చెరిపేస్తున్నారు.. చక్కదిద్దేవరు?
చెరువు.. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా ఇది ఉండటం ఎంతో ఆవశ్యకం. కేవలం సాగునీటి కోసమే కాదు.. అక్కడి ప్రజలు, జీవరాశుల ఇతర అవసరాలను తీర్చడంలో దాని ప్రాధాన్యం అంతాఇంతా కాదు.
ప్రశ్నార్థకంగా చెరువుల భవిష్యత్తు
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే
చెరువు.. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా ఇది ఉండటం ఎంతో ఆవశ్యకం. కేవలం సాగునీటి కోసమే కాదు.. అక్కడి ప్రజలు, జీవరాశుల ఇతర అవసరాలను తీర్చడంలో దాని ప్రాధాన్యం అంతాఇంతా కాదు. చెప్పాలంటే.. తల్లిలాంటి ఆ జలనిధి స్థానం భర్తీచేయడంలో ఇంకేదీ సాటిరాదు. ఒక చెరువు ఉంటేనే ఎంతో అక్కరకొచ్చే ఇలాంటి పరిస్థితుల్లో బంగారంలా ఉన్న 11 గొలుసుకట్టు తటాకాలతో ఇంకెంత ప్రయోజనం కలుగుతుందో ఊహించలేనిది కాదు. అలాంటి వనరులను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ. ఈ విషయంలో పాలకులు, అధికారుల పాత్ర ఇంకాస్త కీలకం. కానీ, నిర్మల్ పట్టణంలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాలకుల నిలువెత్తు నిర్లక్ష్యానికి అధికారుల నిర్లిప్తత తోడవుతుండటంతో విలువైన జలవనరులు దెబ్బతింటున్నాయి. మున్ముందు ఆనవాళ్లను కోల్పోయే పరిస్థితిని కొనితెచ్చుకుంటున్నాయి.
కేవలం సాగుకేనా..?
చెరువులు కేవలం సాగునీటి అవసరాలకే ఉపయోగపడుతాయా.. అంటే అంతకన్నా వెర్రితనం ఇంకోటి ఉండకపోవచ్చు. ఎందుకంటే, ఆ నీటిలో చేపల పెంపకం చేపట్టవచ్చు. దుస్తులు ఉతుక్కునేందుకు పనికొస్తుంది. పశువుల దాహార్తి తీర్చేందుకు అవసరమవుతుంది. సమీపంలో శ్మశానవాటికలు ఉంటే స్నానం చేసేందుకు, ఇతర అవసరాలకు అక్కరకొస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆ ప్రాంతంలో భూగర్భ జలవనరులు పెరిగేందుకు ఎంతో దోహదం చేస్తుంది. ఇదంతా అధికారులకు తెలియనిది కాదు. అయినా.. వివిధ రకాల ఒత్తిళ్ల కారణంగా తమ విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని, ఫలితంగా క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయనేది బహిరంగ రహస్యం.
నిబంధనలు అంటూ..
చెరువుల కింద సాగు ఉంటేనే తమశాఖ పర్యవేక్షిస్తుందని, అవసరమైన చర్యలు చేపడుతుందంటూ నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పట్టణం విస్తరిస్తుండటం, అవసరాలు పెరుగుతుండటంతో ఇదివరకున్న సాగుభూములు ఇళ్లస్థలాలుగా మారిపోయాయి. సాగు గణనీయంగా తగ్గిపోయింది. పైన పేర్కొన్న ఉదాహరణలో.. ఇబ్రహీం చెరువు కింద ఆయకట్టు పదెకరాల లోపు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం ఇది కూడా ఉండకపోవచ్చు. దీని పరిధిలో వ్యవసాయం లేదన్న కారణంతో ఇప్పుడీ కట్ట మరమ్మతులను తమశాఖ అంగీకరించే అవకాశం లేదని చెబుతున్నారు. నిబంధనల అమలులో ఇంత పక్కాగా ఉన్న అధికారులు, అసలు కట్ట తవ్వేసే సమయంలో ఏం చేశారో, ఎందుకు పట్టించుకోలేదో వారికే తెలియాలి మరి. వర్షాకాలం మొదలైంది. సకాలంలో పనులు చేపట్టకపోతే నీరంతా ఖాళీ అవుతుంది. మున్ముందు ఇది భూగర్భజలాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఎక్కడాలేని విడ్డూరం..
వర్షాలు బాగా కురిసి చెరువులు నిండితే ఎలా..? నీటిని ఎలా తోడేస్తారు, వాటిని ఎలా సంరక్షిస్తారు అని ఎవరైనా అడిగితే.. నవ్వుకుంటాం. నీరు నిండితే అలుగు నుంచి వెళ్లిపోతుంది. అవసరమైన చోట్ల తూములు ఉంటాయి. వాటి సాయంతో నీటినిల్వను మన అవసరాలకు అనుగుణంగా కొనసాగించే అవకాశం ఉంటుంది కదా అనే సమాధానం చెప్పాలనిపిస్తుంది. కానీ, నిర్మల్లో మాత్రం అదనంగా మరో ఐచ్ఛికం కనిపిస్తుంది. అదేంటంటే.. చెరువు కట్టను తవ్వేయడం! నమ్మశక్యంగా లేకపోయినా, విడ్డూరంగా అనిపిస్తున్నా.. ఇది నిజం. అధికారులు, పాలకులు దగ్గరుండి మరీ ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తుంటారు. దీనికి నిదర్శనం.. ఇబ్రహీం చెరువు. కొద్దినెలల క్రితం భారీవర్షాలతో చెరువు నిండటంతో నీటిని వృథాగా మళ్లించేందుకు కట్టను తవ్వేశారు. ఇదంతా నిబంధనలకు విరుద్ధమే అయినా అధికారులు చేష్టలుడిగిపోయారు. పోనీ, నీటి తరలింపు అనంతరం కట్ట మరమ్మతులు చేపట్టారా అంటే అదీ లేదు. ఆ విషయమే మర్చిపోయారు. కంచెరోని చెరువులోనూ ఇదేరీతిలో నీటిని వృథాగా మళ్లించేసిన ఘటనలున్నాయి. దీనివల్ల చేపల పెంపకానికి ఆటంకం ఏర్పడి మత్స్యకారులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మున్సిపల్ వారే చేపట్టాలి: నరేశ్, నీటిపారుదలశాఖ డీఈ, నిర్మల్
ఇబ్రహీం చెరువు కట్టను తవ్వేసిన విషయం తెలియదు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. దీనికింద సాగు లేకపోవడం వల్ల మా శాఖ ఆధ్వర్యంలో నిధులు కేటాయించి మరమ్మతులు చేపట్టే అవకాశం లేదు. మున్సిపల్ వారే చూసుకోవాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోసిలో ఉచిత వైద్య శిబిరం
[ 07-07-2024]
బైంసాలోని ఆరుష్ చిన్నపిల్లల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం బోసిలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. -
ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం
[ 07-07-2024]
ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని తానూరు మండలంలోని హిప్నెల్లిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
రెండు మద్యం దుకాణాల్లో చోరీ
[ 07-07-2024]
పట్టణంలోని రెండు మద్యం దుకాణాల్లో చోరీ ఘటనలు ఆదివారం వెలుగు చూశాయి. -
సహకారం అందిస్తేనే అన్నదాతకు ప్రయోజనం
[ 07-07-2024]
విత్తనం తయారీకి గత యాసంగిలో దండేపల్లి మండలంలో సాగు చేసిన పొలం ఇది. ఒక ప్రైవేటు కంపెనీ ఆడ, మగ మూల విత్తనాలను పొలానికి చెందిన రైతుకు అందజేసి... పంట చేతికొచ్చే వరకు సలహాలు, సూచనలు అందజేశారు. -
సర్సిల్క్భూములు.. అన్యాక్రాంతం
[ 07-07-2024]
కాగజ్నగర్ మండలంలోని చింతగూడ, బల్గల శివారులో మూతబడిన సర్సిల్క్ మిల్లు స్థలాలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కొందరు యథేచ్ఛగా కబ్జాచేసి పంటలు సాగు చేసుకుంటున్నారు. -
చికిత్స పొందుతూ మరో యువతి మృతి
[ 07-07-2024]
కుటుంబ కలహాలతో జిల్లాలోని కాగజ్నగర్ మండలం గజ్జిగూడకు చెందిన ఓ తల్లీ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఈ నెల 1వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన కలకలం సృష్టించిన విషయం విదితమే. -
అడిగినంత ఇచ్చెయ్.. అక్రమంగా కట్టెయ్!
[ 07-07-2024]
మంచిర్యాలలోని గంగారెడ్డి రోడ్డులో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
మీ వెంటే మేమంటూ..
[ 07-07-2024]
విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు తమ సొంత పిల్లల్లా ఆలనా పాలన చూసుకుంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆ ఉపాధ్యాయులపై ఎంతటి అభిమానం ఉంటుందో తెలిపే చిత్రమిది. -
సర్కారు కళాశాలలు వెలవెల
[ 07-07-2024]
నిర్మల్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాలతో జనరల్, ఒకేషనల్ కోర్సులను బోధిస్తున్నారు -
నిధులు కరవు.. నిర్వహణ బరువు
[ 07-07-2024]
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతల సంక్షేమం కోసం నిర్మించిన రైతు వేదికలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. -
దృశ్యబోధన మరింత ప్రభావవంతం
[ 07-07-2024]
ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ టచ్స్క్రీన్ టీవీల ద్వారా దృశ్య బోధనను మరింత ప్రభావవంతం చేసేందుకు విద్యా శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది -
నగదు రహితం.. పారదర్శకతే లక్ష్యం
[ 07-07-2024]
మీసేవ కేంద్రాల్లో పారదర్శకంగా చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్రాల్లో అందించే పౌర సేవలకు నిర్వాహకులు దరఖాస్తుదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. -
మహారాష్ట్ర సరిహద్దులో రహదారి ప్రమాదం
[ 07-07-2024]
మహారాష్ట్ర సరిహద్దులో శనివారం జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, మహారాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాలిలా.. ధర్మాబాద్ తాలూకాలోని రత్నెల్లి గ్రామానికి చెందిన గణేష్ తన స్నేహితులతో కలిసి నిజామాబాద్ జిల్లా నవీపేట మేకల సంతకు వెళ్లారు -
అటవీఅనుమతి లేక.. ఆగిన వంతెన
[ 07-07-2024]
మూడు మండలాలు, వందకుపైగా గ్రామాలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రహదారి. ఆ దారిలో ఉన్న వాగుపై నిర్మించిన వంతెన అప్రోచ్ దారులు ఏటా కొట్టుకుపోతుండటంతో ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు -
జంతు వధశాల తరలింపునకు నిర్ణయం
[ 07-07-2024]
జిల్లా కేంద్రం శివారులో ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఉన్న జంతు వధశాల(స్లాటర్హౌజ్)ను ఎట్టకేలకు అక్కడి నుంచి తరలించాలని బల్దియా యంత్రాంగం నిర్ణయించింది
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?
-
ప్రభాస్ పెళ్లిపై స్పందించిన శ్యామలా దేవి.. సక్సెస్ రాదన్నారు వచ్చింది
-
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
-
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
-
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?