మట్టి పరీక్షకు మరో విధానం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నేల ఆరోగ్య కార్డు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఈ సీజన్లో జిల్లాకు ఒక మండలాన్ని ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా మట్టి నమూనాలను సేకరించడంతోపాటు వాటి ఫలితాలను రైతులకు అందించాలని ఆదేశాలు జారీ చేశాయి.
నమూనాల సేకరణకు జియో ట్యాగింగ్
ప్రయోగాత్మకంగా జిల్లాకో మండలం ఎంపిక
న్యూస్టుడే, ఆదిలాబాద్ వ్యవసాయం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నేల ఆరోగ్య కార్డు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఈ సీజన్లో జిల్లాకు ఒక మండలాన్ని ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా మట్టి నమూనాలను సేకరించడంతోపాటు వాటి ఫలితాలను రైతులకు అందించాలని ఆదేశాలు జారీ చేశాయి. మట్టి నమూనాల సేకరణ నుంచి మొదలు, రైతులకు ఫలితాలు అందించే వరకు పూర్తి సాంకేతికతను ఉపయోగించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలోని భూసార ప్రయోగశాల
ఉమ్మడి జిల్లా సాధారణ సాగు 5.70 లక్షల హెక్టార్లు కాగా, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏటా 6 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తారు. పశు సంపద తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు రసాయన ఎరువులపైనే ఆధారపడుతున్నారు. జిల్లాలో ఏటా 3.60 లక్షల లక్షల మెట్రిక్ టన్నులకు పైగా రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు. ఏటా నిర్వహించే మట్టి నమూనా పరీక్షల్లో భూసారం గణనీయంగా తగ్గుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ముందుగా నాలుగు మండలాల్లో
భూసార పరీక్షల ప్రాధాన్యం గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రైతుకు తమ భూమికి సంబంధించిన భూసార పరీక్ష ఫలితాల సమాచారం అందించాలని భావిస్తున్నాయి. సాధారణంగా మట్టి నమూనాలను మే నెలలో సేకరించి జూన్లో పంట సాగు చేసే సమయానికి ఫలితాలు రైతులకు అందిస్తే దాన్ని అనుసరించే అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో ఆలస్యం కావడంతో జిల్లాకు ఒక మండలాన్ని ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా భూసార పరీక్ష ఫలితాలను అందించేలా కార్యాచరణను రూపొందించారు. హెక్టార్లకు ఒక నమూనా చొప్పున ఉమ్మడి జిల్లా మొత్తంలో 18,482 మట్టి నమూనాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సాంకేతికత వినియోగించి..
ఎంపిక చేసిన సాగు భూమిలో మట్టి నమూనాలు సేకరించిన తర్వాత వ్యవసాయ విస్తరణ అధికారి సంబంధిత నమూనాల వివరాలను సాయిల్ హెల్త్ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. పంట పొలానికి వెళ్లి మట్టి సేకరణ ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. జియోట్యాగింగ్ విధానం అమలు చేస్తుండటంతో మట్టి నమూనా ఎక్కడిది అనేది తెలిసిపోతుంది. జులై పదో తేదీ లోగా మట్టి నమూనాల సేకరణ పూర్తి చేసి, 31లోగా విశ్లేషించి, ఆగస్టు రెండో వారంలో నేల ఆరోగ్య కార్డులు రైతులకు అందించాలని ఆదేశాలు ఉన్నాయి. ప్రతి క్లస్టర్లో ఒక అభ్యుదయ రైతును ఎంపికచేసి హెక్టారులో సాగు చేసిన పంటలో భూసార ఫలితాల ఆధారంగా ఎరువులు వేయడం వల్ల కలిగిన ప్రయోజనాలను రైతులకు తెలియచేసేందుకు వీలుగా ప్రదర్శన క్షేత్రాన్ని నిర్వహించాల్సి ఉంటుంది.
ప్రతి రైతుకు భూసార పరీక్ష కార్డు
జిల్లాలో ఎంపిక చేసిన మండలాల్లో ప్రతి రైతుకు నేల ఆరోగ్య కార్డులు అందించాలనేది లక్ష్యం. మట్టినమూనా సేకరణ సమయంలోనే జియోట్యాగింగ్ చేస్తారు. సేకరించిన మట్టినమూనాకు సంబంధించిన వివరాలు యాప్లో నమోదు చేస్తారు. ఆన్లైన్లో రైతు పేరున నెంబర్ వస్తుంది. ఆ నెంబరు వేసి, మట్టి నమూనాను జిల్లా కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. మట్టిని పరీక్షించి వాటి ఫలితాలను అంతర్జాలంలో నమోదు చేయడంతో పాటు, రైతుకు నేరుగా కార్డు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం.
ప్రసాద్, సహాయ సంచాలకులు, భూసార పరీక్ష కేంద్రం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సహకారం అందిస్తేనే అన్నదాతకు ప్రయోజనం
[ 07-07-2024]
విత్తనం తయారీకి గత యాసంగిలో దండేపల్లి మండలంలో సాగు చేసిన పొలం ఇది. ఒక ప్రైవేటు కంపెనీ ఆడ, మగ మూల విత్తనాలను పొలానికి చెందిన రైతుకు అందజేసి... పంట చేతికొచ్చే వరకు సలహాలు, సూచనలు అందజేశారు. -
సర్సిల్క్భూములు.. అన్యాక్రాంతం
[ 07-07-2024]
కాగజ్నగర్ మండలంలోని చింతగూడ, బల్గల శివారులో మూతబడిన సర్సిల్క్ మిల్లు స్థలాలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కొందరు యథేచ్ఛగా కబ్జాచేసి పంటలు సాగు చేసుకుంటున్నారు. -
చికిత్స పొందుతూ మరో యువతి మృతి
[ 07-07-2024]
కుటుంబ కలహాలతో జిల్లాలోని కాగజ్నగర్ మండలం గజ్జిగూడకు చెందిన ఓ తల్లీ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఈ నెల 1వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన కలకలం సృష్టించిన విషయం విదితమే. -
అడిగినంత ఇచ్చెయ్.. అక్రమంగా కట్టెయ్!
[ 07-07-2024]
మంచిర్యాలలోని గంగారెడ్డి రోడ్డులో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
మీ వెంటే మేమంటూ..
[ 07-07-2024]
విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు తమ సొంత పిల్లల్లా ఆలనా పాలన చూసుకుంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆ ఉపాధ్యాయులపై ఎంతటి అభిమానం ఉంటుందో తెలిపే చిత్రమిది. -
సర్కారు కళాశాలలు వెలవెల
[ 07-07-2024]
నిర్మల్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాలతో జనరల్, ఒకేషనల్ కోర్సులను బోధిస్తున్నారు -
నిధులు కరవు.. నిర్వహణ బరువు
[ 07-07-2024]
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతల సంక్షేమం కోసం నిర్మించిన రైతు వేదికలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. -
దృశ్యబోధన మరింత ప్రభావవంతం
[ 07-07-2024]
ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ టచ్స్క్రీన్ టీవీల ద్వారా దృశ్య బోధనను మరింత ప్రభావవంతం చేసేందుకు విద్యా శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది -
నగదు రహితం.. పారదర్శకతే లక్ష్యం
[ 07-07-2024]
మీసేవ కేంద్రాల్లో పారదర్శకంగా చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్రాల్లో అందించే పౌర సేవలకు నిర్వాహకులు దరఖాస్తుదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. -
మహారాష్ట్ర సరిహద్దులో రహదారి ప్రమాదం
[ 07-07-2024]
మహారాష్ట్ర సరిహద్దులో శనివారం జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, మహారాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాలిలా.. ధర్మాబాద్ తాలూకాలోని రత్నెల్లి గ్రామానికి చెందిన గణేష్ తన స్నేహితులతో కలిసి నిజామాబాద్ జిల్లా నవీపేట మేకల సంతకు వెళ్లారు -
అటవీఅనుమతి లేక.. ఆగిన వంతెన
[ 07-07-2024]
మూడు మండలాలు, వందకుపైగా గ్రామాలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రహదారి. ఆ దారిలో ఉన్న వాగుపై నిర్మించిన వంతెన అప్రోచ్ దారులు ఏటా కొట్టుకుపోతుండటంతో ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు -
జంతు వధశాల తరలింపునకు నిర్ణయం
[ 07-07-2024]
జిల్లా కేంద్రం శివారులో ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఉన్న జంతు వధశాల(స్లాటర్హౌజ్)ను ఎట్టకేలకు అక్కడి నుంచి తరలించాలని బల్దియా యంత్రాంగం నిర్ణయించింది
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ
-
సినీ ప్రొడక్షన్ విభాగ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఆత్మహత్య
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
నెల్లూరు మేయర్ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి
-
కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసు దోషులను నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు
-
మణికొండలో కేవ్ పబ్పై టీజీ న్యాబ్ అధికారుల దాడులు