మైనింగ్ మెరికలు
పదోతరగతి పూర్తికాగానే పాలిటెక్నిక్ చేసేందుకు విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. కోర్సు పూర్తికాగానే ఏడాదికి రూ.లక్షల్లో ప్యాకేజీ అందుకొంటుండటమే దీనికి కారణం.
ఉద్యోగాలు సాధిస్తున్న బెల్లంపల్లి పాలిటెక్నిక్ విద్యార్థులు
బెల్లంపల్లి పట్టణం, న్యూస్టుడే
పదోతరగతి పూర్తికాగానే పాలిటెక్నిక్ చేసేందుకు విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. కోర్సు పూర్తికాగానే ఏడాదికి రూ.లక్షల్లో ప్యాకేజీ అందుకొంటుండటమే దీనికి కారణం. బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో మైనింగ్ డిప్లొమా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ప్రస్తుతం ఏడాదికి రూ.15 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు జీతం తీసుకుంటున్నారు. ప్రస్తుతం సింగరేణిలో మైనింగ్ అర్హతతో జూనియర్ మైనింగ్ అధికారి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులతోపాటు పాలిటెక్నిక్ కోర్సుల్లో ఉద్యోగ అవకాశాలపై ‘న్యూస్టుడే’ కథనం.
పాలిసెట్తో ప్రవేశాలు
బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమాలో మైనింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ కోర్సులున్నాయి. ఇప్పటికే కళాశాలలో పాలిసెట్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. ఆప్షన్ల ఎంపిక ప్రక్రియకు పూర్తి చేశారు. డిప్లొమా కోర్సు పూర్తి చేసిన తర్వాత ఈసెట్ రాసి లేటరల్ ఎంట్రీతో నేరుగా బీటెక్ రెండో సంవత్సరం చదవడానికి అవకాశం ఉంటుంది.
మైనింగ్లో ఉద్యోగ అవకాశాలు
మైనింగ్తో సింగరేణితోపాటు ఇతర సంస్థల్లోనూ ఉద్యోగాలు ఉన్నాయి. అండర్గ్రౌండ్ మైన్స్ సింగరేణి, కోలిండియా, ఉపరితల గనులు(కోల్ అండ్ మెటల్), సిమెంట్ కంపెనీలు, ఎక్స్ప్లోజీవ్ కంపెనీలు, ప్రైవేట్ క్వారీలు, మైనింగ్ రీసర్చ్ సైంటిస్ట్లు, మైనింగ్ ఇన్స్పెక్టర్లు, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లలో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా పూర్తి కాగానే తక్కువ వయసులో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు సాఫ్ట్వేర్ కంపెనీల్లోనూ ఉన్నత ఉద్యోగాలు సాధించారు.
మంచి భవిష్యత్తు: రవీందర్రెడ్డి, ప్రిన్సిపల్, పాలిటెక్నిక్ కళాశాల, బెల్లంపల్లి
పాలిటెక్నిక్ కళాశాలల్లో మంచి కోర్సులు చేయడానికి అవకాశం ఉంటుంది. బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో మూడు కోర్సులు ఉన్నాయి. మైనింగ్ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగానే ఉండడంతో ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కోర్సు పూర్తయ్యేలోపు ఉద్యోగాలు సాధించిన వారు చాలా మంది ఉన్నారు.
మంచిర్యాలలోని గోపాల్వాడకు చెందిన మహ్మద్ యూసుఫ్ డిప్లొమాలో మైనింగ్ ఇంజినీరింగ్ చదివారు. ఈ సమయంలో ద రామ్కో సిమెంట్ కంపెనీలో ఉద్యోగాన్ని సాధించారు. ఉద్యోగం చేస్తూనే బీటెక్ పూర్తి చేయడానికి సైతం కంపెనీ అవకాశం కల్పిస్తుంది.
-మహ్మద్ యూసుఫ్
బెల్లంపల్లి పట్టణానికి చెందిన అల్వార్ వనక్రిష్ణన్ బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో 2018-21 మధ్య మైనింగ్ డిప్లొమా పూర్తి చేశారు. ఈసెట్లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగూడెంలో మైనింగ్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ ఏడాది కోర్సు పూర్తికాగానే వేదాంత రీసోర్సెస్ లిమిటెడ్ కంపెనీలో ఏడాదికి రూ.15.95 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం దక్కించుకున్నారు.
-అల్వార్ వనక్రిష్ణన్
ఆదిలాబాద్ జిల్లా సిరికొండకు చెందిన బొంతల సురేష్ బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో 2018-21 మధ్య మైనింగ్ డిప్లొమా చదివారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగూడెంలో బీటెక్ పూర్తి చేశారు. ఇది పూర్తి కాగానే ఈ ఏడాది వేదాంత రీసోర్సెస్ లిమిటెడ్ కంపెనీలో సంవత్సరానికి రూ.16 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం పొందారు.
-బొంతల సురేష్
చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన వెయిగండ్ల మనోజ్ ఈ ఏడాది మైనింగ్ ఇంజినీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు. డిప్లొమా చదువుతుండగానే ద రామ్కో సిమెంట్స్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అతి తక్కువ వయసులో డిప్లొమాతో ఉద్యోగం దక్కించుకున్నారు.
-వెయిగండ్ల మనోజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోసిలో ఉచిత వైద్య శిబిరం
[ 07-07-2024]
బైంసాలోని ఆరుష్ చిన్నపిల్లల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం బోసిలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. -
ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం
[ 07-07-2024]
ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని తానూరు మండలంలోని హిప్నెల్లిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
రెండు మద్యం దుకాణాల్లో చోరీ
[ 07-07-2024]
పట్టణంలోని రెండు మద్యం దుకాణాల్లో చోరీ ఘటనలు ఆదివారం వెలుగు చూశాయి. -
సహకారం అందిస్తేనే అన్నదాతకు ప్రయోజనం
[ 07-07-2024]
విత్తనం తయారీకి గత యాసంగిలో దండేపల్లి మండలంలో సాగు చేసిన పొలం ఇది. ఒక ప్రైవేటు కంపెనీ ఆడ, మగ మూల విత్తనాలను పొలానికి చెందిన రైతుకు అందజేసి... పంట చేతికొచ్చే వరకు సలహాలు, సూచనలు అందజేశారు. -
సర్సిల్క్భూములు.. అన్యాక్రాంతం
[ 07-07-2024]
కాగజ్నగర్ మండలంలోని చింతగూడ, బల్గల శివారులో మూతబడిన సర్సిల్క్ మిల్లు స్థలాలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కొందరు యథేచ్ఛగా కబ్జాచేసి పంటలు సాగు చేసుకుంటున్నారు. -
చికిత్స పొందుతూ మరో యువతి మృతి
[ 07-07-2024]
కుటుంబ కలహాలతో జిల్లాలోని కాగజ్నగర్ మండలం గజ్జిగూడకు చెందిన ఓ తల్లీ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఈ నెల 1వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన కలకలం సృష్టించిన విషయం విదితమే. -
అడిగినంత ఇచ్చెయ్.. అక్రమంగా కట్టెయ్!
[ 07-07-2024]
మంచిర్యాలలోని గంగారెడ్డి రోడ్డులో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
మీ వెంటే మేమంటూ..
[ 07-07-2024]
విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు తమ సొంత పిల్లల్లా ఆలనా పాలన చూసుకుంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆ ఉపాధ్యాయులపై ఎంతటి అభిమానం ఉంటుందో తెలిపే చిత్రమిది. -
సర్కారు కళాశాలలు వెలవెల
[ 07-07-2024]
నిర్మల్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాలతో జనరల్, ఒకేషనల్ కోర్సులను బోధిస్తున్నారు -
నిధులు కరవు.. నిర్వహణ బరువు
[ 07-07-2024]
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతల సంక్షేమం కోసం నిర్మించిన రైతు వేదికలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. -
దృశ్యబోధన మరింత ప్రభావవంతం
[ 07-07-2024]
ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ టచ్స్క్రీన్ టీవీల ద్వారా దృశ్య బోధనను మరింత ప్రభావవంతం చేసేందుకు విద్యా శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది -
నగదు రహితం.. పారదర్శకతే లక్ష్యం
[ 07-07-2024]
మీసేవ కేంద్రాల్లో పారదర్శకంగా చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్రాల్లో అందించే పౌర సేవలకు నిర్వాహకులు దరఖాస్తుదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. -
మహారాష్ట్ర సరిహద్దులో రహదారి ప్రమాదం
[ 07-07-2024]
మహారాష్ట్ర సరిహద్దులో శనివారం జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, మహారాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాలిలా.. ధర్మాబాద్ తాలూకాలోని రత్నెల్లి గ్రామానికి చెందిన గణేష్ తన స్నేహితులతో కలిసి నిజామాబాద్ జిల్లా నవీపేట మేకల సంతకు వెళ్లారు -
అటవీఅనుమతి లేక.. ఆగిన వంతెన
[ 07-07-2024]
మూడు మండలాలు, వందకుపైగా గ్రామాలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రహదారి. ఆ దారిలో ఉన్న వాగుపై నిర్మించిన వంతెన అప్రోచ్ దారులు ఏటా కొట్టుకుపోతుండటంతో ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు -
జంతు వధశాల తరలింపునకు నిర్ణయం
[ 07-07-2024]
జిల్లా కేంద్రం శివారులో ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఉన్న జంతు వధశాల(స్లాటర్హౌజ్)ను ఎట్టకేలకు అక్కడి నుంచి తరలించాలని బల్దియా యంత్రాంగం నిర్ణయించింది
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?
-
ప్రభాస్ పెళ్లిపై స్పందించిన శ్యామలా దేవి.. సక్సెస్ రాదన్నారు వచ్చింది
-
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
-
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
-
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?