చైతన్యంతోనే సర్కారు బడి సాకారం
సర్కారు బడుల బలోపేతం కోసం ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకత కనబరుస్తోంది. అమ్మ ఆదర్శ కమిటీల నేతృత్వంలో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
ముగిసిన పదోన్నతులు, బదిలీలు.. ప్రవేశాలపై ప్రత్యేకత చూపితే సత్ఫలితాలు
నిర్మల్ అర్బన్, న్యూస్టుడే
ప్రతిజ్ఞ చేస్తున్న ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు, తదితరులు (పాతచిత్రం)
సర్కారు బడుల బలోపేతం కోసం ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకత కనబరుస్తోంది. అమ్మ ఆదర్శ కమిటీల నేతృత్వంలో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. పలు చోట్ల పనులు పూర్తవ్వగా, కొన్ని చివరి దశలో ఉన్నాయి. ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని సర్కారు ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గత నెల 6-19 తేదీల్లో చేపట్టారు. అదే దశలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు ఉండడంతో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. పూర్తి స్థాయిలో నిమగ్నం చేయలేకపోయారు. గత ఏడాదితో పోల్చితే ప్రవేశాల సంఖ్య కొంత మెరుగైనా.. మరింత ప్రత్యేకతతో అవగాహన, చైతన్యం తీసుకొస్తే పిల్లల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి.
ఓ వైపు బడిబాట.. మరోవైపు పదోన్నతులు, బదిలీలు
ఎస్జీటీ తత్సమాన అర్హత కలిగిన వారికి పీఎస్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్, పీడీలుగా పదోన్నతులు, బదిలీలను గత నెల 20 తేదీ వరకు పూర్తి చేశారు. తాజాగా ఎస్జీటీ, భాషాపండితులు, పీఈటీల బదిలీలు ముగిశాయి. బడిబాట కార్యక్రమం సమయంలోనే ఈ ప్రక్రియ చేపట్టడంతో కొంత అంతరాయం నెలకొంది. కార్యక్రమంపై పూర్తి స్థాయి దృష్టి పెట్టలేకపోయారు. బదిలీలు, పదోన్నతులు ముగియడంతో సంబంధిత ఉపాధ్యాయులు ప్రత్యేకత కనబరిస్తే మరింత మంది పిల్లలు సర్కారు బడి వైపు అడుగులు వేసే అవకాశం ఉంది.
కొంత మెరుగు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 2,847 ఉన్నాయి. గత విద్యాసంవత్సరం జూన్ 3 నుంచి జులై 6 వరకు నమోదు, రోజువారీ కార్యక్రమాలు, కొనసాగింపు, రెండో విడత బడిబాట చేపట్టారు. 2023-24 సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది ప్రవేశాలు కొంత మెరుగయ్యాయి. నిర్మల్ జిల్లాలో గత ఏడాది 4,756 మంది పిల్లలు ప్రవేశం పొందారు. ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు 5,321 మంది చేరారు. మిగతా జిల్లాల్లోనూ ప్రవేశాలు ఆశించిన స్థాయిలో వచ్చాయి. ఇదే స్ఫూర్తితో ఉపాధ్యాయులు సంబంధిత పాఠశాలల్లో కొత్తగా చేరిన సందర్భంలో మరింత దృష్టి సారిస్తే బడులు బలోపేతం కావడంతోపాటు, పిల్లలందరికీ సర్కారు విద్య అందే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగితే సత్ఫలితాలు సాధించవచ్చని పలువురు పేర్కొంటున్నారు.
ప్రవేశాల సంఖ్య పెంచేలా ప్రత్యేక శ్రద్ధ
ఎంఈవోలు, కాంప్లెక్స్, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్థానికుల సహకారంతోపాటు స్వయం సహాయక సంఘ సభ్యులు ఇలా అందరి సమన్వయంతో పిల్లలందరికీ సర్కారు విద్య అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాం. గత ఏడాదితో పోల్చితే కొంత మెరుగయ్యాయి. మరింత పెంచేలా ప్రత్యేకత చూపేలా ఇప్పటికే సూచనలు ఇచ్చాం.
ఎ.రవీందర్రెడ్డి, జిల్లా విద్యాధికారి, నిర్మల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంబులెన్స్ సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే
[ 06-07-2024]
జిల్లా కేంద్రంలో శనివారం ఆదిత్య ఖండేష్కర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. -
కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన జస్టిస్ శరత్
[ 06-07-2024]
హైకోర్టు జడ్జి, జిల్లా కోర్టుల పరిపాలనాధికారి జస్టిస్ శరత్.. కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. -
ఎస్బీఐ ఏటీఎంలో మంటలు
[ 06-07-2024]
పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. -
ముందు మెరుపులు.. వెనుక మరకలు
[ 06-07-2024]
ముందు నుంచి చూసి భవన సముదాయం పూర్తయిందని సంతోషపడి లోనికి వెళ్తే ఇంకా పనులు పూర్తికాని విషయం తెలుస్తుంది. భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ పరిస్థితి ఇది. -
ఆంగ్ల మాధ్యమానికి అవాంతరాలు
[ 06-07-2024]
భుక్తాపూర్లోని అంగన్వాడీలో ఇరుకైన ఈ గదిలోనే విద్యాబోధన చేస్తున్నారు. ఈ కేంద్రానికి ఆయా లేకపోవటంతో టీచరే పిల్లలను కేంద్రానికి తీసుకురావటం, వారికి మధ్యాహ్న భోజనంచేసి పెట్టడం, సమావేశాలకు వెళ్లటం, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సర్వేలు చేయాల్సి వస్తోంది. -
గుంపులుగా కోతులు.. ప్రజలకు వెతలు
[ 06-07-2024]
జిల్లాలో కోతుల బెడదకు ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లోకి చొరబడి దాడులకు పాల్పడుతున్నాయి. -
పుర క్యాంపు రాజకీయాలు షురూ
[ 06-07-2024]
ఆదిలాబాద్లో క్యాంపు రాజకీయాలు ఆరంభమయ్యాయి. ఓ పక్క కాంగ్రెస్ పార్టీ భారాస కౌన్సిలర్లకు గాలం వేస్తూ తమ పార్టీలో చేర్చుకుంటుండగా మరోపక్క ఎదుటి పక్షం సైతం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
అమ్మకు ఆపద.. ఎన్నేళ్లయినా తీరదా..?
[ 06-07-2024]
‘ఓ వైపు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది. మరోవైపు పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణి పడవలో ప్రయాణం.. కింద సుడులు తిరుగుతున్న నీళ్లు. -
శిరస్త్రాణంపై నిర్లక్ష్యం.. మూల్యం ప్రాణం
[ 06-07-2024]
ద్విచక్ర వాహనం నడిపే ప్రతి చోదకుడు ఇంటి నుంచి బయటకి వెళ్లే క్రమంలోనే విధిగా శిరస్త్రాణం ధరించి ప్రయాణించాలి. -
రెండు రోజులకో ఆత్మహత్య
[ 06-07-2024]
భర్త ఇంటికి తాగొచ్చి గొడవ పడుతున్నాడనే కారణంతో.. కాగజ్నగర్ మండలం గజ్జిగూడ గ్రామానికి చెందిన ముగ్గురు కూతుళ్లతో కలిసి భార్య ఒకేసారి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. -
నీరున్నా ఎత్తిపోయవు!
[ 06-07-2024]
జిల్లాలో నీటి వనరులకు కొదువలేదు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తారు. వీటితోపాటు ఎత్తిపోతల పథకాల కింద వేలాది ఎకరాలకు సాగు నీరు అందించాలని నిర్ణయించి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 40 నిర్మించారు. -
ఆరోగ్య మహిళ.. కావాలి మరింత శ్రద్ధ
[ 06-07-2024]
ప్రత్యేక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి మంగళవారం మహిళా వైద్యులు, సిబ్బందితో ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. -
బది‘లీలలు’ఇన్నిన్ని కాదయా..!
[ 06-07-2024]
ఉపాధ్యాయ బదిలీలు.. సుదీర్ఘకాలంగా ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సందర్భమిది. ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉండాలని, అందరికీ న్యాయం జరగాలని పదేపదే అభ్యర్థించారు. -
మైనర్ డ్రైవింగ్.. యజమానిపై కేసు
[ 06-07-2024]
నిబంధనలకు విరుద్ధంగా మైనర్కు వాహనం ఇచ్చిన యజమానిపై పట్టణ పోలీసులు కేసు నమోదుచేశారు. సీఐ ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సంస్కరణవాదికే పట్టం.. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్..!
-
కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు
-
రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
-
ఓపెనర్గా రావాలనుకుంటున్నా.. రోహిత్, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్మన్ గిల్
-
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్
-
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు