పరిశోధనలకు వారధి.. విజ్ఞాన్ మంథన్
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్సీఈఆర్టీ, డీఎస్టీ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్లో విద్యార్థి విజ్ఞాన్ మంథన్బ్వీవీఎం్శ విజ్ఞాన శాస్త్రం ప్రతిభాన్వేషణ పరీక్ష ఏటా నిర్వహిస్తోంది.
ఆరు నుంచి ఇంటర్ విద్యార్థులకు అవకాశం
మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్టుడే: కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్సీఈఆర్టీ, డీఎస్టీ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్లో విద్యార్థి విజ్ఞాన్ మంథన్బ్వీవీఎం్శ విజ్ఞాన శాస్త్రం ప్రతిభాన్వేషణ పరీక్ష ఏటా నిర్వహిస్తోంది. తరగతి గదిలో నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థుల దృష్టిని పరిశోధన, ప్రయోగాల రంగాల వైపు మళ్లించే లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. వీవీఎం పరీక్షకు ప్రస్తుతం 202425 విద్యాసంవత్సరానికి గానూ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా సెప్టెంబరు 15 వరకు అవకాశముంది.
పాఠశాల నుంచి జాతీయ స్థాయిలో
వీవీఎంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు రూ. 200 చెల్లించి సంబంధిత వెబ్సైట్లో సెప్టెంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవాలి. సీనియర్, జూనియర్ విభాగాల్లో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరీక్షలు ఉంటాయి. సెప్టెంబరు 1న నమూనా పరీక్ష నిర్వహిస్తారు. అక్టోబరు 23, 27 తేదీల్లో జిల్లా స్థాయి పరీక్షలు నిర్వహించి నవంబరు 15న ఫలితాల ప్రకటిస్తారు. డిసెంబరు 8, 15, 22 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు, 2025 మే 17 లేదా 18 తేదీన జాతీయ స్థాయిలో పరీక్ష ఉంటుంది.
ప్రతిభావంతులకు ఉపకారం
పాఠశాల స్థాయి పోటీల్లో ప్రతి తరగతి నుంచి ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు చొప్పున 18 మందిని ఒక్కో పాఠశాల నుంచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ప్రతి తరగతి నుంచి 20 మందికి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఇందులో ప్రతి తరగతి నుంచి ముగ్గురు చొప్పున 18 మంది రాష్ట్ర స్థాయిలో విజేతలుగా ఎంపిక చేస్తారు. వీరికి ధ్రువపత్రంతో పాటు జ్ఞాపిక రూ. 5 వేలు, రూ. 3 వేలు, రూ. 2 వేల చొప్పున ప్రోత్సాహకం అందిస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులు జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశముంటుంది. మొదటి మూడు స్థానాల్లో విజేతలుగా నిలిచిన వారికి రూ. 25వేలు, రూ. 15వేలు, రూ.10వేల చొప్పున అందుతాయి. దీంతో పాటు భాస్కర స్కాలర్షిప్ పేరిట ఏడాది పాటు నెలకు రూ. 2వేల చొప్పున ఉపకార వేతనం ఇస్తారు. జాతీయ ప్రఖ్యాత పరిశోధన సంస్థలను సందర్శించే అవకాశం కల్పిస్తారు. దీనిపై అవగాహన లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడం లేదు. ఈ విద్యాసంవత్సరమైనా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుంటే విద్యార్థులకు మేలు కలగనుంది.
పరీక్ష ఇలా..
విద్యార్థులకు వంద బహుళైచ్చిక ప్రశ్నలతో ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. సామాన్య, గణితం, పుస్తకాల్లోని అంశాలు 50శాతం, విజ్ఞానశాస్త్రం రంగంలో భారతదేశ కృషిపై 20 శాతం, శాస్త్రవేత్తల జీవిత చరిత్రపై 20 శాతం మార్కులు ఉంటాయి. ఇక లాజిక్, రీజనింగ్లో 10 శాతం ప్రశ్నలపై పరీక్ష ఉంటుంది. పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు వెబ్సైట్లో పుస్తకాలు అందుబాటులో ఉంచారు.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలు: 4773
జూనియర్ కళాశాలలు: 235
6 నుంచి ఇంటర్ విద్యార్థులు: 2.35లక్షలు
సద్వినియోగం చేసుకోవాలి
వీవీఎం పోటీల్లో ప్రతిభ చాటిన వారికి ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనేలా చొరవ చూపాలి. విద్యార్థులు ఈ ప్రతిభాన్వేషణ పరీక్షను సద్వినియోగం చేసుకోవాలి. సందేహాలకు 9849550200ను సంప్రదించవచ్చు.
ఎస్.మధుబాబు, జిల్లా సైన్స్ అధికారి మంచిర్యాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోసిలో ఉచిత వైద్య శిబిరం
[ 07-07-2024]
బైంసాలోని ఆరుష్ చిన్నపిల్లల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం బోసిలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. -
ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం
[ 07-07-2024]
ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని తానూరు మండలంలోని హిప్నెల్లిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
రెండు మద్యం దుకాణాల్లో చోరీ
[ 07-07-2024]
పట్టణంలోని రెండు మద్యం దుకాణాల్లో చోరీ ఘటనలు ఆదివారం వెలుగు చూశాయి. -
సహకారం అందిస్తేనే అన్నదాతకు ప్రయోజనం
[ 07-07-2024]
విత్తనం తయారీకి గత యాసంగిలో దండేపల్లి మండలంలో సాగు చేసిన పొలం ఇది. ఒక ప్రైవేటు కంపెనీ ఆడ, మగ మూల విత్తనాలను పొలానికి చెందిన రైతుకు అందజేసి... పంట చేతికొచ్చే వరకు సలహాలు, సూచనలు అందజేశారు. -
సర్సిల్క్భూములు.. అన్యాక్రాంతం
[ 07-07-2024]
కాగజ్నగర్ మండలంలోని చింతగూడ, బల్గల శివారులో మూతబడిన సర్సిల్క్ మిల్లు స్థలాలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కొందరు యథేచ్ఛగా కబ్జాచేసి పంటలు సాగు చేసుకుంటున్నారు. -
చికిత్స పొందుతూ మరో యువతి మృతి
[ 07-07-2024]
కుటుంబ కలహాలతో జిల్లాలోని కాగజ్నగర్ మండలం గజ్జిగూడకు చెందిన ఓ తల్లీ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఈ నెల 1వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన కలకలం సృష్టించిన విషయం విదితమే. -
అడిగినంత ఇచ్చెయ్.. అక్రమంగా కట్టెయ్!
[ 07-07-2024]
మంచిర్యాలలోని గంగారెడ్డి రోడ్డులో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
మీ వెంటే మేమంటూ..
[ 07-07-2024]
విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు తమ సొంత పిల్లల్లా ఆలనా పాలన చూసుకుంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆ ఉపాధ్యాయులపై ఎంతటి అభిమానం ఉంటుందో తెలిపే చిత్రమిది. -
సర్కారు కళాశాలలు వెలవెల
[ 07-07-2024]
నిర్మల్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాలతో జనరల్, ఒకేషనల్ కోర్సులను బోధిస్తున్నారు -
నిధులు కరవు.. నిర్వహణ బరువు
[ 07-07-2024]
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతల సంక్షేమం కోసం నిర్మించిన రైతు వేదికలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. -
దృశ్యబోధన మరింత ప్రభావవంతం
[ 07-07-2024]
ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ టచ్స్క్రీన్ టీవీల ద్వారా దృశ్య బోధనను మరింత ప్రభావవంతం చేసేందుకు విద్యా శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది -
నగదు రహితం.. పారదర్శకతే లక్ష్యం
[ 07-07-2024]
మీసేవ కేంద్రాల్లో పారదర్శకంగా చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్రాల్లో అందించే పౌర సేవలకు నిర్వాహకులు దరఖాస్తుదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. -
మహారాష్ట్ర సరిహద్దులో రహదారి ప్రమాదం
[ 07-07-2024]
మహారాష్ట్ర సరిహద్దులో శనివారం జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, మహారాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాలిలా.. ధర్మాబాద్ తాలూకాలోని రత్నెల్లి గ్రామానికి చెందిన గణేష్ తన స్నేహితులతో కలిసి నిజామాబాద్ జిల్లా నవీపేట మేకల సంతకు వెళ్లారు -
అటవీఅనుమతి లేక.. ఆగిన వంతెన
[ 07-07-2024]
మూడు మండలాలు, వందకుపైగా గ్రామాలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రహదారి. ఆ దారిలో ఉన్న వాగుపై నిర్మించిన వంతెన అప్రోచ్ దారులు ఏటా కొట్టుకుపోతుండటంతో ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు -
జంతు వధశాల తరలింపునకు నిర్ణయం
[ 07-07-2024]
జిల్లా కేంద్రం శివారులో ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఉన్న జంతు వధశాల(స్లాటర్హౌజ్)ను ఎట్టకేలకు అక్కడి నుంచి తరలించాలని బల్దియా యంత్రాంగం నిర్ణయించింది
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
-
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
-
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?
-
అమ్మానాన్న మనసు వెన్న.. మమత మిన్న.. ఆలోచన రేకెత్తించిన విద్యార్థుల ప్రాజెక్టు
-
సూరత్లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు