జడ్పీలో ఇక ప్రత్యేక పాలన
జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం గురువారం ముగియనుండటంతో శుక్రవారం ప్రత్యేకాధికారి పాలన మొదలు కానుంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక పాలనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
నేటితో పాలకవర్గ పదవీకాలం ముగింపు
న్యూస్టుడే, ఆదిలాబాద్ పట్టణం
జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం గురువారం ముగియనుండటంతో శుక్రవారం ప్రత్యేకాధికారి పాలన మొదలు కానుంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక పాలనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్లు ఏర్పడినప్పటి నుంచి ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలో పాలన సాగడం ఇది ఆరోసారి. మరోపక్క మండల పరిషత్లలో పాలకవర్గ పదవీకాలం బుధవారం ముగియడంతో అక్కడ మండల ప్రత్యేక అధికారుల పాలన గురువారం నుంచి ప్రారంభం కానుంది.
పాలకవర్గం పదవీ కాలం ముగియనుండడంతో జిల్లా కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా నియమించనున్నారు. ఆది నుంచి ఇదే ఆనవాయితీగా వస్తోంది. పాలకవర్గానికి ఉండే అధికారాలన్నీ ప్రత్యేక అధికారికి ఉంటాయి. వచ్చిన నిధుల కేటాయింపు, పనుల ఎంపిక తదితర వ్యవహారాలన్నీ ఆయనే చూడాల్సి ఉంటుంది. జడ్పీ కార్యాలయంతోపాటు జడ్పీ పరిధిలోకి వచ్చే మండల పరిషత్ కార్యాలయాలు, జడ్పీ పాఠశాల బీసీ గణన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే సర్పంచి ఎన్నికలను వాయిదా వేసినట్లు ప్రచారం జరిగింది. ఇదే తరహాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
1976లో మొదటిసారి..
1959 నవంబరు 29న జడ్పీలో పాలకవర్గం తొలిసారి కొలువు దీరింది. అప్పటి నుంచి జడ్పీ ఛైర్మన్ పాలన మొదలైంది. ఆ తర్వాత ఎన్నికల జాప్యం వల్ల ప్రత్యేక అధికారి పాలన అనివార్యమైంది. తొలిసారి 1976లో ప్రత్యేక అధికారి పాలన విధానాన్ని అమలుచేశారు. జిల్లా కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా నియమించి పాలన సాగించారు. ఆ సమయంలో అయిదేళ్లు 1981 వరకు ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలోనే పాలన జరిగింది. రెండోసారి 1986లో దాదాపు 11 నెలలపాటు కొనసాగింది. మూడోసారి 1992లోనూ ప్రత్యేక అధికారిని నియమించి సుమారు మూడు సంవత్సరాలపాటు పాలన అమలు చేశారు. నాలుగోసారి 2000 సంవత్సరంలో మళ్లీ ప్రత్యేక అధికారి పాలన వచ్చింది. దాదాపు 14 నెలల పాటు ఎన్నికలు నిర్వహించలేదు. అయిదోసారి 2011లో ప్రత్యేక అధికారి పాలన మూడేళ్లపాటు సాగింది. అయిదోసారి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ సమయంలో ఎన్నికలు నిర్వహిచేందుకు ఆసక్తి చూపలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించాకే 2014లో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. జడ్పీ ఆవిర్భవించినప్పటినుంచి ఇప్పటి వరకు 13 సంవత్సరాల 3 నెలలపాటు ప్రత్యేక పాలన సాగింది. తాజాగా ఆరోసారి జిల్లా పరిషత్లో ప్రత్యేక అధికారి పాలన ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక జిల్లాల విభజన తర్వాత ఇదే మొదటిసారి ప్రత్యేక పాలన కానుంది.
మండల ప్రత్యేక అధికారులకు అధికారాలు
మండల పరిషత్లలోని ఎంపీపీ, ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో జిల్లాస్థాయి హోదా కలిగిన అధికారులను ఆయా మండలాల్లో ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఎంపీపీకి ఉన్న అధికారాలే వారికి కల్పించారు. ఎంపీడీఓతో సమన్వయం చేసుకుంటూ వీరు పని చేస్తారు. పనుల ఎంపిక, ప్రణాళిక తయారు, వివిధ మండల శాఖల సమీక్ష, పంచాయతీల పర్యవేక్షణ వంటి అన్ని అధికారాలు వీరికి ఉంటాయి. జిల్లాలోని 17 మండలాల్లో నియమించిన ప్రత్యేక అధికారులు గురువారం బాధ్యతలు స్వీకరించాలని కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇంతకు ముందే బాధ్యతల అప్పగింత
వర్షాకాలం ఆరంభం కంటే ముందుగానే నెల కిందట జిల్లా కలెక్టర్ రాజర్షిషా ప్రతి మండలానికి జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పాఠశాలల్లో విద్య అమలు, సీజనల్ వ్యాధులు ఇతర విషయాలపై పర్యవేక్షణ వంటి బాధ్యతలు అప్పగించారు. తాజాగా వారినే మండల పరిషత్ ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు మద్యం దుకాణాల్లో చోరీ
[ 07-07-2024]
పట్టణంలోని రెండు మద్యం దుకాణాల్లో చోరీ ఘటనలు ఆదివారం వెలుగు చూశాయి. -
సహకారం అందిస్తేనే అన్నదాతకు ప్రయోజనం
[ 07-07-2024]
విత్తనం తయారీకి గత యాసంగిలో దండేపల్లి మండలంలో సాగు చేసిన పొలం ఇది. ఒక ప్రైవేటు కంపెనీ ఆడ, మగ మూల విత్తనాలను పొలానికి చెందిన రైతుకు అందజేసి... పంట చేతికొచ్చే వరకు సలహాలు, సూచనలు అందజేశారు. -
సర్సిల్క్భూములు.. అన్యాక్రాంతం
[ 07-07-2024]
కాగజ్నగర్ మండలంలోని చింతగూడ, బల్గల శివారులో మూతబడిన సర్సిల్క్ మిల్లు స్థలాలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కొందరు యథేచ్ఛగా కబ్జాచేసి పంటలు సాగు చేసుకుంటున్నారు. -
చికిత్స పొందుతూ మరో యువతి మృతి
[ 07-07-2024]
కుటుంబ కలహాలతో జిల్లాలోని కాగజ్నగర్ మండలం గజ్జిగూడకు చెందిన ఓ తల్లీ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఈ నెల 1వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన కలకలం సృష్టించిన విషయం విదితమే. -
అడిగినంత ఇచ్చెయ్.. అక్రమంగా కట్టెయ్!
[ 07-07-2024]
మంచిర్యాలలోని గంగారెడ్డి రోడ్డులో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
మీ వెంటే మేమంటూ..
[ 07-07-2024]
విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు తమ సొంత పిల్లల్లా ఆలనా పాలన చూసుకుంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆ ఉపాధ్యాయులపై ఎంతటి అభిమానం ఉంటుందో తెలిపే చిత్రమిది. -
సర్కారు కళాశాలలు వెలవెల
[ 07-07-2024]
నిర్మల్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాలతో జనరల్, ఒకేషనల్ కోర్సులను బోధిస్తున్నారు -
నిధులు కరవు.. నిర్వహణ బరువు
[ 07-07-2024]
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతల సంక్షేమం కోసం నిర్మించిన రైతు వేదికలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. -
దృశ్యబోధన మరింత ప్రభావవంతం
[ 07-07-2024]
ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ టచ్స్క్రీన్ టీవీల ద్వారా దృశ్య బోధనను మరింత ప్రభావవంతం చేసేందుకు విద్యా శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది -
నగదు రహితం.. పారదర్శకతే లక్ష్యం
[ 07-07-2024]
మీసేవ కేంద్రాల్లో పారదర్శకంగా చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్రాల్లో అందించే పౌర సేవలకు నిర్వాహకులు దరఖాస్తుదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. -
మహారాష్ట్ర సరిహద్దులో రహదారి ప్రమాదం
[ 07-07-2024]
మహారాష్ట్ర సరిహద్దులో శనివారం జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, మహారాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాలిలా.. ధర్మాబాద్ తాలూకాలోని రత్నెల్లి గ్రామానికి చెందిన గణేష్ తన స్నేహితులతో కలిసి నిజామాబాద్ జిల్లా నవీపేట మేకల సంతకు వెళ్లారు -
అటవీఅనుమతి లేక.. ఆగిన వంతెన
[ 07-07-2024]
మూడు మండలాలు, వందకుపైగా గ్రామాలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రహదారి. ఆ దారిలో ఉన్న వాగుపై నిర్మించిన వంతెన అప్రోచ్ దారులు ఏటా కొట్టుకుపోతుండటంతో ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు -
జంతు వధశాల తరలింపునకు నిర్ణయం
[ 07-07-2024]
జిల్లా కేంద్రం శివారులో ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఉన్న జంతు వధశాల(స్లాటర్హౌజ్)ను ఎట్టకేలకు అక్కడి నుంచి తరలించాలని బల్దియా యంత్రాంగం నిర్ణయించింది
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
-
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
-
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?
-
అమ్మానాన్న మనసు వెన్న.. మమత మిన్న.. ఆలోచన రేకెత్తించిన విద్యార్థుల ప్రాజెక్టు
-
సూరత్లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు
-
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ