అడుగుకో గుంత.. ప్రాణాలకు లేదు భరోసా!
రహదారులు బాగుంటేనే రవాణా సాఫీగా సాగుతుంది. ప్రమాదాలు జరగవు. జాతీయ రహదారి 44 పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జాతీయ రహదారిపైకి వెళితే సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం లేదు.
జాతీయ రహదారి దుస్థితి
పట్టించుకోని అధికారులు
న్యూస్టుడే, ఇచ్చోడ, గుడిహత్నూర్
రోడ్లు సరిగ్గా నిర్వహించలేనప్పుడు టోల్ వసూలు చేయొద్దు. గుంతలతో కూడిన రహదారులు, టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ.. ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.
- ఇటీవల కేంద్ర రహదారి, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీ నేషనల్ హైవే అధికారులు టోల్ ఏజెన్సీలతో అన్న మాటలివి..
నిత్యం ప్రమాదాలు..
ఇది సీతాగోంది సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద పరిస్థితి. అడుగుకో గుంత ఏర్పడటంతో వాహనదారులు ఎటువైపు వెళ్లాలో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. గుంతలను తప్పించే క్రమంలో వెనుక వైపు నుంచి వేగంగా వచ్చే వాహనాలు ఢీకొని ప్రాణాలు కోల్పోతున్నారు.
రహదారులు బాగుంటేనే రవాణా సాఫీగా సాగుతుంది. ప్రమాదాలు జరగవు. జాతీయ రహదారి 44 పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జాతీయ రహదారిపైకి వెళితే సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం లేదు. నిత్యం దేశం నలుమూలల నుంచి వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రహదారిపై గుంతలు ఏర్పడి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పరిపాటిగా మారింది. టోల్ వసూలుపై ఉన్న శ్రద్ధ సౌకర్యాల కల్పనపై లేకపోవడం గమనార్హం.
జిల్లాలో దేవాపూర్ చెక్పోస్టు నుంచి ఇచ్చోడ వరకు దాదాపు 24 కిలోమీటర్ల వరకు రోడ్డు గుంతలమయంగా మారింది. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వెళ్లే రహదారి పూర్తిగా అధ్వానంగా తయారైంది. గతంలో మరమ్మతులు చేసినప్పటికీ చిన్నపాటి వర్షం కురిసినా బీటీ తొలగిపోయి గుంతలు విస్తరిస్తున్నాయి. అతి వేగంగా భారీ వాహనాలు వెళ్లే ఈ రహదారిపై కార్లు, ఇతర వాహనాలతోపాటు ద్విచక్రవాహన దారులు నరకం అనుభవిస్తున్నారు. గుంతలను తప్పించే క్రమంలో వెనుక నుంచి వాహనాలు ఢీకొని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొంచెం అదుపుతప్పినా, ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు పోయే దుస్థితి దాపురించింది.
ఎలా వెళ్లాలి
ఇది గుడిహత్నూర్ సమీపంలో గుంతలమయంగా మారిన రహదారి. భారీ గుంతలు ఏర్పడటంతో వాహన చోదకుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రాత్రి వేళల్లో ప్రయాణం మరింత దారుణంగా తయారైంది. ఎటువైపు వెళ్లాలో అర్థం కాని దుస్థితి దాపురించింది...
అధికారుల నిర్లక్ష్య వైఖరి..
జిల్లాలో అత్యంత ప్రమాదకరమైన, ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకునే సీతాగోంది ప్రాంతం మరింత అధ్వానంగా తయారైంది. అయినా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. వారి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా మారింది. ప్రధానంగా గుడిహత్నూర్నుంచి సీతాగోంది వరకు వెళ్లే వాహన చోదకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే టోల్ ఛార్జీలు పెంచి వాహన చోదకుల నడ్డి విరిస్తున్న జాతీయ రహదారుల సంస్థ అధికారులు ఇటువైపు దృష్టి సారించడం లేదు. మరోవైపు కనీస వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించగా, రోడ్డు మరమ్మతుల్లోనూ అదే దుస్థితి దాపురించింది.
తీవ్ర గాయాలతో..
ఇచ్చోడ సమీపంలోని టింబర్ డిపో వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జున్ని పంచాయతీ గాంధీనగర్కు చెందిన గుట్టె శేషారావు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. గ్రామం నుంచి ఇచ్చోడకు ద్విచక్రవాహనంపై వెళుతున్నాడు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై గుంతలు ఉండటంతో ముందు వెళుతున్న లారీ చోదకుడు ఒక్కసారిగా వేగాన్ని తగ్గించాడు. వెనుక వస్తున్న శేషారావు సైతం వాహన వేగం తగ్గించాడు. వెనుక వస్తున్న బస్సు అతడిని ఢీకొట్టింది. బస్సు కిందకు వెళ్లిన అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోసిలో ఉచిత వైద్య శిబిరం
[ 07-07-2024]
బైంసాలోని ఆరుష్ చిన్నపిల్లల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం బోసిలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. -
ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం
[ 07-07-2024]
ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని తానూరు మండలంలోని హిప్నెల్లిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
రెండు మద్యం దుకాణాల్లో చోరీ
[ 07-07-2024]
పట్టణంలోని రెండు మద్యం దుకాణాల్లో చోరీ ఘటనలు ఆదివారం వెలుగు చూశాయి. -
సహకారం అందిస్తేనే అన్నదాతకు ప్రయోజనం
[ 07-07-2024]
విత్తనం తయారీకి గత యాసంగిలో దండేపల్లి మండలంలో సాగు చేసిన పొలం ఇది. ఒక ప్రైవేటు కంపెనీ ఆడ, మగ మూల విత్తనాలను పొలానికి చెందిన రైతుకు అందజేసి... పంట చేతికొచ్చే వరకు సలహాలు, సూచనలు అందజేశారు. -
సర్సిల్క్భూములు.. అన్యాక్రాంతం
[ 07-07-2024]
కాగజ్నగర్ మండలంలోని చింతగూడ, బల్గల శివారులో మూతబడిన సర్సిల్క్ మిల్లు స్థలాలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కొందరు యథేచ్ఛగా కబ్జాచేసి పంటలు సాగు చేసుకుంటున్నారు. -
చికిత్స పొందుతూ మరో యువతి మృతి
[ 07-07-2024]
కుటుంబ కలహాలతో జిల్లాలోని కాగజ్నగర్ మండలం గజ్జిగూడకు చెందిన ఓ తల్లీ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఈ నెల 1వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన కలకలం సృష్టించిన విషయం విదితమే. -
అడిగినంత ఇచ్చెయ్.. అక్రమంగా కట్టెయ్!
[ 07-07-2024]
మంచిర్యాలలోని గంగారెడ్డి రోడ్డులో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
మీ వెంటే మేమంటూ..
[ 07-07-2024]
విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు తమ సొంత పిల్లల్లా ఆలనా పాలన చూసుకుంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆ ఉపాధ్యాయులపై ఎంతటి అభిమానం ఉంటుందో తెలిపే చిత్రమిది. -
సర్కారు కళాశాలలు వెలవెల
[ 07-07-2024]
నిర్మల్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాలతో జనరల్, ఒకేషనల్ కోర్సులను బోధిస్తున్నారు -
నిధులు కరవు.. నిర్వహణ బరువు
[ 07-07-2024]
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతల సంక్షేమం కోసం నిర్మించిన రైతు వేదికలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. -
దృశ్యబోధన మరింత ప్రభావవంతం
[ 07-07-2024]
ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ టచ్స్క్రీన్ టీవీల ద్వారా దృశ్య బోధనను మరింత ప్రభావవంతం చేసేందుకు విద్యా శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది -
నగదు రహితం.. పారదర్శకతే లక్ష్యం
[ 07-07-2024]
మీసేవ కేంద్రాల్లో పారదర్శకంగా చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్రాల్లో అందించే పౌర సేవలకు నిర్వాహకులు దరఖాస్తుదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. -
మహారాష్ట్ర సరిహద్దులో రహదారి ప్రమాదం
[ 07-07-2024]
మహారాష్ట్ర సరిహద్దులో శనివారం జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, మహారాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాలిలా.. ధర్మాబాద్ తాలూకాలోని రత్నెల్లి గ్రామానికి చెందిన గణేష్ తన స్నేహితులతో కలిసి నిజామాబాద్ జిల్లా నవీపేట మేకల సంతకు వెళ్లారు -
అటవీఅనుమతి లేక.. ఆగిన వంతెన
[ 07-07-2024]
మూడు మండలాలు, వందకుపైగా గ్రామాలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రహదారి. ఆ దారిలో ఉన్న వాగుపై నిర్మించిన వంతెన అప్రోచ్ దారులు ఏటా కొట్టుకుపోతుండటంతో ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు -
జంతు వధశాల తరలింపునకు నిర్ణయం
[ 07-07-2024]
జిల్లా కేంద్రం శివారులో ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఉన్న జంతు వధశాల(స్లాటర్హౌజ్)ను ఎట్టకేలకు అక్కడి నుంచి తరలించాలని బల్దియా యంత్రాంగం నిర్ణయించింది
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ ఇన్స్టా పోస్ట్..!
-
కార్యకర్తల కేరింతల నడుమ ఎన్టీఆర్ భవన్కు సీఎం చంద్రబాబు
-
ధోనీ కాళ్లకు నమస్కరించిన సాక్షి.. ‘బర్త్డే’ బాయ్ రియాక్షన్ చూశారా..?
-
గోల్కొండలో ఆషాఢం బోనాల సందడి
-
మందలించారని టీచర్నే పొడిచి చంపిన విద్యార్థి
-
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?