ప్రొటోకాల్ రగడ.. నేతల గడబిడ
‘ మంత్రి పాల్గొనే కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలను పెడుతున్నారని, పదవులు లేకున్నా.. ఆ పార్టీ నాయకులు విశ్వప్రసాద్ (డీసీసీ అధ్యక్షుడు), అజ్మీరా శ్యాంనాయక్ (నియోజకవర్గ ఇన్ఛార్జి) మంత్రి పర్యటన షెడ్యూల్ను పాలనాధికారి సమక్షంలో తయారు చేస్తున్నారని’.. ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్ర పదజాలంతో మండిపడ్డారు.
‘ మంత్రి పాల్గొనే కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలను పెడుతున్నారని, పదవులు లేకున్నా.. ఆ పార్టీ నాయకులు విశ్వప్రసాద్ (డీసీసీ అధ్యక్షుడు), అజ్మీరా శ్యాంనాయక్ (నియోజకవర్గ ఇన్ఛార్జి) మంత్రి పర్యటన షెడ్యూల్ను పాలనాధికారి సమక్షంలో తయారు చేస్తున్నారని’.. ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. ఆదివాసీ ఎమ్మెల్యేను చులకనగా చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. తన కార్యకర్తను విశ్వప్రసాద్ తీవ్రంగా దూషించడంతోనే ఈ మాదిరిగా విమర్శించానని ఆమె పేర్కొన్నారు.
ఈనాడు, ఆసిఫాబాద్
రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటనలో భాగంగా.. ప్రారంభించే ఆరోగ్య ఉపకేంద్రం భవనం సమీపంలో కాంగ్రెస్ పార్టీ జెండాలు, ప్లెక్సీలు ఉండడంతో రాజుకున్న వివాదం క్రమంగా పెనుదుమారంగా మారుతోంది. భారాస, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఆయా పార్టీలకు అనుకూలంగా, వ్యతిరేకంగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే పార్టీలో ఉన్న కొందరు నాయకులు ఇతర పార్టీ నేతలకు మద్దతు పలుకుతున్న తీరుపై సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో పార్టీల్లో ఉన్న గ్రూపు రాజకీయాలు సైతం బయటపడుతున్నాయి.
పరస్పరం ఫిర్యాదులు..
ఎమ్మెల్యే కోవ లక్ష్మి వ్యాఖ్యలకు దీటుగా కాంగ్రెస్ నేతలు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకురాలు ఆత్రం సుగుణ.. ఆదివాసీ మహిళలతో కలిసి ఆసిఫాబాద్లో మాట్లాడారు. తమ నాయకుడిపై ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఇందుకు ప్రతిగా ఆదివాసీ మహిళ అని చూడకుండా అవమానించారని, మంత్రి పర్యటనలో ప్రొటోకాల్ పాటించలేదని, బూతులు తిట్టారని ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులపై రెబ్బెన పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గురువారం డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్.. ఎమ్మెల్యే మాటలపై స్పందించారు. తనకు ఊహ తెలిసిన క్షణం నుంచి ఎవరినీ, ఎనాడూ దూషించలేదని, అలా నిరూపిస్తే, ముక్కు నేలకు రాసి, రాజకీయాల శాశ్వతంగా తప్పుకొంటానని సవాల్ విసిరారు.
కార్యకర్తల ఆందోళన...
రెండు ప్రధాన పార్టీల నాయకులు తీవ్రంగా తిట్టుకోవడంతో.. ఇది ఎటువైపు దారితీస్తుందోనని ఆయా పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం ఎవరున్నా కలిసికట్టుగా జిల్లా, నియోజకవర్గ అభివృద్ధికి నాయకులు పాటుపడాలనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
రెండుగా విడిపోయారు..
కాంగ్రెస్ పార్టీ నేతపై ఎమ్మెల్యే వ్యాఖ్యల నేపథ్యంలో అజ్మీరా శ్యాంనాయక్, విశ్వప్రసాద్ మద్దతుదారులు రెండుగా విడిపోయారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్యాంనాయక్ ఎందుకు ఖండించడం లేదని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వచ్చాయి. స్పందించాల్సిన సమయంలో శ్యాంనాయక్ హైదరాబాద్ పర్యటనపై విమర్శలు వ్యక్తం చేశారు. అందుకు ప్రతిగా శ్యాం వర్గీయులు సైతం విశ్వప్రసాద్కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే హైదరాబాద్ శ్యాంనాయక్ వెళ్లారని, అగ్రవర్ణ సామాజిక పెత్తనం ఎన్నాళ్లని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
9న జిల్లాస్థాయి ఈత ఎంపిక పోటీలు
[ 08-07-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఉన్న ఈత కొలనులో ఈ నెల 9న ఉదయం 10 గంటలకు జిల్లాస్థాయి ఈత ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఈత సంఘం కార్యదర్శి మహేందర్ జిత్, స్విమ్మింగ్ కోచ్ కొమ్ము కృష్ణ తెలిపారు. -
గంగపుత్ర శివాలయం మహా అన్నదానం
[ 08-07-2024]
జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శాంతినగర్ కాలనీకి చెందిన దాత సొంజికే శ్రీరామ-సులోచన దంపతులు స్వయంగా భక్తులకు భోజనం వడ్డించారు. -
పదోన్నతి.. ఓ కొత్త అనుభూతి
[ 08-07-2024]
బాల్యం ఎవరి జీవితంలోనైనా తిరిగిరాని ఓ మధురానుభూతి. పెరిగి పెద్దయ్యాక ఎప్పుడైనా, ఎక్కడైనా బాల్యస్నేహితులు కలిస్తే ఆ ఆనందమే వేరు. ఉద్యోగ, ఉపాధి మార్గాల్లో ఉన్నతస్థానాలకు వెళ్లాక మళ్లీ బాల్యస్మృతులు ప్రత్యేకంగా నెమరేసుకుంటే తప్ప అంతగా గుర్తుకురావు. -
ప్రాణహిత పనులకు ప్రాణం పోసేదెప్పుడో?
[ 08-07-2024]
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ప్రభుత్వాల చేతిలో పావుగా మారుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో డా.బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరిట వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టు పనుల నిర్వహణ స్వరాష్ట్రమైన తెలంగాణలో ఆగిపోయింది. -
గిరిజన దైవం.. ప్రకృతి రమణీయం
[ 08-07-2024]
దట్టమైన అడవి.. చుట్టూ ఎత్తైన గుట్టలు.. పక్షుల కిలకిలరావాలు.. నిరంతరం కొండల నుంచి జాలువారే నీరు.. ద్రౌపది స్నానం చేసిందనడానికి ఆనవాలుగా రాతికుండలు.. -
రంగంలోకి బడా నేతలు
[ 08-07-2024]
ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జహీర్ రంజానీపై అవిశ్వాస తీర్మాన నేపథ్యంలో ఆయా పార్టీల బడానేతలు రంగంలోకి దిగడంతో ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. -
బ్లీచింగ్ పౌడర్ సరఫరా ఏది?
[ 08-07-2024]
కౌటాల మండలంలోని గుడ్లబోరి గ్రామంలో పదిరోజులుగా పలువురు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. 50 మందికి పైగా జ్వరం, ఒళ్లు నొప్పులతో మంచంపట్టారు. -
కార్మిక లోకం.. అవగాహన లోపం
[ 08-07-2024]
ఆదిలాబాద్ నేతాజీ కూడలి, పంజాబ్చౌక్, శివాజీ కూడలి, దస్నాపూర్లోని పెట్రోల్ బంక్ ప్రాంతం అడ్డా కూలీలకు పేరొందాయి. -
ఐటీడీఏ బోధనేతర ఉద్యోగులకు స్థానచలనం
[ 08-07-2024]
ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖల్లో పని చేస్తున్న బోధనేతర ఉద్యోగులు అయిదేళ్ల నుంచి బదిలీలకు నోచుకోకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రిమ్స్ డైరెక్టర్కు అరుదైన అవకాశం
[ 08-07-2024]
ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాల డైరెక్టర్ డా.జైసింగ్కు అరుదైన అవకాశం లభించింది. తాజాగా ఆయనను సెనేటర్గా ఎంపిక చేస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం నియమించింది. -
మీ సేవ.. మరింత చేరువ!
[ 08-07-2024]
మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మహిళా శక్తి పథకం ద్వారా ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాల పోషణకు పరోక్షంగా సహాయ పడుతోంది. -
‘మత్తు’లో మట్టుబెట్టారు..!
[ 08-07-2024]
శ్రీ ముగ్గురూ మైనర్లే. పైగా మద్యం తాగిఉన్నారు. ఆ సమయంలో మరో యువకుడు మద్యం మత్తులో వారిని లిఫ్ట్ అడిగాడు. దుర్భాషలాడాడు. -
గుర్తించలేకే...
[ 08-07-2024]
ఆరోగ్య మహిళ.. అతివలకు ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతీ మంగళవారం నిర్వహిస్తోంది. -
చిటపట చినుకు.. ప్రయాణికులకు వణుకు
[ 08-07-2024]
రైల్వే క్రాసింగ్ల వద్ద ప్రమాదాల నివారణకు, రైళ్ల రాకపోకలతో తలెత్తే ట్రాఫిక్ తదితర సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో గేట్మెన్ రహిత రైల్వేగేట్ల కోసం అండర్బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టారు. -
రాయితీ బియ్యం.. అక్రమార్కుల పరం
[ 08-07-2024]
రేషన్ బియ్యం అక్రమార్కులపరం అవుతోంది. దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. జిల్లాలో బియ్యం రవాణా యథేచ్ఛగా సాగుతోంది. -
సందడే.. సందడి
[ 08-07-2024]
అథ్లెటిక్స్ ట్రాక్పై చిన్నారుల పరుగులు. చప్పట్లు కొడుతూ కొందరు.. ఈలలు, కేరింతలతో చిన్నారులను ప్రోత్సహిస్తూ మరికొందరు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
టీమ్ఇండియాతో టీ20, వన్డే సిరీస్.. శ్రీలంక హెడ్ కోచ్గా జయసూర్య
-
మంచు విష్ణుని కలిసిన హేమ.. నిర్దోషినంటూ లేఖ
-
భారీ వర్షాల ఎఫెక్ట్.. 27 విమానాల దారి మళ్లింపు..!
-
కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తాం: సీఎం రేవంత్రెడ్డి
-
‘బడ్జెట్’లో సొంతిల్లు.. ప్రభుత్వ సహకారం అందేనా?