కోటాను కోట్లు.. నీరందక పాట్లు
రూ. కోట్ల వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారాయి. అసంపూర్తి పనులు, నిర్వహణలోపం, మరమ్మతుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.
నిర్వహణ, మరమ్మతులు లేక ఎత్తిపోతల పథకాలు నిరుపయోగం
చెన్నూరు గ్రామీణం, న్యూస్టుడే
రూ. కోట్ల వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారాయి. అసంపూర్తి పనులు, నిర్వహణలోపం, మరమ్మతుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. ఒకటి, రెండు పనులు పూర్తయినా వినియోగంలోకి రాక దిష్టిబొమ్మలా పడిఉన్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో 2009 నుంచి 2011లో అప్పటి ప్రభుత్వం జిల్లాలోని 11 ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. చెన్నూరు మండలంలోని నర్సక్కపేట, సోమన్పల్లి, సుందర్శాల, కోటపల్లిలో బోరంపల్లి, వెంచపల్లి, సిర్సా, అర్జున్గుట్ట, జైపూరు మండలంలోని షెట్పల్లి, బెజ్జాల, కిష్టాపూర్, శివ్వారం, గ్రామాల్లో గోదావరి, ప్రాణహితనది ఒడ్డున ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. కోటపల్లి మండలంలోని వెంచపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందుతోంది. మిగతావి నిరుయోగంగా మారాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, 2022లో భారీ వరదల కారణంగా నర్సక్కపేట, బోరంపల్లి, షెట్పల్లి, బెజ్జాల ఎత్తిపోతల పథకాలు కాలగర్భంలో కలిశాయి.
- నిర్మాణ వ్యయం (రూ. కోట్లలో)
- ఆయకట్టు (ఎకరాలు)
- సాగునీరందించే గ్రామాలు
- ప్రస్తుత పరిస్థితి
- పరిష్కారం
సోమన్పల్లి ఎత్తిపోతల పథకం
- 33
- 3,600
- సోమన్పల్లి, ఆస్నాద్, పొన్నారం
- మొసళ్ల సంరక్షణ ప్రాంతం కావడంతో నీళ్లు ఎత్తిపోసేందుకు అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు లేక పనులు పూర్తయిన నిరుపయోగంగా మారింది.
- ప్రజాప్రతినిధులు దిల్లీ స్థాయిలో ప్రత్యేక చొరవ చూపితే అనుమతి వచ్చే అవకాశముంది.
సుందర్శాల
- 9.46
- 2,250
- సుందర్శాల, దుగ్నెపల్లి, వెంకంపేట
- అన్నారం బ్యారేజీ బ్యాక్వాటర్తో పథకం ముంపునకు గురవుతోంది.
- కరకట్ట నిర్మాణం చేపట్టి, మిగిలిన పనులు పూర్తిచేస్తే వినియోగంలోకి వచ్చే అవకాశముంది.
అర్జున్గుట్ట
- 8.58
- 1500
- అర్జునగుట్ట, రాపన్పల్లి, దేవులవాడ
- ర్యాంపు ధ్వంసం కావడంతో పాటు నిర్వహణ లోపం కారణంగా పనిచేయడం లేదు.
- మరమ్మతులు చేపట్టేందుకు రూ. 60 లక్షలతో ప్రతిపాదనలు పంపించారు. నిధులు మంజూరు చేస్తే వినియోగంలోకి వస్తుంది.
సిర్సా
- 18
- 2,700
- సిర్సా, అన్నారం, పుల్లగాం
- సంబంధిత గుత్తేదారులు వివిధ కారణాలతో పనులు పూర్తిచేయకుండా వదిలేశాడు.
- ప్రభుత్వం నిధులు మంజూరు చేసి తిరిగి పనులను ప్రారంభించి పూర్తి చేయిస్తే లక్ష్యం నెరవేరుతుంది.
కిష్టాపూర్
- 19
- 4,000
- కిష్టాపూర్, కుందారం, వేలాల
- 80శాతం పనులుచేసి 2014 డిసెంబరులో పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. లీకేజీలు, మరమ్మతులు, వివిధ కారణాలతో నిరుపయోగంగా మారింది.
- నిధులు మంజూరు చేసి మిగతా పనులు పూర్తిచేస్తే వినియోగంలోకి వస్తుంది.
శివ్వారం
- 16.94
- 2,300
- శివ్వారం, పౌనూర్, గోపాల్పూర్
- శివ్వారం మొసళ్ల సంరక్షణ కేంద్రం ఉండటంతో నీళ్లు ఎత్తిపోసేందుకు అటవీ, పర్యావరణ శాఖల అనుమతి లేక 90శాతం పనులు పూర్తయినా ఫలితం లేకుండా పోయింది.
- అనుమతులు వచ్చే ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదోన్నతి.. ఓ కొత్త అనుభూతి
[ 08-07-2024]
బాల్యం ఎవరి జీవితంలోనైనా తిరిగిరాని ఓ మధురానుభూతి. పెరిగి పెద్దయ్యాక ఎప్పుడైనా, ఎక్కడైనా బాల్యస్నేహితులు కలిస్తే ఆ ఆనందమే వేరు. ఉద్యోగ, ఉపాధి మార్గాల్లో ఉన్నతస్థానాలకు వెళ్లాక మళ్లీ బాల్యస్మృతులు ప్రత్యేకంగా నెమరేసుకుంటే తప్ప అంతగా గుర్తుకురావు. -
ప్రాణహిత పనులకు ప్రాణం పోసేదెప్పుడో?
[ 08-07-2024]
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ప్రభుత్వాల చేతిలో పావుగా మారుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో డా.బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరిట వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టు పనుల నిర్వహణ స్వరాష్ట్రమైన తెలంగాణలో ఆగిపోయింది. -
గిరిజన దైవం.. ప్రకృతి రమణీయం
[ 08-07-2024]
దట్టమైన అడవి.. చుట్టూ ఎత్తైన గుట్టలు.. పక్షుల కిలకిలరావాలు.. నిరంతరం కొండల నుంచి జాలువారే నీరు.. ద్రౌపది స్నానం చేసిందనడానికి ఆనవాలుగా రాతికుండలు.. -
రంగంలోకి బడా నేతలు
[ 08-07-2024]
ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జహీర్ రంజానీపై అవిశ్వాస తీర్మాన నేపథ్యంలో ఆయా పార్టీల బడానేతలు రంగంలోకి దిగడంతో ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. -
బ్లీచింగ్ పౌడర్ సరఫరా ఏది?
[ 08-07-2024]
కౌటాల మండలంలోని గుడ్లబోరి గ్రామంలో పదిరోజులుగా పలువురు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. 50 మందికి పైగా జ్వరం, ఒళ్లు నొప్పులతో మంచంపట్టారు. -
కార్మిక లోకం.. అవగాహన లోపం
[ 08-07-2024]
ఆదిలాబాద్ నేతాజీ కూడలి, పంజాబ్చౌక్, శివాజీ కూడలి, దస్నాపూర్లోని పెట్రోల్ బంక్ ప్రాంతం అడ్డా కూలీలకు పేరొందాయి. -
ఐటీడీఏ బోధనేతర ఉద్యోగులకు స్థానచలనం
[ 08-07-2024]
ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖల్లో పని చేస్తున్న బోధనేతర ఉద్యోగులు అయిదేళ్ల నుంచి బదిలీలకు నోచుకోకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రిమ్స్ డైరెక్టర్కు అరుదైన అవకాశం
[ 08-07-2024]
ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాల డైరెక్టర్ డా.జైసింగ్కు అరుదైన అవకాశం లభించింది. తాజాగా ఆయనను సెనేటర్గా ఎంపిక చేస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం నియమించింది. -
మీ సేవ.. మరింత చేరువ!
[ 08-07-2024]
మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మహిళా శక్తి పథకం ద్వారా ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాల పోషణకు పరోక్షంగా సహాయ పడుతోంది. -
‘మత్తు’లో మట్టుబెట్టారు..!
[ 08-07-2024]
శ్రీ ముగ్గురూ మైనర్లే. పైగా మద్యం తాగిఉన్నారు. ఆ సమయంలో మరో యువకుడు మద్యం మత్తులో వారిని లిఫ్ట్ అడిగాడు. దుర్భాషలాడాడు. -
గుర్తించలేకే...
[ 08-07-2024]
ఆరోగ్య మహిళ.. అతివలకు ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతీ మంగళవారం నిర్వహిస్తోంది. -
చిటపట చినుకు.. ప్రయాణికులకు వణుకు
[ 08-07-2024]
రైల్వే క్రాసింగ్ల వద్ద ప్రమాదాల నివారణకు, రైళ్ల రాకపోకలతో తలెత్తే ట్రాఫిక్ తదితర సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో గేట్మెన్ రహిత రైల్వేగేట్ల కోసం అండర్బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టారు. -
రాయితీ బియ్యం.. అక్రమార్కుల పరం
[ 08-07-2024]
రేషన్ బియ్యం అక్రమార్కులపరం అవుతోంది. దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. జిల్లాలో బియ్యం రవాణా యథేచ్ఛగా సాగుతోంది. -
సందడే.. సందడి
[ 08-07-2024]
అథ్లెటిక్స్ ట్రాక్పై చిన్నారుల పరుగులు. చప్పట్లు కొడుతూ కొందరు.. ఈలలు, కేరింతలతో చిన్నారులను ప్రోత్సహిస్తూ మరికొందరు.
తాజా వార్తలు (Latest News)
-
కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తాం: సీఎం రేవంత్రెడ్డి
-
‘బడ్జెట్’లో సొంతిల్లు.. ప్రభుత్వ సహకారం అందేనా?
-
తెలంగాణలో వివిధ కార్పొరేషన్లకు నూతన ఛైర్మన్ల నియామకం
-
బంగారు గనిలో ప్రమాదం.. 11 మంది మృతి
-
మహిళపై కారుతో దూసుకెళ్లి.. గర్ల్ఫ్రెండ్ ఇంట్లో నక్కి: శివసేన యువనేతపై లుక్ఔట్ నోటీసు
-
ఓటీటీలోకి విజయ్ సేతుపతి యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!