అరకొర హాజరుతో ముగించారు
జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశాలంటే మినీ అసెంబ్లీతో సమానంగా భావిస్తారు. జిల్లా వ్యాప్తంగా సమస్యలపై చర్చించే వీలున్న ఈ సమావేశాలకు కలెక్టర్, అన్నిశాఖల జిల్లా అధికారులు హాజరవుతారు.
అయిదేళ్ల జడ్పీ సమావేశాల్లో ప్రజాప్రతినిధుల తీరిది..
న్యూస్టుడే, ఆదిలాబాద్ పట్టణం
జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశాలంటే మినీ అసెంబ్లీతో సమానంగా భావిస్తారు. జిల్లా వ్యాప్తంగా సమస్యలపై చర్చించే వీలున్న ఈ సమావేశాలకు కలెక్టర్, అన్నిశాఖల జిల్లా అధికారులు హాజరవుతారు. జిల్లాస్థాయిలో పరిష్కారంకాని అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఇక్కడ తీర్మానం చేస్తే నివేదిక ప్రభుత్వానికి వెళుతుంది. అందుకే జడ్పీ తీర్మానాలకూ అధిక ప్రాధాన్యం ఉంటుందనే భావన ఉంది. జడ్పీటీసీలు సభ్యులుగా, ఎంపీపీలు ఆహ్వానితులుకాగా, ఈ సమావేశాలకు జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యుల హోదాలో హాజరవుతారు. అపరిష్కృతంగా ఉండే సమస్యలను ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించేలా రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లే సత్తా ఉన్న వీరు జడ్పీ సమావేశాలకు ముఖం చాటేయడం విమర్శలకు తావిస్తోంది. అయిదేళ్ల జడ్పీ పాలకవర్గం జులై 4తో ముగియనుంది. ఇప్పటికే జడ్పీ చివరి సమావేశం అయిపోయింది. ప్రజాప్రతినిధులు హాజరు పరిస్థితిపై కథనం.
జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిగా విస్తరించి ఉండగా రెండు మండలాల పరిధి ఉన్న ఖానాపూర్, రెండు మండలాలు విస్తరించి ఉన్న ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్లో సభ్యులు. మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఆహ్వానితులు. స్థానిక ఎంపీ, స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జడ్పీకి శాశ్వత ఆహ్వానితులుగా హాజరుకావాల్సి ఉంటుంది. వీరంతా సభలో ఉంటే అధికారుల్లోనూ జవాబుదారీతనం పెరిగి సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభించే అవకాశం లభిస్తుందనేది ప్రజల నమ్మకం. వీరిలో కొందరు మాత్రమే సక్రమంగా హాజరయ్యారు. మిగతా వారు మొక్కుబడిగా రాగా కొందరైతే మొత్తానికే రాలేదు. రైతుల విత్తనాల సరఫరాలో జాప్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పనుల్లో జాప్యం వంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు, రహదారులు లేక ప్రజలు పడుతున్న నరకయాతన, నిధులు మంజూరైనా అధికారుల నిర్లక్ష్యంతో పూర్తికాని రోడ్లు, భవనాలు ఇలా ఎన్నో ఇక్కట్లతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఎక్కువ శాతం ప్రజాప్రతినిధులు గైర్హాజరు కావడం ప్రజలకు ఎక్కువ నష్టాన్ని చేకూర్చిందని చెప్పవచ్చు.
19 సమావేశాలు
అయిదేళ్లలో 19 జడ్పీ సమావేశాలు జరిగాయి. అందులో మూడు సమావేశాలను కోరం లేక వాయిదా వేయగా 16 సమావేశాలు నిర్వహించారు. అయిదేళ్ల కాలంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పురాణం సతీష్ పదవీ కాలం పూర్తవడంతో ఆ కోటాలో దండె విఠల్ ఎంపికయ్యారు. ఎంపీ సోయం పదవీ కాలం పూర్తయి కొత్త ఎంపీగా గోడం నగేష్ అడుగుపెట్టారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న స్థానంలో పాయల్శంకర్ ఇటీవలే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బోథ్లో రాఠోడ్ బాపురావు స్థానంలో అనిల్ జాదవ్, ఖానాపూర్లో రేఖానాయక్ స్థానంలో వెడ్మ బొజ్జు, ఆసిఫాబాద్లో ఆత్రం సక్కు స్థానంలో కోవ లక్ష్మి ఎమ్మెల్యేగా ఎన్నికై ఇక్కడ సభ్యులుగా కొనసాగుతున్నారు.
పదవీ కాలంలో జరిగిన సమావేశాలు - హాజరైనవి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోసిలో ఉచిత వైద్య శిబిరం
[ 07-07-2024]
బైంసాలోని ఆరుష్ చిన్నపిల్లల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం బోసిలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. -
ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం
[ 07-07-2024]
ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని తానూరు మండలంలోని హిప్నెల్లిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
రెండు మద్యం దుకాణాల్లో చోరీ
[ 07-07-2024]
పట్టణంలోని రెండు మద్యం దుకాణాల్లో చోరీ ఘటనలు ఆదివారం వెలుగు చూశాయి. -
సహకారం అందిస్తేనే అన్నదాతకు ప్రయోజనం
[ 07-07-2024]
విత్తనం తయారీకి గత యాసంగిలో దండేపల్లి మండలంలో సాగు చేసిన పొలం ఇది. ఒక ప్రైవేటు కంపెనీ ఆడ, మగ మూల విత్తనాలను పొలానికి చెందిన రైతుకు అందజేసి... పంట చేతికొచ్చే వరకు సలహాలు, సూచనలు అందజేశారు. -
సర్సిల్క్భూములు.. అన్యాక్రాంతం
[ 07-07-2024]
కాగజ్నగర్ మండలంలోని చింతగూడ, బల్గల శివారులో మూతబడిన సర్సిల్క్ మిల్లు స్థలాలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కొందరు యథేచ్ఛగా కబ్జాచేసి పంటలు సాగు చేసుకుంటున్నారు. -
చికిత్స పొందుతూ మరో యువతి మృతి
[ 07-07-2024]
కుటుంబ కలహాలతో జిల్లాలోని కాగజ్నగర్ మండలం గజ్జిగూడకు చెందిన ఓ తల్లీ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఈ నెల 1వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన కలకలం సృష్టించిన విషయం విదితమే. -
అడిగినంత ఇచ్చెయ్.. అక్రమంగా కట్టెయ్!
[ 07-07-2024]
మంచిర్యాలలోని గంగారెడ్డి రోడ్డులో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
మీ వెంటే మేమంటూ..
[ 07-07-2024]
విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు తమ సొంత పిల్లల్లా ఆలనా పాలన చూసుకుంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆ ఉపాధ్యాయులపై ఎంతటి అభిమానం ఉంటుందో తెలిపే చిత్రమిది. -
సర్కారు కళాశాలలు వెలవెల
[ 07-07-2024]
నిర్మల్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాలతో జనరల్, ఒకేషనల్ కోర్సులను బోధిస్తున్నారు -
నిధులు కరవు.. నిర్వహణ బరువు
[ 07-07-2024]
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతల సంక్షేమం కోసం నిర్మించిన రైతు వేదికలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. -
దృశ్యబోధన మరింత ప్రభావవంతం
[ 07-07-2024]
ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ టచ్స్క్రీన్ టీవీల ద్వారా దృశ్య బోధనను మరింత ప్రభావవంతం చేసేందుకు విద్యా శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది -
నగదు రహితం.. పారదర్శకతే లక్ష్యం
[ 07-07-2024]
మీసేవ కేంద్రాల్లో పారదర్శకంగా చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్రాల్లో అందించే పౌర సేవలకు నిర్వాహకులు దరఖాస్తుదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. -
మహారాష్ట్ర సరిహద్దులో రహదారి ప్రమాదం
[ 07-07-2024]
మహారాష్ట్ర సరిహద్దులో శనివారం జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, మహారాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాలిలా.. ధర్మాబాద్ తాలూకాలోని రత్నెల్లి గ్రామానికి చెందిన గణేష్ తన స్నేహితులతో కలిసి నిజామాబాద్ జిల్లా నవీపేట మేకల సంతకు వెళ్లారు -
అటవీఅనుమతి లేక.. ఆగిన వంతెన
[ 07-07-2024]
మూడు మండలాలు, వందకుపైగా గ్రామాలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రహదారి. ఆ దారిలో ఉన్న వాగుపై నిర్మించిన వంతెన అప్రోచ్ దారులు ఏటా కొట్టుకుపోతుండటంతో ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు -
జంతు వధశాల తరలింపునకు నిర్ణయం
[ 07-07-2024]
జిల్లా కేంద్రం శివారులో ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఉన్న జంతు వధశాల(స్లాటర్హౌజ్)ను ఎట్టకేలకు అక్కడి నుంచి తరలించాలని బల్దియా యంత్రాంగం నిర్ణయించింది
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
-
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
-
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?
-
అమ్మానాన్న మనసు వెన్న.. మమత మిన్న.. ఆలోచన రేకెత్తించిన విద్యార్థుల ప్రాజెక్టు
-
సూరత్లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు