందర్శించిన పీడీ

రిమ్స్‌లో నిర్వహిస్తున్న పునరావాస కేంద్రం (డి అడిక్షన్ సెంటర్)ను ఐసీడీఎస్ పీడీ సబిత బుధవారం రిమ్స్ డైరెక్టర్ రాథోడ్‌తో కలిసి పరిశీలించారు.

Published : 03 Jul 2024 17:57 IST

ఎదులాపురం: రిమ్స్‌లో నిర్వహిస్తున్న పునరావాస కేంద్రం (డి అడిక్షన్ సెంటర్)ను ఐసీడీఎస్ పీడీ సబిత బుధవారం రిమ్స్ డైరెక్టర్ రాథోడ్‌తో కలిసి పరిశీలించారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారిన వారిలో పరివర్తన తీసుకు రావడానికి రిమ్స్‌లో మానసిక వైద్యనిపుణుడు డాక్టర్ ఓంప్రకాష్ ఆధ్వర్యంలో వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ వార్డులో పదహారు మంది చికిత్స పొందుతున్నారు. జిల్లా పాలనాధికారి ఉత్తర్వుల మేరకు పునరావాస కేంద్రంలోని సౌకర్యాలను పరిశీలించినట్లు ఆమె పేర్కొన్నారు. నివేదికను జిల్లా పాలనాధికారికి అందజేస్తామన్నారు. ఆమె వెంట సీడీపీఓలు వనజ, నర్సమ్మ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని