రంగంలోకి బడా నేతలు
ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జహీర్ రంజానీపై అవిశ్వాస తీర్మాన నేపథ్యంలో ఆయా పార్టీల బడానేతలు రంగంలోకి దిగడంతో ఎన్నిక రసవత్తరంగా మారుతోంది.
పుర అవిశ్వాసం రసవత్తరం
మిగతా భారాస కౌన్సిలర్లు శిబిరానికి తరలింపు
న్యూస్టుడే, ఆదిలాబాద్ పట్టణం
ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జహీర్ రంజానీపై అవిశ్వాస తీర్మాన నేపథ్యంలో ఆయా పార్టీల బడానేతలు రంగంలోకి దిగడంతో ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. భారాసకు చెందిన మాజీ మంత్రి జోగు రామన్న, అటు భాజపాకు చెందిన ఎమ్మెల్యే పాయల్ శంకర్లు ఎప్పటికప్పుడు తమ కౌన్సిలర్లతో చర్చిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. భారాస, భాజపా కౌన్సిలర్లతోపాటు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంపై సంతకం చేయడంతో అంతా కలిసికట్టుగా ఎత్తుగడలు వేస్తూ వస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి సీతక్క, ఇతర నేతలు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టడం రాజకీయం మరింత రాజుకుంటోంది. కాంగ్రెస్ దూకుడు పెంచడంతో భారాస నుంచి వలసలు పెరిగాయి. అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజునే భారాస నుంచి ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరగా ఆ తరువాత మరో నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి సీతక్క సమక్షంలో ఇద్దరు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సమక్షంలో మరో ఇద్దరు కౌన్సిలర్లు హైదరాబాద్లో కాంగ్రెస్ కండువా వేసుకున్నారంటే ఆ పార్టీ అవిశ్వాసాన్ని ఏమేరకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. రాజధాని నుంచే కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోందనే ప్రచారం జరుగుతోంది. అందుకనే స్థానికంగా తమ ప్రాబల్యం తగ్గకుండా ఇటు మాజీ మంత్రి జోగు రామన్న, అటు ఎమ్మెల్యే పాయల్ శంకర్లు వ్యూహరచన చేస్తుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
రెండు విడతలుగా..
కాంగ్రెస్ పార్టీ వల వేస్తుండటంతో శుక్రవారం 8 మంది భారాస కౌన్సిలర్లను కుటుంబీకులతో కలిసి ప్రత్యేక శిబిరానికి తరలించారు. తాజాగా ఆదివారం మిగతా కౌన్సిలర్లు ప్రత్యేక వాహనాల్లో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆదిలాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. అంతకుముందు మాజీ మంత్రి జోగు రామన్నను శాంతినగర్లోని ఆయన నివాసంలో కలుసుకొని అవిశ్వాసంపై చర్చించారు. ఎలాగైనా అవిశ్వాసం నెగ్గుతుందని వారు పూర్తి భరోసాతో ఉన్నారు. ప్రత్యేక సమావేశం నిర్వహించే 18వ తేదీ ఉదయం వరకు వారు శిబిరంలోనే ఉండనున్నట్లు తెలిసింది. మరోపక్క భాజపా కౌన్సిలర్లతోనూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ శనివారం సుదీర్ఘంగా చర్చించి సూచనలు చేశారు. అవిశ్వాసం నెగ్గేందుకు 33 మంది సభ్యుల బలం అవసరం. 32 మంది సభ్యుల సంఖ్యా బలం ఉండటంతో కాంగ్రెస్ కౌన్సిలర్లపై గురిపెట్టారు. దీంట్లో భాగంగానే గతంలో తమ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు కౌన్సిలర్లను ప్రత్యేక శిబిరానికి తరలించినట్లు భారాస వర్గాలు చెబుతుండటం ఉత్కంఠ భరితంగా మారింది. కాంగ్రెస్ వర్గాలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నాయి. సంఖ్యాబలం లేక అవిశ్వాసం వీగిపోతుండడంతోనే భారాస ఇలా దుష్ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ప్రచారం మొదలెట్టారు. కాంగ్రెస్ పార్టీ సైతం క్యాంపు ఏర్పాట్లకు కసరత్తు చేస్తోంది. ఒకటి రెండు రోజుల్లో వారు శిబిరానికి వెళ్లనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలి
[ 18-07-2024]
రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. -
రైతు రుణమాఫీ సంబరాలు
[ 18-07-2024]
తాంసి మండలం బండలనాగపూర్లో గురువారం నిర్వహించిన రైతు రుణమాఫీ సంబరాల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. -
పంట రుణాల మాఫీపై రైతుల హర్షం
[ 18-07-2024]
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని రైతులు పంట రుణాల మాఫీపై హర్షం వ్యక్తం చేశారు. -
మద్యం మత్తులో మహిళ హంగామా
[ 18-07-2024]
మత్తులో ఒక మహిళ ఆర్టీసీ బస్సులో హంగామా సృష్టించింది. -
8 మంది కాంగ్రెస్ నాయకుల సస్పెండ్
[ 18-07-2024]
-
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలి
[ 18-07-2024]
సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. -
బల్దియాలో నెగ్గిన అవిశ్వాస తీర్మానం
[ 18-07-2024]
బల్దియాలో వైస్ ఛైర్మన్ జహీర్ రంజానిపై భారాస, భాజపా సభ్యులు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. -
రిమ్స్ను పరిశీలించిన కలెక్టర్
[ 18-07-2024]
జిల్లాలో త్వరలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలం, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా రిమ్స్లో ఏర్పాట్లను పరిశీలించారు. -
ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు
[ 18-07-2024]
ఆదిలాబాద్ బల్దియా వైస్ ఛైర్మన్ జహీర్ రంజానిపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
‘ఆల్ ది బెస్ట్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించిన పోలీసులు
[ 18-07-2024]
డీఎస్సీ పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు పోలీస్ శాఖ తరఫున ఆదిలాబాద్లో ఆల్ ది బెస్ట్ తెలిపారు. -
జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన డీఎస్సీ పరీక్ష
[ 18-07-2024]
పట్టణ శివారులోని నలంద డిగ్రీ కళాశాల కేంద్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ) ప్రారంభమైంది. -
అవిశ్వాస‘పురం’లో ఆధిక్యం ఎవరిదో?
[ 18-07-2024]
ఆదిలాబాద్ పురపాలికలోని రాజకీయ తుపాను గురువారం తీరం దాటనుంది. దీనివల్ల అనుహ్యపరిణామాలు తలెత్తుతాయా..సాధారణ పరిస్థితులే కొనసాగుతాయా అనేది తేలనుంది. -
పది మంది పీఆర్ సూపరింటెండెంట్లకు బదిలీ
[ 18-07-2024]
ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల్లో భాగంగా బుధవారం పంచాయతీరాజ్ జోనల్స్థాయి ఉద్యోగులకు కలెక్టర్ కార్యాలయంలోని అదనపు కలెక్టర్ శ్యామలదేవి ఛాంబర్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. -
కవ్వాల్లో పెద్దపులులే లేవు..
[ 18-07-2024]
రాష్ట్రంలోనే ప్రసిద్ధి పొందిన కవ్వాల్ పులుల అభయారణ్యంలో ఒక్కటంటే ఒక్క పెద్దపులి లేదు. అడపా, దడపాగా మహారాష్ట్ర తాడోబా అభయారణ్యం నుంచి వచ్చే వెళ్లే వ్యాఘ్రాలే తప్పితే స్థానికంగా వాటి ఆచూకీ లేదనే తేలింది. -
గడిచింది ఏడాది..నాణ్యత జాడేది?
[ 18-07-2024]
తొలకరి వర్షంతో నాలుగు వరుసల రహదారి నాణ్యతలేమి తేటతెల్లమైపోయింది. అడుగడుగునా గుంతలతో, కుంగిన వంతెనలతో ప్రమాదకరంగా మారింది. -
అక్షర స్ఫూర్తి.. చైతన్య దీప్తి
[ 18-07-2024]
నిరక్షరాస్యులకు అక్షర జ్ఞానం కల్పించేందుకు వయోజన విద్యాశాఖ అధికారులు చేసిన ప్రయత్నం వారిలో వెలుగులు నింపింది. -
రుణమాఫీ కల.. నెరవేరనున్న వేళ
[ 18-07-2024]
పంట రుణమాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతలకు ఎట్టకేలకు తీపి కబురు వచ్చేసింది. అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణవిముక్తి ప్రసాదించనుంది. -
కూలనున్న బడి.. జ్ఞాపకాల ఒరవడి
[ 18-07-2024]
వారంతా ఉన్నత చదువులు చదివినా, పెద్ద పెద్ద ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నా, ప్రజాప్రతినిధులు అయినా.. ఇలా ఎవరి వ్యాపకాల్లో వారున్నా.. తమ బాల్యంలోని స్నేహితులందరిని ఒకసారి కలవాలనుకున్నారు. -
మూడురోజులే గడువు.. మొదలైన గుబులు
[ 18-07-2024]
జిల్లా వైద్యారోగ్యశాఖలో బదిలీల గుబులు మొదలైంది. మరో మూడు రోజుల్లో వీరి భవితవ్యం తేలనుంది. ఈ నెల 18 నుంచి 20 వరకు ఆరోగ్యశాఖలో బదిలీల ప్రక్రియ పూర్తికానుంది. -
వాన జల్లు.. ఆశల చిగుళ్లు..
[ 18-07-2024]
జిల్లాలో మోస్తరుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతకు ఊరటనిచ్చాయి. ప్రస్తుత వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు గట్టివాన పడకపోవడంతో రైతులు ఆకాశంవైపు దీనంగా చూస్తున్న తరుణంలో రెండు రోజులుగా కురిసిన వానకు అన్నదాతల్లో హర్షం వ్యక్తం అవుతోంది. -
ఆహారశుద్ధి .. ఎప్పటికో లబ్ది
[ 18-07-2024]
బెల్లంపల్లి పట్టణంలో ఆహారశుద్ధి పరిశ్రమ మండలం (ఫుడ్ ప్రాసెసింగ్ జోన్) పనులు కొనసాగుతూనే ఉన్నాయి. -
అతివలకు అండగా సఖీ కేంద్రం
[ 18-07-2024]
మహిళలు చైతన్యవంతులై అన్ని రంగాల్లో మగవారికి దీటుగా దూసుకెళుతున్నారు. అయినా వేధింపులు, అణిచివేతలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. -
స్వర్ణకారుల దుకాణాల్లో చోరీ
[ 18-07-2024]
పట్టణంలోని పద్మావతి కాలనీ మహాలక్ష్మి జ్యుయలరీ మార్కెట్ నగల తయారీ దుకాణాల్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత చోరీలు జరిగాయి. -
చిగురించిన ఆశలు..?
[ 18-07-2024]
వానల్లేవని బెంగపెట్టుకున్న అన్నదాతలను తాజాగా కురుస్తున్న వర్షాలు సంతోషపర్చాయి. మృగశిర కార్తె ప్రారంభంలో కురిసిన వర్షాలకు రైతులు పసుపు, పత్తి, సోయా, మొక్కజొన్న, పప్పుదినుసుల విత్తనాలు విత్తుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నక్సలిజం సమస్యను మూడేళ్లలో పరిష్కరిస్తాం: ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం
-
‘ఇండియా’ కూటమి ఎంపీ ఎన్నికపై హైకోర్టుకు పన్నీర్ సెల్వం
-
ఇటలీ ప్రధానిపై పోస్టు.. జర్నలిస్టుకు జరిమానా
-
పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. వరదలో చిక్కుకున్న 20 మంది కూలీలు
-
జాన్వీకపూర్కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన నటి
-
తిరుమల అన్నప్రసాద వితరణ కార్మికుల ధర్నా