పత్తి విత్తనాలు మొలకెత్తలేదని యువ రైతు ఆత్మహత్మ
పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదని మనోవేదనకు గురై ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం..
పెంబి, న్యూస్టుడే : పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదని మనోవేదనకు గురై ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాపలగూడ గ్రామానికి చెందిన అర్క సంతోష్ (29) తనకున్న ఎకరం భూమితో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని ఇటీవలే పత్తి విత్తనాలు విత్తాడు. విత్తిన రోజే రాత్రి భారీ వర్షం కురువడంతో భూమి గట్టిగా మారి సరిగా మొలకెత్తలేదు. ఈ క్రమంలో మనోవేదనకు గురై మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో అంబులెన్స్లో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
విద్యుదాఘాతంతో విద్యార్థి దుర్మరణం
ఆదిలాబాద్ నేర విభాగం: విద్యుదాఘాతంలో విద్యార్థి మృతి చెందిన ఘటన మావల పోలీసు స్టేషన్ పరిధిలోని కేఆర్కే కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్ఛార్జి ఎస్ఐ ముజాహిద్ వివరాల ప్రకారం.. బజార్హత్నూర్ మండలం భూతాయికి చెందిన ఫడ్ బాలాజీ కుటుంబం ఆ కాలనీలో పదేళ్లుగా నివాసం ఉంటోంది. కూలీ పనులు చేసుకునే ఫడ్ బాలాజీకి గోపాల్ ఒక్కడే సంతానం. ఏడో తరగతి పూర్తి చేసుకున్న గోపాల్ బుధవారం ఉదయం కాలనీలో ఆడుకొని వారుండే వీధిలోంచి వెళ్తూ రఫీక్ ఇంటి కిటికీ వద్ద ఏర్పాటు చేసుకున్న కూలర్ను ముట్టుకున్నాడు. కూలర్కు విద్యుత్తు సరఫరా అవుతుండటంతో విద్యుదాఘాతానికి గురై పక్కనే ఉన్న మురుగు కాలువలో పడిపోయి మృతి చెందాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూలర్ ఏర్పాటు చేసుకొని నిర్లక్ష్యంగా వదిలేసిన రఫీక్పై ఏఎస్ఐ యూనుస్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
సీసీఐలోని జనరేటర్ యంత్ర ప్లేట్ల చోరీ
ఆదిలాబాద్ నేర విభాగం: ఆదిలాబాద్ పట్టణంలో మూతపడిన సిమెంటు పరిశ్రమలోని యంత్రాల విడి భాగాల చోరీ పరంపర కొనసాగుతోంది. తాజాగా మంగళవారం రాత్రి పరిశ్రమలోని డీజీ సెట్ అనే భారీ యంత్రానికి ఉన్న ఎనిమిది ప్లేట్లను ఆగంతకులు తొలగించి తస్కరించారు. విద్యుత్తు సరఫరాలో ఆటంకం ఏర్పడినప్పుడు వినియోగించుకోవటానికి డీజీ సెట్ అనే జనరేటర్ను అప్పట్లోనే రూ.25 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. పరిశ్రమ మూతపడటంతో అది నిరుపయోగంగా మారింది. దీనికి రెండు వైపుల ఉన్న విలువైన ప్లేట్లను దొంగలు విడదీసి ఎత్తుకెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోసిలో ఉచిత వైద్య శిబిరం
[ 07-07-2024]
బైంసాలోని ఆరుష్ చిన్నపిల్లల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం బోసిలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. -
ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం
[ 07-07-2024]
ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని తానూరు మండలంలోని హిప్నెల్లిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
రెండు మద్యం దుకాణాల్లో చోరీ
[ 07-07-2024]
పట్టణంలోని రెండు మద్యం దుకాణాల్లో చోరీ ఘటనలు ఆదివారం వెలుగు చూశాయి. -
సహకారం అందిస్తేనే అన్నదాతకు ప్రయోజనం
[ 07-07-2024]
విత్తనం తయారీకి గత యాసంగిలో దండేపల్లి మండలంలో సాగు చేసిన పొలం ఇది. ఒక ప్రైవేటు కంపెనీ ఆడ, మగ మూల విత్తనాలను పొలానికి చెందిన రైతుకు అందజేసి... పంట చేతికొచ్చే వరకు సలహాలు, సూచనలు అందజేశారు. -
సర్సిల్క్భూములు.. అన్యాక్రాంతం
[ 07-07-2024]
కాగజ్నగర్ మండలంలోని చింతగూడ, బల్గల శివారులో మూతబడిన సర్సిల్క్ మిల్లు స్థలాలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కొందరు యథేచ్ఛగా కబ్జాచేసి పంటలు సాగు చేసుకుంటున్నారు. -
చికిత్స పొందుతూ మరో యువతి మృతి
[ 07-07-2024]
కుటుంబ కలహాలతో జిల్లాలోని కాగజ్నగర్ మండలం గజ్జిగూడకు చెందిన ఓ తల్లీ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఈ నెల 1వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన కలకలం సృష్టించిన విషయం విదితమే. -
అడిగినంత ఇచ్చెయ్.. అక్రమంగా కట్టెయ్!
[ 07-07-2024]
మంచిర్యాలలోని గంగారెడ్డి రోడ్డులో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
మీ వెంటే మేమంటూ..
[ 07-07-2024]
విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు తమ సొంత పిల్లల్లా ఆలనా పాలన చూసుకుంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆ ఉపాధ్యాయులపై ఎంతటి అభిమానం ఉంటుందో తెలిపే చిత్రమిది. -
సర్కారు కళాశాలలు వెలవెల
[ 07-07-2024]
నిర్మల్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాలతో జనరల్, ఒకేషనల్ కోర్సులను బోధిస్తున్నారు -
నిధులు కరవు.. నిర్వహణ బరువు
[ 07-07-2024]
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతల సంక్షేమం కోసం నిర్మించిన రైతు వేదికలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. -
దృశ్యబోధన మరింత ప్రభావవంతం
[ 07-07-2024]
ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ టచ్స్క్రీన్ టీవీల ద్వారా దృశ్య బోధనను మరింత ప్రభావవంతం చేసేందుకు విద్యా శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది -
నగదు రహితం.. పారదర్శకతే లక్ష్యం
[ 07-07-2024]
మీసేవ కేంద్రాల్లో పారదర్శకంగా చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్రాల్లో అందించే పౌర సేవలకు నిర్వాహకులు దరఖాస్తుదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. -
మహారాష్ట్ర సరిహద్దులో రహదారి ప్రమాదం
[ 07-07-2024]
మహారాష్ట్ర సరిహద్దులో శనివారం జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, మహారాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాలిలా.. ధర్మాబాద్ తాలూకాలోని రత్నెల్లి గ్రామానికి చెందిన గణేష్ తన స్నేహితులతో కలిసి నిజామాబాద్ జిల్లా నవీపేట మేకల సంతకు వెళ్లారు -
అటవీఅనుమతి లేక.. ఆగిన వంతెన
[ 07-07-2024]
మూడు మండలాలు, వందకుపైగా గ్రామాలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రహదారి. ఆ దారిలో ఉన్న వాగుపై నిర్మించిన వంతెన అప్రోచ్ దారులు ఏటా కొట్టుకుపోతుండటంతో ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు -
జంతు వధశాల తరలింపునకు నిర్ణయం
[ 07-07-2024]
జిల్లా కేంద్రం శివారులో ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఉన్న జంతు వధశాల(స్లాటర్హౌజ్)ను ఎట్టకేలకు అక్కడి నుంచి తరలించాలని బల్దియా యంత్రాంగం నిర్ణయించింది
తాజా వార్తలు (Latest News)
-
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
-
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
-
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?
-
అమ్మానాన్న మనసు వెన్న.. మమత మిన్న.. ఆలోచన రేకెత్తించిన విద్యార్థుల ప్రాజెక్టు
-
సూరత్లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు