ఆర్జీయూకేటీలో తగ్గిన ప్రవేశాలు
ఆర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల జాబితాను బుధవారం విడుదల చేసింది.
రాష్ట్రంలో నిర్మల్ జిల్లాకు ఐదో స్థానం
ముథోల్(బాసర), న్యూస్టుడే
ఆర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల జాబితాను బుధవారం విడుదల చేసింది. మొత్తం 15000 దరఖాస్తులు రాగా సీటు పొందిన 1404 మంది విద్యార్థుల జాబితాను హైదరాబాద్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేష్, విశ్వవిద్యాలయ ఇన్ఛార్జి ఉపకులపతి విడుదల చేశారు. జాబితాను విశ్వవిద్యాలయ వెబ్సైట్లో పొందుపరిచారు. పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవగా ఆర్జీయూకేటీలో మాత్రం అయిదో స్థానానికే పరిమితమైంది. గత సంవత్సరంతో పోల్చితే ఈ సారి ఉమ్మడి జిల్లాలో 18 సీట్లు తగ్గాయి. నిర్మల్ జిల్లా నుంచి గత ఏడాది 92 మంది విద్యార్థులు ఎంపికవగా.. ఈ సారి 72 మంది విద్యార్థులు మాత్రమే ఎంపికయ్యారు.
ఈసారి 20 సీట్లు తగ్గాయి..
నిర్మల్ జిల్లా నుంచి గతేడాది ఆర్జీయూకేటీకి 92 మంది విద్యార్థులు ఎంపికవగా ఈ సారి 72 మంది విద్యార్థులు మాత్రమే ఎంపికయ్యారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినప్పటికీ మార్కుల శాతం తక్కువగా ఉండటంతో సీట్ల సంఖ్య పెరగడం లేదు.
ఉమ్మడి జిల్లాలో 131 మంది ఎంపిక..
బాసర ఆర్జీయూకేటీకి ఉమ్మడి జిల్లా నుంచి 131 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. గత సంవత్సరం 149 మంది విద్యార్థులు ఎంపిక కాగా గతంతో పోల్చుకుంటే ఉమ్మడి జిల్లాలో 18 సీట్లు తగ్గాయి. నిర్మల్ 72, మంచిర్యాల 28, ఆదిలాబాద్ 27, కుమురంభీం నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. నిర్మల్ విద్యార్థులను జిల్లా పాలనాధికారి అభిలాష అభినవ్, జిల్లా విద్యాధికారి రవీందర్లు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముందు మెరుపులు.. వెనుక మరకలు
[ 06-07-2024]
ముందు నుంచి చూసి భవన సముదాయం పూర్తయిందని సంతోషపడి లోనికి వెళ్తే ఇంకా పనులు పూర్తికాని విషయం తెలుస్తుంది. భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ పరిస్థితి ఇది. -
ఆంగ్ల మాధ్యమానికి అవాంతరాలు
[ 06-07-2024]
భుక్తాపూర్లోని అంగన్వాడీలో ఇరుకైన ఈ గదిలోనే విద్యాబోధన చేస్తున్నారు. ఈ కేంద్రానికి ఆయా లేకపోవటంతో టీచరే పిల్లలను కేంద్రానికి తీసుకురావటం, వారికి మధ్యాహ్న భోజనంచేసి పెట్టడం, సమావేశాలకు వెళ్లటం, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సర్వేలు చేయాల్సి వస్తోంది. -
గుంపులుగా కోతులు.. ప్రజలకు వెతలు
[ 06-07-2024]
జిల్లాలో కోతుల బెడదకు ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లోకి చొరబడి దాడులకు పాల్పడుతున్నాయి. -
పుర క్యాంపు రాజకీయాలు షురూ
[ 06-07-2024]
ఆదిలాబాద్లో క్యాంపు రాజకీయాలు ఆరంభమయ్యాయి. ఓ పక్క కాంగ్రెస్ పార్టీ భారాస కౌన్సిలర్లకు గాలం వేస్తూ తమ పార్టీలో చేర్చుకుంటుండగా మరోపక్క ఎదుటి పక్షం సైతం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
అమ్మకు ఆపద.. ఎన్నేళ్లయినా తీరదా..?
[ 06-07-2024]
‘ఓ వైపు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది. మరోవైపు పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణి పడవలో ప్రయాణం.. కింద సుడులు తిరుగుతున్న నీళ్లు. -
శిరస్త్రాణంపై నిర్లక్ష్యం.. మూల్యం ప్రాణం
[ 06-07-2024]
ద్విచక్ర వాహనం నడిపే ప్రతి చోదకుడు ఇంటి నుంచి బయటకి వెళ్లే క్రమంలోనే విధిగా శిరస్త్రాణం ధరించి ప్రయాణించాలి. -
రెండు రోజులకో ఆత్మహత్య
[ 06-07-2024]
భర్త ఇంటికి తాగొచ్చి గొడవ పడుతున్నాడనే కారణంతో.. కాగజ్నగర్ మండలం గజ్జిగూడ గ్రామానికి చెందిన ముగ్గురు కూతుళ్లతో కలిసి భార్య ఒకేసారి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. -
నీరున్నా ఎత్తిపోయవు!
[ 06-07-2024]
జిల్లాలో నీటి వనరులకు కొదువలేదు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తారు. వీటితోపాటు ఎత్తిపోతల పథకాల కింద వేలాది ఎకరాలకు సాగు నీరు అందించాలని నిర్ణయించి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 40 నిర్మించారు. -
ఆరోగ్య మహిళ.. కావాలి మరింత శ్రద్ధ
[ 06-07-2024]
ప్రత్యేక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి మంగళవారం మహిళా వైద్యులు, సిబ్బందితో ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. -
బది‘లీలలు’ఇన్నిన్ని కాదయా..!
[ 06-07-2024]
ఉపాధ్యాయ బదిలీలు.. సుదీర్ఘకాలంగా ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సందర్భమిది. ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉండాలని, అందరికీ న్యాయం జరగాలని పదేపదే అభ్యర్థించారు. -
మైనర్ డ్రైవింగ్.. యజమానిపై కేసు
[ 06-07-2024]
నిబంధనలకు విరుద్ధంగా మైనర్కు వాహనం ఇచ్చిన యజమానిపై పట్టణ పోలీసులు కేసు నమోదుచేశారు. సీఐ ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం.