గుట్కాపై ఉక్కుపాదం!
నిషేధిత గుట్కా, తంబాకు రవాణా, విక్రయాలపై జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపింది.
నియంత్రణకు పోలీసుల విస్తృత తనిఖీలు..
జిల్లా కేంద్రంలో పట్టుకున్న గుట్కా పొట్లాలను చూపుతున్న ఎస్పీ డి.వి. శ్రీనివాస్రావు
లింగాపూర్, కాగజ్నగర్ గ్రామీణం, న్యూస్టుడే: నిషేధిత గుట్కా, తంబాకు రవాణా, విక్రయాలపై జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. వీటిని సమూలంగా నిర్మూలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో.. పోలీస్శాఖ అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాస్రావు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి.. గుట్కా రవాణా కట్టడిపై నిత్యం తనిఖీలు చేస్తూ, సంబంధీకులపై కేసులు నమోదు చేస్తున్నారు.
రాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలాలపై నిషేధం ఉన్నప్పటికీ.. వాటి విక్రయాలపై మూడింతలు ఆదాయం ఉండటంతో వ్యాపారులు ఈ దందాను వీడటం లేదు. కుమురంభీం జిల్లాకు ఆనుకుని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో గుట్కాపై నిషేధం లేకపోవడంతో.. అక్కడి నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు అక్రమంగా సరఫరా చేస్తున్నారు. తక్కువ ధరతో కొనుగోలు చేసి అడ్డగోలు ధరలతో విక్రయిస్తున్నారు. దీంతో అక్రమార్జన యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్రస్తుతం గుట్కా నియంత్రణపై పోలీసులు సమరం సాగిస్తుండటంతో.. నిత్యం ఏదో ఒకచోట గుట్కా లభ్యమవుతోంది. గుట్కా నిల్వ స్థావరాలపై దాడులు చేసి, పొట్లాలు స్వాధీనం చేసుకుని, నిర్వాహకులు, రవాణాదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు.
గుట్కా నిల్వలపై సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు
వారం రోజుల్లో నమోదైన కేసులు..
- ఈ నెల 2న సిర్పూర్(టి) మండలంలోని గోవింద్పూర్వాడలో టాస్క్ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి రూ.10 వేల విలువైన గుట్కా పట్టుకున్నారు. నిందితులు మహారాష్ట్రలోని కోటశ్రీ గ్రామం నుంచి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
- ఈ నెల 1న కాగజ్నగర్లోని కాపువాడకు చెందిన షేక్ ఇంతియాజ్కు సంబంధించిన గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.6,88,400 విలువైన గుట్కాను పోలీసులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.
- గత నెల 27న కాగజ్నగర్లోని ఇందిరా మార్కెట్లో ఉన్న ఓ గోదాంలో నిల్వ ఉంచిన రూ.37 వేల విలువైన నిషేధిత తంబాకు పోలీసులు పట్టుకున్నారు. తంబాకును స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు.
- ఇదే రోజు పెంచికల్పేట్ మండలంలోని బొంబాయిగూడ, మొట్లగూడ గ్రామాల్లో ఉన్న పలు కిరాణ దుకాణాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. గుట్కా పొట్లాలను పట్టుకుని దుకాణ యజమానులపై కేసు నమోదు చేశారు.
- గత నెల 25న జిల్లా కేంద్రంలోని అటవీశాఖ చెక్పోస్టు వెనుక ఉన్న ఓ గోదాంలో నిషేధిత గుట్కా సంచులను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ.8 లక్షల విలువైన గుట్కాను నిల్వ ఉంచినట్లు గుర్తించారు.
- గత నెల 26న చింతలమానెపల్లి మండలంలోని రవీంద్రనగర్లో గుట్కా నిల్వలు ఉన్నాయనే సమాచారం మేరకు ఇళ్లలో సోదాలు చేపట్టారు. రూ.4,210 విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.
- ఇదే రోజు వాంకిడి మండల కేంద్రంలోని ఓ కిరాణా గోదాంలో తనిఖీ చేయగా.. రూ.12,573 విలువైన గుట్కాను పట్టుకున్నారు.
రవాణా అరికట్టేలా చర్యలు: డి.వి.శ్రీనివాస్రావు, ఎస్పీ
గుట్కా రవాణా, అక్రమ విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ప్రభుత్వం నిషేధించిన గుట్కా పొట్లాలను ఎవరైనా విక్రయిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆలయంలో గోరింటాకు సంబరాలు
[ 07-07-2024]
ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో జిల్లాలోని ఆలయాల్లో గోరింటాకు సంబరాలు మొదలయ్యాయి. -
10 నుంచి నందిగ్రాం రైళ్ల రద్దు
[ 07-07-2024]
ఆదిలాబాద్- బల్లార్షా మధ్య నందిగ్రాం ఎక్స్ప్రెస్ రైలును తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
బోసిలో ఉచిత వైద్య శిబిరం
[ 07-07-2024]
బైంసాలోని ఆరుష్ చిన్నపిల్లల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం బోసిలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. -
ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం
[ 07-07-2024]
ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని తానూరు మండలంలోని హిప్నెల్లిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
రెండు మద్యం దుకాణాల్లో చోరీ
[ 07-07-2024]
పట్టణంలోని రెండు మద్యం దుకాణాల్లో చోరీ ఘటనలు ఆదివారం వెలుగు చూశాయి. -
సహకారం అందిస్తేనే అన్నదాతకు ప్రయోజనం
[ 07-07-2024]
విత్తనం తయారీకి గత యాసంగిలో దండేపల్లి మండలంలో సాగు చేసిన పొలం ఇది. ఒక ప్రైవేటు కంపెనీ ఆడ, మగ మూల విత్తనాలను పొలానికి చెందిన రైతుకు అందజేసి... పంట చేతికొచ్చే వరకు సలహాలు, సూచనలు అందజేశారు. -
సర్సిల్క్భూములు.. అన్యాక్రాంతం
[ 07-07-2024]
కాగజ్నగర్ మండలంలోని చింతగూడ, బల్గల శివారులో మూతబడిన సర్సిల్క్ మిల్లు స్థలాలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కొందరు యథేచ్ఛగా కబ్జాచేసి పంటలు సాగు చేసుకుంటున్నారు. -
చికిత్స పొందుతూ మరో యువతి మృతి
[ 07-07-2024]
కుటుంబ కలహాలతో జిల్లాలోని కాగజ్నగర్ మండలం గజ్జిగూడకు చెందిన ఓ తల్లీ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఈ నెల 1వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన కలకలం సృష్టించిన విషయం విదితమే. -
అడిగినంత ఇచ్చెయ్.. అక్రమంగా కట్టెయ్!
[ 07-07-2024]
మంచిర్యాలలోని గంగారెడ్డి రోడ్డులో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
మీ వెంటే మేమంటూ..
[ 07-07-2024]
విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు తమ సొంత పిల్లల్లా ఆలనా పాలన చూసుకుంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆ ఉపాధ్యాయులపై ఎంతటి అభిమానం ఉంటుందో తెలిపే చిత్రమిది. -
సర్కారు కళాశాలలు వెలవెల
[ 07-07-2024]
నిర్మల్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాలతో జనరల్, ఒకేషనల్ కోర్సులను బోధిస్తున్నారు -
నిధులు కరవు.. నిర్వహణ బరువు
[ 07-07-2024]
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతల సంక్షేమం కోసం నిర్మించిన రైతు వేదికలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. -
దృశ్యబోధన మరింత ప్రభావవంతం
[ 07-07-2024]
ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ టచ్స్క్రీన్ టీవీల ద్వారా దృశ్య బోధనను మరింత ప్రభావవంతం చేసేందుకు విద్యా శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది -
నగదు రహితం.. పారదర్శకతే లక్ష్యం
[ 07-07-2024]
మీసేవ కేంద్రాల్లో పారదర్శకంగా చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్రాల్లో అందించే పౌర సేవలకు నిర్వాహకులు దరఖాస్తుదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. -
మహారాష్ట్ర సరిహద్దులో రహదారి ప్రమాదం
[ 07-07-2024]
మహారాష్ట్ర సరిహద్దులో శనివారం జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, మహారాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాలిలా.. ధర్మాబాద్ తాలూకాలోని రత్నెల్లి గ్రామానికి చెందిన గణేష్ తన స్నేహితులతో కలిసి నిజామాబాద్ జిల్లా నవీపేట మేకల సంతకు వెళ్లారు -
అటవీఅనుమతి లేక.. ఆగిన వంతెన
[ 07-07-2024]
మూడు మండలాలు, వందకుపైగా గ్రామాలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రహదారి. ఆ దారిలో ఉన్న వాగుపై నిర్మించిన వంతెన అప్రోచ్ దారులు ఏటా కొట్టుకుపోతుండటంతో ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు -
జంతు వధశాల తరలింపునకు నిర్ణయం
[ 07-07-2024]
జిల్లా కేంద్రం శివారులో ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఉన్న జంతు వధశాల(స్లాటర్హౌజ్)ను ఎట్టకేలకు అక్కడి నుంచి తరలించాలని బల్దియా యంత్రాంగం నిర్ణయించింది
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జగన్నాథుడి రథయాత్ర.. కిక్కిరిసిన పూరీ వీధులు
-
మైనర్ల చేతిలో అశ్లీల కంటెంట్.. అడ్డుకట్టకు స్పెయిన్ వినూత్న ఆలోచన!
-
‘భారతీయుడు 2’.. నేను అలా అనలేదు: కమల్ హాసన్ క్లారిటీ
-
అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో పేలిన బాయిలర్.. 20 మందికి గాయాలు
-
ప్లేయర్ల ప్రైవసీ కోసం వింబుల్డన్లో తొలిసారి ‘AI’
-
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు: సీఎం రేవంత్రెడ్డి