ఖాళీ చేయరు.. కూలగొట్టరు!
‘వర్షాలకు నాగర్కర్నూర్ జిల్లా వనపట్లలోని ఓ పురాతన మట్టిమిద్దె అర్ధరాత్రి వేళ కూలింది.
శిథిల భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు!
జిల్లా కేంద్రంలోని గ్రామీణ నీటి సరఫరా సబ్ డివిజన్ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. గోడలు పగుళ్లు తేలి ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. వర్షం పడితో నీరు దిగి తడిగా మారుతోంది. కొత్త భవనం లేక ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు.
‘వర్షాలకు నాగర్కర్నూర్ జిల్లా వనపట్లలోని ఓ పురాతన మట్టిమిద్దె అర్ధరాత్రి వేళ కూలింది. ఈ ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందగా, ఒకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది.’.. ఇటువంటి భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు జిల్లాలోనూ కనిపిస్తున్నాయి. పురాతన భవనాలను ఖాళీ చేసి కూలగొట్టాల్సి ఉండగా.. అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ఆసిఫాబాద్, న్యూస్టుడే వర్షాకాలం నేపథ్యంలో పాత భవనాలు, శిథిలావస్థలో చేరిన వాటిలో ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. గోడలపై ప్లాస్టరింగ్ ఊడిపోవడం, స్లాబులకు లీకేజీలు ఏర్పడితే వాన నీరు వాటిలోకి దిగి గదుల్లో చేరుతుంది. గోడల్లోకి దిగి పదనెక్కి కూలిపోయే ప్రమాదం ఉంటుంది. గతేడాది జులై, ఆగస్టు నెలల్లో కురిసిన వానలతో 28 ఇళ్లు పూర్తిగా కూలిపోగా, 54 పాక్షికంగా దెబ్బతిన్నాయి. శిథిలావస్థకు చేరిన భవనాల మన్నికను తెలుసుకునేందుకు ఆర్అండ్బీ శాఖకు దరఖాస్తు చేస్తే.. వారు పరిశీలించి, వినియోగానికి అనుకూలంగా లేకపోతే నోటీసు జారీ చేసి కూల్చివేయాలని సూచిస్తారు. కానీ జిల్లాలో ఇలాంటి పరిస్థితులు కనిపించడంలేదు.
జిల్లాలోని చాలా ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. కొత్త వాటి నిర్మాణం లేక పాత వాటిలోనే భయం భయంగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్లో జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో కార్యదర్శులు శిథిలావస్థ భవనాలు, ఇళ్లను గుర్తించారు. మొత్తం 87లలో.. 62 వాటిని కూలగొట్టినట్లు లెక్కల్లో చూపారు. కానీ ఆయా మండలాల్లో తహసీల్దార్, ఎంపీడీవో, ఎమ్మార్సీ, నీటిపారుదల శాఖ, నీటి సరఫరా శాఖల భవనాలు శిథిలావస్థలో చేరినా.. ఖాళీ చేయకుండా, కొత్తవి నిర్మించకుండా వాటిలోనే విధులు నిర్వహిస్తున్నారు. వానకాలంలో స్లాబులు, గోడల నుంచి నీరు దిగి పెచ్చులూడి కిందపడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పలువురు గాయాలపాలయ్యారు.
జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కార్యాలయం భవనం నిర్మించి 40ఏళ్లు దాటింది. గోడలు పెచ్చులూడి శిథిలావస్థకు చేరింది. వాన పడితే నీరంతా లోపలికి చేరుతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.
జిల్లా కేంద్రంలోని నీటి పారుదలశాఖ డివిజన్ కార్యాలయం-4 భవనం లోపల గోడలు నెర్రలతో పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. ఫ్లోరింగ్ పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాస్థాయి అధికారి చాంబర్, ఇతర ఉద్యోగుల గదుల గోడలు పెచ్చులూడి శిథిలావస్థకు చేరాయి.
రెబ్బెన మండలం పైకాజీగూడలోని ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా దెబ్బతింది. ఇక్కడ 1-5వ తరగతి విద్యార్థులు చదువుతున్నారు. కొత్త భవనం నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. వానాకాలం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
దహెగాంలోని మండల విద్యా వనరుల కేంద్ర భవనంలో.. వర్షం పడితే ఉరుస్తూ ఇబ్బంది కలిగిస్తోంది. గోడల నుంచి వర్షం నీరు దిగి తడిగా మారుతున్నాయి.
సిర్పూర్(టి)లో తహసీల్దార్ కార్యాలయ దస్త్రాలను ఓ శిథిలావస్థ భవనంలో ఉంచారు. వర్షానికి భవనం కూలితే దస్త్రాలు పాడైపోయే ప్రమాదం ఉంది.
వాంకిడి తహసీల్దార్ కార్యాలయం
వాంకిడి తహసీల్దార్ కార్యాలయం 40ఏళ్ల కిందట నిర్మించారు. భవనం శిథిలావస్థకు చేరినా.. కొత్త భవనం లేక భయం భయంగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. లోపలి గోడలు పెచ్చులూడాయి. నిత్యం వివిధ పనులపై ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని జంకుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంబులెన్స్ సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే
[ 06-07-2024]
జిల్లా కేంద్రంలో శనివారం ఆదిత్య ఖండేష్కర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. -
కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన జస్టిస్ శరత్
[ 06-07-2024]
హైకోర్టు జడ్జి, జిల్లా కోర్టుల పరిపాలనాధికారి జస్టిస్ శరత్.. కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. -
ఎస్బీఐ ఏటీఎంలో మంటలు
[ 06-07-2024]
పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. -
ముందు మెరుపులు.. వెనుక మరకలు
[ 06-07-2024]
ముందు నుంచి చూసి భవన సముదాయం పూర్తయిందని సంతోషపడి లోనికి వెళ్తే ఇంకా పనులు పూర్తికాని విషయం తెలుస్తుంది. భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ పరిస్థితి ఇది. -
ఆంగ్ల మాధ్యమానికి అవాంతరాలు
[ 06-07-2024]
భుక్తాపూర్లోని అంగన్వాడీలో ఇరుకైన ఈ గదిలోనే విద్యాబోధన చేస్తున్నారు. ఈ కేంద్రానికి ఆయా లేకపోవటంతో టీచరే పిల్లలను కేంద్రానికి తీసుకురావటం, వారికి మధ్యాహ్న భోజనంచేసి పెట్టడం, సమావేశాలకు వెళ్లటం, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సర్వేలు చేయాల్సి వస్తోంది. -
గుంపులుగా కోతులు.. ప్రజలకు వెతలు
[ 06-07-2024]
జిల్లాలో కోతుల బెడదకు ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లోకి చొరబడి దాడులకు పాల్పడుతున్నాయి. -
పుర క్యాంపు రాజకీయాలు షురూ
[ 06-07-2024]
ఆదిలాబాద్లో క్యాంపు రాజకీయాలు ఆరంభమయ్యాయి. ఓ పక్క కాంగ్రెస్ పార్టీ భారాస కౌన్సిలర్లకు గాలం వేస్తూ తమ పార్టీలో చేర్చుకుంటుండగా మరోపక్క ఎదుటి పక్షం సైతం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
అమ్మకు ఆపద.. ఎన్నేళ్లయినా తీరదా..?
[ 06-07-2024]
‘ఓ వైపు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది. మరోవైపు పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణి పడవలో ప్రయాణం.. కింద సుడులు తిరుగుతున్న నీళ్లు. -
శిరస్త్రాణంపై నిర్లక్ష్యం.. మూల్యం ప్రాణం
[ 06-07-2024]
ద్విచక్ర వాహనం నడిపే ప్రతి చోదకుడు ఇంటి నుంచి బయటకి వెళ్లే క్రమంలోనే విధిగా శిరస్త్రాణం ధరించి ప్రయాణించాలి. -
రెండు రోజులకో ఆత్మహత్య
[ 06-07-2024]
భర్త ఇంటికి తాగొచ్చి గొడవ పడుతున్నాడనే కారణంతో.. కాగజ్నగర్ మండలం గజ్జిగూడ గ్రామానికి చెందిన ముగ్గురు కూతుళ్లతో కలిసి భార్య ఒకేసారి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. -
నీరున్నా ఎత్తిపోయవు!
[ 06-07-2024]
జిల్లాలో నీటి వనరులకు కొదువలేదు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తారు. వీటితోపాటు ఎత్తిపోతల పథకాల కింద వేలాది ఎకరాలకు సాగు నీరు అందించాలని నిర్ణయించి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 40 నిర్మించారు. -
ఆరోగ్య మహిళ.. కావాలి మరింత శ్రద్ధ
[ 06-07-2024]
ప్రత్యేక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి మంగళవారం మహిళా వైద్యులు, సిబ్బందితో ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. -
బది‘లీలలు’ఇన్నిన్ని కాదయా..!
[ 06-07-2024]
ఉపాధ్యాయ బదిలీలు.. సుదీర్ఘకాలంగా ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సందర్భమిది. ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉండాలని, అందరికీ న్యాయం జరగాలని పదేపదే అభ్యర్థించారు. -
మైనర్ డ్రైవింగ్.. యజమానిపై కేసు
[ 06-07-2024]
నిబంధనలకు విరుద్ధంగా మైనర్కు వాహనం ఇచ్చిన యజమానిపై పట్టణ పోలీసులు కేసు నమోదుచేశారు. సీఐ ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘ఎట్టకేలకు 400 సీట్లు.. కానీ’: భాజపాపై థరూర్ సెటైర్
-
సంస్కరణవాదికే పట్టం.. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్..!
-
కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు
-
రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
-
ఓపెనర్గా రావాలనుకుంటున్నా.. రోహిత్, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్మన్ గిల్
-
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్