బస్సు ప్రయాణం.. ప్రయాసల మయం
ఓవైపు అడుగుతీసి వేయనంతగా రద్దీ మరోవైపు బస్సులకోసం గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితిని నిత్యం జిల్లావాసులు ఎదుర్కొంటున్నారు.
రద్దీ.. అసౌకర్యాలతో హడలిపోతున్న జనం
ఈనాడు, ఆసిఫాబాద్
సాయంత్రం 4గంటల సమయంలో మంచిర్యాలలో ఆసిఫాబాద్ వైపు వెళ్లే ప్లాట్ఫాం వద్ద ప్రయాణికుల నిరీక్షణ
ఓవైపు అడుగుతీసి వేయనంతగా రద్దీ మరోవైపు బస్సులకోసం గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితిని నిత్యం జిల్లావాసులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో బస్టాండ్లు రణరంగంగా మారుతున్నాయి. ఇతరప్రాంతాలనుంచి వచ్చే బస్సులు పక్కకు నిలిపి ఉంచిన సమయంలోనే ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ఇక ప్లాట్ఫామ్ వద్దకు వచ్చాక అంతే సంగతులు. పది, ఇరవై కిలోమీటర్ల మేర వెళ్లాల్సిన దూరానికి సైతం గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి. ఆసిఫాబాద్ నుంచి ప్రయాణమంటేనే వామ్మో అని అనాల్సి వస్తోంది.
నిజాం కాలంలో 1932లో ఇక్కడ బస్సు డిపోను ఏర్పాటు చేశారు. ఇంగ్లాండ్ నుంచి తెప్పించిన మూడు బస్సులు ఇక్కడి నుంచి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్కు రాకపోకలు సాగించేవి. ఘన చరిత్ర కలిగిన ఆసిఫాబాద్ డిపో నుంచి బయలుదేరే బస్సులతో నేడు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం డిపోలో 83 బస్సులు ఉండగా.. నెలకు దాదాపు 25 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. దాదాపు రూ.18.65 లక్షల ఆదాయం సమకూరుతోంది. 14 సూపర్ లగ్జరీ బస్సులు ఉండగా, 6 మాత్రమే ఎక్స్ప్రెస్లు.
ఉదయం, సాయంత్రం వేళల్లో చుక్కలే..
మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగింది. అయితే పరిమితికి మించి ఎక్కడంతో కొన్ని స్టేజీల్లో ఇవి నిలపకుండా వెళ్లే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ విపరీతం. చంటి పిల్లలతో తల్లులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులు, ఉద్యోగులు ఒకేసారి రావడంతో.. ఈ సమయాల్లో బస్సు ఎక్కాలంటేనే సాధారణ ప్రజలు హడలిపోతున్నారు. రద్దీకి అనుగుణంగా సర్వీసుల సంఖ్య పెంచాలని జిల్లావాసులు కోరుతున్నారు.
చుట్టూ తిరగాల్సిందే..
ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాల (65 కి.మీ.) ప్రయాణం సైతం చమటలు పట్టిస్తోంది. రెండు గంటలకు పైగానే ప్రయాణం సాగుతోంది. ఇందులో బెల్లంపల్లి బైపాస్ మీదుగా వెళితే అరగంట సమయం మిగులుతోంది. కానీ పట్టణం లోపలికి, బస్టాండ్ నుంచి వెళ్తుండటంతో సమయం పెరుగుతోంది. ముఖ్యంగా ఉద్యోగులు, కళాశాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం మంచిర్యాల-ఆసిఫాబాద్ రెండు, మూడు స్టాప్లతో, బెల్లంపల్లికి వెళ్లకుండా నేరుగా వెళ్లేలా సర్వీసులు నడపాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉగ్గబట్టుకోవాల్సిందే..
ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ 140 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆసిఫాబాద్ నుంచి ఉట్నూరుకు 70 కి.మీ. బస్సు ప్రయాణానికి దాదాపు రెండు, రెండున్నర గంటల సమయం పడుతోంది. మార్గమధ్యలో కెరమెరి, జైనూర్ మండల కేంద్రాలు ఉన్నా.. ఎక్కడా ప్రజా శౌచాలయాలు, మరుగుదొడ్లు లేవు. కొన్ని సర్వీసులు ఉట్నూరు బస్టాండ్కు వెళ్లకుండా నేరుగా ఆదిలాబాద్కు వెళ్తుంటాయి. ఈక్రమంలో సుమారుగా నాలుగు లేదా అయిదు గంటలు ఒంటికి, రెంటికి ఉగ్గబట్టుకోవాల్సిన పరిస్థితి ప్రయాణికులది. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం 1500-2000 మంది ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రజా ప్రతినిధులు స్పందించి ఉట్నూర్ కూడలి వద్ద లేదా, జైనూర్, కెరమెరి మండలాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
విద్యార్థుల కోసం కొన్ని సర్వీసులు కేటాయించాం
పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల కోసం కొన్ని సర్వీసులను నడుపుతున్నాం. రద్దీ మార్గాల్లో సర్వీసులను పెంచేలా చూస్తాం. ఆసిఫాబాద్-మంచిర్యాల నేరుగా వెళ్లే బస్సులను సైతం రద్దీకి అనుగుణంగా ప్రవేశపెడతాం.
విశ్వనాథ్, డిపో మేనేజర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంబులెన్స్ సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే
[ 06-07-2024]
జిల్లా కేంద్రంలో శనివారం ఆదిత్య ఖండేష్కర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. -
కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన జస్టిస్ శరత్
[ 06-07-2024]
హైకోర్టు జడ్జి, జిల్లా కోర్టుల పరిపాలనాధికారి జస్టిస్ శరత్.. కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. -
ఎస్బీఐ ఏటీఎంలో మంటలు
[ 06-07-2024]
పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. -
ముందు మెరుపులు.. వెనుక మరకలు
[ 06-07-2024]
ముందు నుంచి చూసి భవన సముదాయం పూర్తయిందని సంతోషపడి లోనికి వెళ్తే ఇంకా పనులు పూర్తికాని విషయం తెలుస్తుంది. భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ పరిస్థితి ఇది. -
ఆంగ్ల మాధ్యమానికి అవాంతరాలు
[ 06-07-2024]
భుక్తాపూర్లోని అంగన్వాడీలో ఇరుకైన ఈ గదిలోనే విద్యాబోధన చేస్తున్నారు. ఈ కేంద్రానికి ఆయా లేకపోవటంతో టీచరే పిల్లలను కేంద్రానికి తీసుకురావటం, వారికి మధ్యాహ్న భోజనంచేసి పెట్టడం, సమావేశాలకు వెళ్లటం, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సర్వేలు చేయాల్సి వస్తోంది. -
గుంపులుగా కోతులు.. ప్రజలకు వెతలు
[ 06-07-2024]
జిల్లాలో కోతుల బెడదకు ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లోకి చొరబడి దాడులకు పాల్పడుతున్నాయి. -
పుర క్యాంపు రాజకీయాలు షురూ
[ 06-07-2024]
ఆదిలాబాద్లో క్యాంపు రాజకీయాలు ఆరంభమయ్యాయి. ఓ పక్క కాంగ్రెస్ పార్టీ భారాస కౌన్సిలర్లకు గాలం వేస్తూ తమ పార్టీలో చేర్చుకుంటుండగా మరోపక్క ఎదుటి పక్షం సైతం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
అమ్మకు ఆపద.. ఎన్నేళ్లయినా తీరదా..?
[ 06-07-2024]
‘ఓ వైపు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది. మరోవైపు పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణి పడవలో ప్రయాణం.. కింద సుడులు తిరుగుతున్న నీళ్లు. -
శిరస్త్రాణంపై నిర్లక్ష్యం.. మూల్యం ప్రాణం
[ 06-07-2024]
ద్విచక్ర వాహనం నడిపే ప్రతి చోదకుడు ఇంటి నుంచి బయటకి వెళ్లే క్రమంలోనే విధిగా శిరస్త్రాణం ధరించి ప్రయాణించాలి. -
రెండు రోజులకో ఆత్మహత్య
[ 06-07-2024]
భర్త ఇంటికి తాగొచ్చి గొడవ పడుతున్నాడనే కారణంతో.. కాగజ్నగర్ మండలం గజ్జిగూడ గ్రామానికి చెందిన ముగ్గురు కూతుళ్లతో కలిసి భార్య ఒకేసారి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. -
నీరున్నా ఎత్తిపోయవు!
[ 06-07-2024]
జిల్లాలో నీటి వనరులకు కొదువలేదు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తారు. వీటితోపాటు ఎత్తిపోతల పథకాల కింద వేలాది ఎకరాలకు సాగు నీరు అందించాలని నిర్ణయించి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 40 నిర్మించారు. -
ఆరోగ్య మహిళ.. కావాలి మరింత శ్రద్ధ
[ 06-07-2024]
ప్రత్యేక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి మంగళవారం మహిళా వైద్యులు, సిబ్బందితో ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. -
బది‘లీలలు’ఇన్నిన్ని కాదయా..!
[ 06-07-2024]
ఉపాధ్యాయ బదిలీలు.. సుదీర్ఘకాలంగా ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సందర్భమిది. ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉండాలని, అందరికీ న్యాయం జరగాలని పదేపదే అభ్యర్థించారు. -
మైనర్ డ్రైవింగ్.. యజమానిపై కేసు
[ 06-07-2024]
నిబంధనలకు విరుద్ధంగా మైనర్కు వాహనం ఇచ్చిన యజమానిపై పట్టణ పోలీసులు కేసు నమోదుచేశారు. సీఐ ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం.