అతిక్రమిస్తే.. తప్పదు మూల్యం
మైనర్లు(18 సంవత్సరాల్లోపు బాలబాలికలు) వాహనం నడపడం ప్రస్తుతం పరిపాటిగా మారింది. తమ పిల్లలు వాహనం నడిపేస్తున్నారన్న ఆనందమో, ఏదైనా సందర్భంలో పనులు సులభంగా చేసుకొచ్చేస్తారన్న ధీమానో.. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సైతం వీరిని ప్రోత్సహిస్తున్నారు.
మైనర్లు వాహనం నడిపితే న్యాయస్థానానికి..
నిర్మల్ : తనిఖీ చేస్తున్న పోలీసులు
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే: మైనర్లు(18 సంవత్సరాల్లోపు బాలబాలికలు) వాహనం నడపడం ప్రస్తుతం పరిపాటిగా మారింది. తమ పిల్లలు వాహనం నడిపేస్తున్నారన్న ఆనందమో, ఏదైనా సందర్భంలో పనులు సులభంగా చేసుకొచ్చేస్తారన్న ధీమానో.. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సైతం వీరిని ప్రోత్సహిస్తున్నారు. యథేచ్ఛగా వాహనాలను అప్పగిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇది చట్టవిరుద్ధం. కానీ క్షేత్రస్థాయిలో ఎవరూ పెద్దగా దృష్టి సారించకపోవడంతో పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఇకమీదట ఈ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు జిల్లా పోలీసుశాఖ సన్నద్ధమైంది. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే గతంలో మాదిరి కౌన్సెలింగ్ ఇచ్చో, చిన్న చిన్న జరిమానాలు విధించి పంపించడం కాకుండా నేరుగా న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
యజమాని హాజరవ్వాల్సిందే..
జిల్లాలో ఆరు నెలల వ్యవధిలో మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడ్డ ఘటనలు 49 చోటు చేసుకున్నాయి. ఇది కేవలం అధికారిక లెక్కల ప్రకారం మాత్రమే. నమోదు అవకుండా తప్పించుకుని తిరిగే వాటి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర ప్రభావం ఉంటుందన్న భావనతో పోలీసులు కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. పట్టుబడ్డ మైనర్ నడుపుతున్న వాహనం జప్తు చేయడంతోపాటు కేసును న్యాయస్థానానికి అప్పగించనున్నారు. ఆ వాహనం ఎవరి పేరిట ఉంటుందో సదరు యజమాని న్యాయస్థానంలో హాజరు కావాల్సి ఉంటుంది. విచారణ, సందర్భం బట్టి బాధ్యులకు జైలుశిక్ష, జరిమానా విధించే ఆస్కారం ఉంటుంది. ముందు జాగ్రత్తగా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు.
నిబంధనలు బేఖాతరు
ప్రమాదాల నివారణకు రహదారి నిబంధనలు ఏర్పాటు చేశారు. వాహనదారులు విధిగా వీటిని పాటించాల్సిందే. కానీ చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చూసేవారు లేరు, అడిగేవారు లేరు అనే ధీమాతో బేఖాతరు చేస్తూ వాహనాలు నడుపుతున్నారు. అపసవ్య దిశలో వాహనం నడపటం, శిరస్త్రాణం ధరించకుండా, మద్యం మత్తులో, అతివేగం, ట్రిపుల్ రైడింగ్.. ఇలా వివిధ అంశాల్లో నమోదవుతున్న కేసుల సంఖ్య ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు ఎవరూ ఉండటం లేదని, తనిఖీలు జరగడం లేదన్న కారణంతో చాలా మంది వాహనదారులు నిబంధనలను తోసిరాజని వ్యవహరిస్తున్నారు.
కేసులు నమోదు చేస్తాం
డా.జి.జానకి షర్మిల, జిల్లా పోలీసు అధికారి
ప్రమాదాల నివారణకు ఉద్దేశించిన నిబంధనలు మన మంచి కోసమే ఉన్నాయి. మన కోసం, మన కుటుంబం కోసం పాటించాలి. ప్రమాదాలకు దూరంగా ఉండాలి. నంబరు ప్లేట్లు చెరిపేసి, తప్పుడు నంబర్లు రాసి, సైలెన్సర్లు తొలగించి వాహనాలు నడపటం చట్టరీత్యా నేరం. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను నడపొద్దు. ఇక నుంచి సంబంధిత యజమానులపైనా కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదోన్నతి.. ఓ కొత్త అనుభూతి
[ 08-07-2024]
బాల్యం ఎవరి జీవితంలోనైనా తిరిగిరాని ఓ మధురానుభూతి. పెరిగి పెద్దయ్యాక ఎప్పుడైనా, ఎక్కడైనా బాల్యస్నేహితులు కలిస్తే ఆ ఆనందమే వేరు. ఉద్యోగ, ఉపాధి మార్గాల్లో ఉన్నతస్థానాలకు వెళ్లాక మళ్లీ బాల్యస్మృతులు ప్రత్యేకంగా నెమరేసుకుంటే తప్ప అంతగా గుర్తుకురావు. -
ప్రాణహిత పనులకు ప్రాణం పోసేదెప్పుడో?
[ 08-07-2024]
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ప్రభుత్వాల చేతిలో పావుగా మారుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో డా.బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరిట వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టు పనుల నిర్వహణ స్వరాష్ట్రమైన తెలంగాణలో ఆగిపోయింది. -
గిరిజన దైవం.. ప్రకృతి రమణీయం
[ 08-07-2024]
దట్టమైన అడవి.. చుట్టూ ఎత్తైన గుట్టలు.. పక్షుల కిలకిలరావాలు.. నిరంతరం కొండల నుంచి జాలువారే నీరు.. ద్రౌపది స్నానం చేసిందనడానికి ఆనవాలుగా రాతికుండలు.. -
రంగంలోకి బడా నేతలు
[ 08-07-2024]
ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జహీర్ రంజానీపై అవిశ్వాస తీర్మాన నేపథ్యంలో ఆయా పార్టీల బడానేతలు రంగంలోకి దిగడంతో ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. -
బ్లీచింగ్ పౌడర్ సరఫరా ఏది?
[ 08-07-2024]
కౌటాల మండలంలోని గుడ్లబోరి గ్రామంలో పదిరోజులుగా పలువురు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. 50 మందికి పైగా జ్వరం, ఒళ్లు నొప్పులతో మంచంపట్టారు. -
కార్మిక లోకం.. అవగాహన లోపం
[ 08-07-2024]
ఆదిలాబాద్ నేతాజీ కూడలి, పంజాబ్చౌక్, శివాజీ కూడలి, దస్నాపూర్లోని పెట్రోల్ బంక్ ప్రాంతం అడ్డా కూలీలకు పేరొందాయి. -
ఐటీడీఏ బోధనేతర ఉద్యోగులకు స్థానచలనం
[ 08-07-2024]
ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖల్లో పని చేస్తున్న బోధనేతర ఉద్యోగులు అయిదేళ్ల నుంచి బదిలీలకు నోచుకోకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రిమ్స్ డైరెక్టర్కు అరుదైన అవకాశం
[ 08-07-2024]
ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాల డైరెక్టర్ డా.జైసింగ్కు అరుదైన అవకాశం లభించింది. తాజాగా ఆయనను సెనేటర్గా ఎంపిక చేస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం నియమించింది. -
మీ సేవ.. మరింత చేరువ!
[ 08-07-2024]
మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మహిళా శక్తి పథకం ద్వారా ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాల పోషణకు పరోక్షంగా సహాయ పడుతోంది. -
‘మత్తు’లో మట్టుబెట్టారు..!
[ 08-07-2024]
శ్రీ ముగ్గురూ మైనర్లే. పైగా మద్యం తాగిఉన్నారు. ఆ సమయంలో మరో యువకుడు మద్యం మత్తులో వారిని లిఫ్ట్ అడిగాడు. దుర్భాషలాడాడు. -
గుర్తించలేకే...
[ 08-07-2024]
ఆరోగ్య మహిళ.. అతివలకు ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతీ మంగళవారం నిర్వహిస్తోంది. -
చిటపట చినుకు.. ప్రయాణికులకు వణుకు
[ 08-07-2024]
రైల్వే క్రాసింగ్ల వద్ద ప్రమాదాల నివారణకు, రైళ్ల రాకపోకలతో తలెత్తే ట్రాఫిక్ తదితర సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో గేట్మెన్ రహిత రైల్వేగేట్ల కోసం అండర్బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టారు. -
రాయితీ బియ్యం.. అక్రమార్కుల పరం
[ 08-07-2024]
రేషన్ బియ్యం అక్రమార్కులపరం అవుతోంది. దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. జిల్లాలో బియ్యం రవాణా యథేచ్ఛగా సాగుతోంది. -
సందడే.. సందడి
[ 08-07-2024]
అథ్లెటిక్స్ ట్రాక్పై చిన్నారుల పరుగులు. చప్పట్లు కొడుతూ కొందరు.. ఈలలు, కేరింతలతో చిన్నారులను ప్రోత్సహిస్తూ మరికొందరు.