సరిహద్దు వివాదం.. ప్రగతికి ఆటంకం
రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు భూముల వివాదాలతో జిల్లా ప్రగతికి ఆటంకంగా మారింది. బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల నుంచి వివిధ గ్రామాలకు వెళ్లడానికి గతంలో అటవీ ప్రాంతం నుంచి రహదారులు నిర్మించారు.
మంచిర్యాల పట్టణం, న్యూస్టుడే: రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు భూముల వివాదాలతో జిల్లా ప్రగతికి ఆటంకంగా మారింది. బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల నుంచి వివిధ గ్రామాలకు వెళ్లడానికి గతంలో అటవీ ప్రాంతం నుంచి రహదారులు నిర్మించారు. ఆ రహదారులు శిథిలావస్థకు చేరడంతో వాటిని మరమ్మతులు చేయడానికి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రూ.లక్షల నిధులు మంజూరు చేశారు. అటవీ శాఖ అధికారులు నిబంధనల పేరుతో ఆ శాఖ పరిధిలో ఉన్న రహదారులకు మరమ్మతులు చేయనివ్వడం లేదు.
అధ్వానంగా దారులు
అటవీ ప్రాంతం నుంచి వివిధ గ్రామాలకు 10 ఏళ్ల కిందట రహదారులు నిర్మించారు. ఇప్పుడు గుంతలు పడి, కంకర తేలి రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. ఆ రహదారుల మరమ్మతులకు ఆర్అండ్బీ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు నిధులు మంజూరు చేశారు. అటవీ శాఖ అధికారులు తమ శాఖ పరిధిలో ఉన్న భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని అడ్డుకుంటున్నారు. దీంతో చెన్నూరు నుంచి బుద్దారం రోడ్డు, చెన్నూరు నుంచి పంగిడిసోమారం, మల్లంపేట నుంచి నక్కలపల్లి, రేచర్ల బీటీ రోడ్డు, ఏదులబంధం, చెన్నూరు నుంచి కోటపల్లి, వేమనపల్లి నుంచి నాగారం, మల్లంపల్లిపేట నుంచి నీల్వాయి రహదారులపై ఏర్పడిన గుంతలకు అటవీ శాఖ అధికారులు మరమ్మతులు చేయనివ్వడం లేదు.
తీరని పోడు భూముల సమస్య..:
నెన్నెల మండలంలోని సర్వే నెం.671, 672లో దాదాపు రెండు వేల ఎకరాల భూమి గత కొన్ని ఏళ్లుగా రెవెన్యూ, అటవీ శాఖ వివాదంలో ఉంది. అందులో 1500 ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఆరోపణలున్నాయి. 1985-2004 మధ్య కాలంలో కొంతమంది రైతులకు రెవెన్యూ అధికారులు పోడు పట్టాలు అందజేశారు. మరికొంతమంది ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారని తెలిసింది. పోడు రైతులు భూములను సాగు చేసుకుంటే అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకుని అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాలని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇందూరి రాంమోహన్ కోర్టులో కేసు వేసినట్లు తెలిసింది.
బెల్లంపల్లి, మందమర్రి మండలాల్లో వివిధ గ్రామాల పరిధిలో రెవెన్యూ, అటవీ శాఖ మధ్య భూముల వివాదం కొనసాగుతోంది. బెల్లంపల్లి అటవీ రేంజి పరిధిలో కాంపార్ట్మెంట్ నెం.350, 351, 304, 348 నంబర్లతో దాదాపు 5,570 హెక్టార్ల భూములు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అందులో కొంత భూమిని రైతులు అక్కడక్కడ పోడు పేరుతో చెట్లను నరికి సాగు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆకెనపల్లి శివారులో అటవీ భూములు 86 ఎకరాలు మాత్రమే ధరణిలో నమోదైనట్లు తెలిసింది. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు మధ్య సమన్వయం లేకపోవడంతోనే రెండు శాఖల మధ్య భూదస్త్రాల రికార్డులకు పొంతన లేకుండా పోయిందని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
ఫిర్యాదు వచ్చిన వెంటనే సర్వే చేయిస్తున్నాం
- మోతీలాల్, అదనపు పాలనాధికారి
రెవెన్యూ, అటవీ శాఖ భూముల సరిహద్దు వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఆయా డివిజన్ల ఆర్డీఓలు, జిల్లా అధికార అధికారితో జాయింట్ సర్వే చేయిస్తున్నాం. ఇప్పటికీ అనేక చోట్ల సమస్యలు పరిష్కరించాం. అటవీ శాఖ పరిధిలో రహదారుల నిర్మాణం, మరమ్మతులు చేయడానికి చీఫ్ కన్జర్వేటర్ నుంచి అనుమతులు తీసుకోవాలి. గతంలో ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లాం. రెవెన్యూ శాఖ నుంచి పోడు పట్టాలు పొందిన భూములను మాత్రమే ధరణిలో నమోదు చేస్తాం. మిగతా అటవీ భూములు అన్ని వారి పరిధిలోనే ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోసిలో ఉచిత వైద్య శిబిరం
[ 07-07-2024]
బైంసాలోని ఆరుష్ చిన్నపిల్లల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం బోసిలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. -
ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం
[ 07-07-2024]
ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని తానూరు మండలంలోని హిప్నెల్లిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
రెండు మద్యం దుకాణాల్లో చోరీ
[ 07-07-2024]
పట్టణంలోని రెండు మద్యం దుకాణాల్లో చోరీ ఘటనలు ఆదివారం వెలుగు చూశాయి. -
సహకారం అందిస్తేనే అన్నదాతకు ప్రయోజనం
[ 07-07-2024]
విత్తనం తయారీకి గత యాసంగిలో దండేపల్లి మండలంలో సాగు చేసిన పొలం ఇది. ఒక ప్రైవేటు కంపెనీ ఆడ, మగ మూల విత్తనాలను పొలానికి చెందిన రైతుకు అందజేసి... పంట చేతికొచ్చే వరకు సలహాలు, సూచనలు అందజేశారు. -
సర్సిల్క్భూములు.. అన్యాక్రాంతం
[ 07-07-2024]
కాగజ్నగర్ మండలంలోని చింతగూడ, బల్గల శివారులో మూతబడిన సర్సిల్క్ మిల్లు స్థలాలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కొందరు యథేచ్ఛగా కబ్జాచేసి పంటలు సాగు చేసుకుంటున్నారు. -
చికిత్స పొందుతూ మరో యువతి మృతి
[ 07-07-2024]
కుటుంబ కలహాలతో జిల్లాలోని కాగజ్నగర్ మండలం గజ్జిగూడకు చెందిన ఓ తల్లీ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఈ నెల 1వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన కలకలం సృష్టించిన విషయం విదితమే. -
అడిగినంత ఇచ్చెయ్.. అక్రమంగా కట్టెయ్!
[ 07-07-2024]
మంచిర్యాలలోని గంగారెడ్డి రోడ్డులో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
మీ వెంటే మేమంటూ..
[ 07-07-2024]
విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు తమ సొంత పిల్లల్లా ఆలనా పాలన చూసుకుంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆ ఉపాధ్యాయులపై ఎంతటి అభిమానం ఉంటుందో తెలిపే చిత్రమిది. -
సర్కారు కళాశాలలు వెలవెల
[ 07-07-2024]
నిర్మల్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాలతో జనరల్, ఒకేషనల్ కోర్సులను బోధిస్తున్నారు -
నిధులు కరవు.. నిర్వహణ బరువు
[ 07-07-2024]
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతల సంక్షేమం కోసం నిర్మించిన రైతు వేదికలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. -
దృశ్యబోధన మరింత ప్రభావవంతం
[ 07-07-2024]
ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ టచ్స్క్రీన్ టీవీల ద్వారా దృశ్య బోధనను మరింత ప్రభావవంతం చేసేందుకు విద్యా శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది -
నగదు రహితం.. పారదర్శకతే లక్ష్యం
[ 07-07-2024]
మీసేవ కేంద్రాల్లో పారదర్శకంగా చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్రాల్లో అందించే పౌర సేవలకు నిర్వాహకులు దరఖాస్తుదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. -
మహారాష్ట్ర సరిహద్దులో రహదారి ప్రమాదం
[ 07-07-2024]
మహారాష్ట్ర సరిహద్దులో శనివారం జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, మహారాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాలిలా.. ధర్మాబాద్ తాలూకాలోని రత్నెల్లి గ్రామానికి చెందిన గణేష్ తన స్నేహితులతో కలిసి నిజామాబాద్ జిల్లా నవీపేట మేకల సంతకు వెళ్లారు -
అటవీఅనుమతి లేక.. ఆగిన వంతెన
[ 07-07-2024]
మూడు మండలాలు, వందకుపైగా గ్రామాలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రహదారి. ఆ దారిలో ఉన్న వాగుపై నిర్మించిన వంతెన అప్రోచ్ దారులు ఏటా కొట్టుకుపోతుండటంతో ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు -
జంతు వధశాల తరలింపునకు నిర్ణయం
[ 07-07-2024]
జిల్లా కేంద్రం శివారులో ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఉన్న జంతు వధశాల(స్లాటర్హౌజ్)ను ఎట్టకేలకు అక్కడి నుంచి తరలించాలని బల్దియా యంత్రాంగం నిర్ణయించింది
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ ఇన్స్టా పోస్ట్..!
-
కార్యకర్తల కేరింతల నడుమ ఎన్టీఆర్ భవన్కు సీఎం చంద్రబాబు
-
ధోనీ కాళ్లకు నమస్కరించిన సాక్షి.. ‘బర్త్డే’ బాయ్ రియాక్షన్ చూశారా..?
-
గోల్కొండలో ఆషాఢం బోనాల సందడి
-
మందలించారని టీచర్నే పొడిచి చంపిన విద్యార్థి
-
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?