నిరంతరాయం.. ఆరోగ్య సాయం
సర్కారు ఆసుపత్రికి వచ్చే గర్భిణులు, వీరికి సేవలు అందించే సిబ్బందికి మధ్య వారధిగా ఉండేందుకు జిల్లా తొలి పాలనాధికారిగా పనిచేసిన ఆర్వీ కర్ణన్ హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశారు.
‘సర్కారు’లో ప్రసవాలు పెంచేందుకు కృషి
గర్భిణి వివరాలు సేకరిస్తున్న హెల్ప్ డెస్క్ సిబ్బంది
మంచిర్యాల వైద్యవిభాగం, న్యూస్టుడే సర్కారు ఆసుపత్రికి వచ్చే గర్భిణులు, వీరికి సేవలు అందించే సిబ్బందికి మధ్య వారధిగా ఉండేందుకు జిల్లా తొలి పాలనాధికారిగా పనిచేసిన ఆర్వీ కర్ణన్ హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశారు. ఆయన బదిలీ అయినా ఆరేళ్లుగా ఇది నిర్విరామంగా కొనసాగుతోంది. మధ్యలో ఒక వైద్యాధికారి దీన్ని నిర్లక్ష్యం చేసినా.. ఇటీవల తిరిగి పుంజుకుంది. మాతాశిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్) లోపలికి రాగానే ఎదురుగా కనిపిస్తూ బాధితులకు అవసరమైన సేవలు అందిస్తున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన గర్భిణులకు దీనిద్వారా ఎంతో మేలు కలుగుతోంది.
మంచిర్యాలలోని ఎంసీహెచ్లో 24 గంటలపాటు మూడు షిఫ్టుల్లో ముగ్గురు వైద్యశాఖకు సంబంధించిన ఆరోగ్య సహాయకులు(ఎంపీహెచ్ఏ) అందుబాటులో ఉంటారు. జిల్లాలోని గర్భిణుల వివరాలు సేకరించి.. ఏ నెలలో.. ఏ రోజు ఎవరి ప్రసవం ఉందో తెలుసుకుని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటారు. బాధిత వ్యక్తి ప్రైవేటుకు వెళ్లాలని ఆసక్తి చూపించినా ఆమెతోపాటు కుటుంబసభ్యులను సంప్రదించి సర్ది చెబుతారు. సర్కారు సేవలపై నమ్మకం కలిగించేలా భరోసా ఇస్తారు. బాధితులకు చికిత్స పరంగా అసౌకర్యం కలుగుతుందని సమాచారం అందిస్తే వెంటనే వీరికి, సిబ్బందికి మధ్య వారధిగా మారి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు.
గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
రెండు జిల్లాల్లోని పీహెచ్సీల పరిధిలోని గర్భిణులు మూడు, నాలుగు నెలల్లో తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. ఆ సమయంలో వారు పలు రకాల రక్త పరీక్షలు చేసుకోవాలి. బాధితుల పరీక్ష ఫలితాలను సేకరిస్తారు. హెచ్బీ(హిమోగ్లోబిన్) శాతాన్ని గుర్తించి తక్కువగా ఉంటే అందుకు తగ్గట్లుగా చర్యలు చేపడతారు. రక్తం తక్కువగా ఉన్నవారి వివరాలు తీసుకుని బాధితురాలి పరిధి ఆశా కార్యకర్తలకు సమాచారం ఇస్తారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందులు అందించేందుకు కృషి చేస్తారు. తీవ్రత ఎక్కువగా ఉంటే ఆసుపత్రిలోనే చేర్పిస్తారు. ప్రసవ సమయంలోనూ రక్తహీనత ఉంటే అప్రమత్తమై కుటుంబసభ్యులకు, రక్తనిధి కేంద్రాలకు సమాచారం అందిస్తారు. ఆసుపత్రిలో హెల్ప్ డెస్క్కు ప్రత్యేక క్యాబిన్తో పాటు మరొకరి నియామకం చేపడితే సేవలు మరింత మెరుగుపడతాయి.
నెన్నెలకు చెందిన ఓ గర్భిణి ప్రసవానికి ఎంసీహెచ్కు వచ్చారు. చేరి అయిదు రోజులు అవుతున్నా వైద్యులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో ప్రైవేటుకు వెళ్లిపోతామంటూ ఆశా కార్యకర్త, ఏఎన్ఎంకు సమాచారం అందించారు. ఆ సిబ్బంది ఇక్కడి హెల్ప్ డెస్క్ సహాయకులకు తెలుపగా వెంటనే స్పందించి వైద్యురాలు, సిబ్బందితో మాట్లాడించారు. ప్రసవం పరిస్థితిని వివరించి సర్దిచెప్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన జస్టిస్ శరత్
[ 06-07-2024]
హైకోర్టు జడ్జి, జిల్లా కోర్టుల పరిపాలనాధికారి జస్టిస్ శరత్.. కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. -
ఎస్బీఐ ఏటీఎంలో మంటలు
[ 06-07-2024]
పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. -
ముందు మెరుపులు.. వెనుక మరకలు
[ 06-07-2024]
ముందు నుంచి చూసి భవన సముదాయం పూర్తయిందని సంతోషపడి లోనికి వెళ్తే ఇంకా పనులు పూర్తికాని విషయం తెలుస్తుంది. భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ పరిస్థితి ఇది. -
ఆంగ్ల మాధ్యమానికి అవాంతరాలు
[ 06-07-2024]
భుక్తాపూర్లోని అంగన్వాడీలో ఇరుకైన ఈ గదిలోనే విద్యాబోధన చేస్తున్నారు. ఈ కేంద్రానికి ఆయా లేకపోవటంతో టీచరే పిల్లలను కేంద్రానికి తీసుకురావటం, వారికి మధ్యాహ్న భోజనంచేసి పెట్టడం, సమావేశాలకు వెళ్లటం, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సర్వేలు చేయాల్సి వస్తోంది. -
గుంపులుగా కోతులు.. ప్రజలకు వెతలు
[ 06-07-2024]
జిల్లాలో కోతుల బెడదకు ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లోకి చొరబడి దాడులకు పాల్పడుతున్నాయి. -
పుర క్యాంపు రాజకీయాలు షురూ
[ 06-07-2024]
ఆదిలాబాద్లో క్యాంపు రాజకీయాలు ఆరంభమయ్యాయి. ఓ పక్క కాంగ్రెస్ పార్టీ భారాస కౌన్సిలర్లకు గాలం వేస్తూ తమ పార్టీలో చేర్చుకుంటుండగా మరోపక్క ఎదుటి పక్షం సైతం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
అమ్మకు ఆపద.. ఎన్నేళ్లయినా తీరదా..?
[ 06-07-2024]
‘ఓ వైపు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది. మరోవైపు పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణి పడవలో ప్రయాణం.. కింద సుడులు తిరుగుతున్న నీళ్లు. -
శిరస్త్రాణంపై నిర్లక్ష్యం.. మూల్యం ప్రాణం
[ 06-07-2024]
ద్విచక్ర వాహనం నడిపే ప్రతి చోదకుడు ఇంటి నుంచి బయటకి వెళ్లే క్రమంలోనే విధిగా శిరస్త్రాణం ధరించి ప్రయాణించాలి. -
రెండు రోజులకో ఆత్మహత్య
[ 06-07-2024]
భర్త ఇంటికి తాగొచ్చి గొడవ పడుతున్నాడనే కారణంతో.. కాగజ్నగర్ మండలం గజ్జిగూడ గ్రామానికి చెందిన ముగ్గురు కూతుళ్లతో కలిసి భార్య ఒకేసారి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. -
నీరున్నా ఎత్తిపోయవు!
[ 06-07-2024]
జిల్లాలో నీటి వనరులకు కొదువలేదు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తారు. వీటితోపాటు ఎత్తిపోతల పథకాల కింద వేలాది ఎకరాలకు సాగు నీరు అందించాలని నిర్ణయించి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 40 నిర్మించారు. -
ఆరోగ్య మహిళ.. కావాలి మరింత శ్రద్ధ
[ 06-07-2024]
ప్రత్యేక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి మంగళవారం మహిళా వైద్యులు, సిబ్బందితో ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. -
బది‘లీలలు’ఇన్నిన్ని కాదయా..!
[ 06-07-2024]
ఉపాధ్యాయ బదిలీలు.. సుదీర్ఘకాలంగా ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సందర్భమిది. ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉండాలని, అందరికీ న్యాయం జరగాలని పదేపదే అభ్యర్థించారు. -
మైనర్ డ్రైవింగ్.. యజమానిపై కేసు
[ 06-07-2024]
నిబంధనలకు విరుద్ధంగా మైనర్కు వాహనం ఇచ్చిన యజమానిపై పట్టణ పోలీసులు కేసు నమోదుచేశారు. సీఐ ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం.
తాజా వార్తలు (Latest News)
-
ఓపెనర్గా రావాలనుకుంటున్నా.. రోహిత్, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్మన్ గిల్
-
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్
-
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు
-
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
-
నిఖత్కు సాటిలేరు.. ఒలింపిక్స్ బరిలో ఇందూరు బాక్సర్
-
గుంతకల్లు రైల్వే DRM ఆఫీస్లో ముగిసిన సోదాలు.. సీబీఐ అదుపులో 8 మంది