కళాశాల అభివృద్ధికి గ్రామస్థుల చేయూత
కుంటాలకు ప్రభుత్వం గతేడాది నూతన జూనియర్ కళాశాలను మంజూరు చేసింది. కాస్త ఆలస్యంగా ఉత్తర్వులు రావడంతో కళాశాలను తాత్కాలిక సిబ్బందితో నెట్టుకొచ్చారు.
విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు అందజేస్తున్న డీఐఈఓ పరశురాం
కుంటాల, న్యూస్టుడే: కుంటాలకు ప్రభుత్వం గతేడాది నూతన జూనియర్ కళాశాలను మంజూరు చేసింది. కాస్త ఆలస్యంగా ఉత్తర్వులు రావడంతో కళాశాలను తాత్కాలిక సిబ్బందితో నెట్టుకొచ్చారు. కళాశాల అభివృద్ధికి గ్రామస్థులు, విద్యావంతులు ప్రైవేటుకు దీటుగా తమవంతు కృషి చేస్తున్నారు. పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు వెలువడినప్పటి నుంచి ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ ఆశయం మేరకు విద్యార్థుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ఈ ఏడాది గ్రామస్థులందరూ సమన్వయంతో కృషి చేశారు. ఉద్యోగులు, విద్యావంతులు, గ్రామస్థులను భాగస్వాములను చేస్తూ కళాశాల అభివృద్ధి సమితిని ఏర్పాటు చేశారు.
ఉచిత బోధన .. ఇప్పటి వరకు ప్రభుత్వం అధ్యాపకులను నియమించ లేదు. వివిధ గ్రామాలకు చెందిన అనుభవజ్ఞులైన విద్యావంతులు ఉచితంగా బోధించేందుకు ముందుకొచ్చారు. ఆయా అంశాలపై బోధన చేసేందుకు 10 మంది సిద్ధమయ్యారు. ఎలాంటి వేతనం లేకుండా ప్రభుత్వం అధ్యాపకులను నియమించే వరకు తాము బోధన చేస్తామని భరోసా కల్పించారు. బైపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ విభాగాల్లో తరగతులు కొనసాగుతున్నాయి. అధ్యాపకుల నియామకం విషయంలో ఇప్పటికే ఎమ్మెల్యే రామారావుపటేల్, జిల్లా పాలనాధికారికి విన్నవించగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
దాతల చేయూత
ఉన్నత పాఠశాలలో అదనంగా ఉన్న తరగతి గదుల్లో తాత్కాలికంగా తరగతులను కొనసాగిస్తున్నారు. దాతలు కార్యాలయ సామగ్రి, పాఠ్య, రాత పుస్తకాలు, ఫ్యాన్లు, కంప్యూటర్, ఫర్నిచర్, బీరువా, ఇతరత్రా సామగ్రి అందజేశారు. ఇతర అవసరాల కోసం విరాళాలు సైతం సమకూరాయి. సైన్స్ విద్యార్థులకు అవసరమయ్యే ప్రయోగ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఆదర్శ పాఠశాలకు భూమి కొనుగోలు చేసినట్లే కళాశాలకు కూడా శాశ్వత భవన నిర్మాణానికి స్థల పరిశీలన జరిపి అవసరమైతే కొనుగోలు చేస్తామన్నారు. బస్సు సౌకర్యం లేని గ్రామాల విద్యార్థులకు బీసీ వసతి గృహంలో బాలురకు, ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహంలో బాలికలకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే, పాలనాధికారులకు విజ్ఞప్తి చేశారు.
నర్సాపూర్(జి), కుంటాల, భైంసా మండలాల్లోని ఉన్నత పాఠశాలల పరిధిలో గల గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. విద్యార్థుల సంఖ్యను పెంచుతూ సత్ఫలితాలు సాధించేందుకు బాధ్యతగా శ్రమించారు. ఇప్పటి వరకు సుమారుగా 50 మందికి 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించారు. ప్రభుత్వం ప్రవేశాలకు జులై 31 వరకు గడువు పొడిగించడంతో మరింత మంది చేరే అవకాశముంది. గతంలో కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను యువకులు, గ్రామస్థులు అప్పటి ఎమ్మెల్యే, పాలనాధికారికి సైతం విన్నవించి పలు సందర్భాల్లో దీక్షలు చేపట్టారు.
ఉన్నతంగా తీర్చిదిద్దుతాం
గతంలో భైంసా పట్టణంలోని ఓ కళాశాలలో బోధించా. స్వగ్రామంలో కళాశాల ఏర్పాటు చేశారని తెలిసింది. విద్యావంతులు ఉచితంగా బోధించేందుకు ముందుకొచ్చారనే విషయం తెలియగానే నేను సైతం అంగీకరించా. పేద విద్యార్థులకు ఉన్నతంగా తీర్చిదిద్దే అవకాశం లభించడంతో సంతోషించా.
గాజుల గోదావరి, ఎంఏ, బీఎడ్
చక్కటి అవకాశం
కల్లూరు కస్తూర్బా పాఠశాల వసతి గృహంలో ఉండి పదోతరగతి వరకు చదువుకున్నా. మాధ్యమిక విద్య చదవలేని పరిస్థితులు నెలకొన్నాయి. కళాశాల అభివృద్ధి సమితి సభ్యులు వచ్చి కుంటాల కళాశాలలో తక్షణ ప్రవేశం కల్పించారు. మా గ్రామం నుంచి 4 కి.మీ. దూరంలోనే ఉండటంతో అదృష్టంగా భావించా. చదువు ముందుకు సాగుతుందనే భరోసా కలిగింది.
జయశ్రీ, విద్యార్థిని, రాయ్పాడ్ తండా
గ్రామస్థుల సహకారం బాగుంది
కళాశాల మంజూరు మొదలు ఇప్పటి వరకు గ్రామస్థుల సహకారం బాగుంది. అందరూ ముందుకు రావడం అభినందనీయం. ఇక్కడి పరిస్థితులను ఉన్నతాధికారులకు వివరిస్తా. రాబోయే రోజుల్లో కళాశాలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. కళాశాల నిర్వహణకు సమకూర్చి సామగ్రి, బోధకులు, విద్యార్థుల విషయంలో విద్యావంతుల ప్రోత్సాహమే సత్ఫలితాలు సాధించేలా చేసింది.
తుకారాం, ప్రిన్సిపల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంబులెన్స్ సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే
[ 06-07-2024]
జిల్లా కేంద్రంలో శనివారం ఆదిత్య ఖండేష్కర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. -
కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన జస్టిస్ శరత్
[ 06-07-2024]
హైకోర్టు జడ్జి, జిల్లా కోర్టుల పరిపాలనాధికారి జస్టిస్ శరత్.. కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. -
ఎస్బీఐ ఏటీఎంలో మంటలు
[ 06-07-2024]
పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. -
ముందు మెరుపులు.. వెనుక మరకలు
[ 06-07-2024]
ముందు నుంచి చూసి భవన సముదాయం పూర్తయిందని సంతోషపడి లోనికి వెళ్తే ఇంకా పనులు పూర్తికాని విషయం తెలుస్తుంది. భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ పరిస్థితి ఇది. -
ఆంగ్ల మాధ్యమానికి అవాంతరాలు
[ 06-07-2024]
భుక్తాపూర్లోని అంగన్వాడీలో ఇరుకైన ఈ గదిలోనే విద్యాబోధన చేస్తున్నారు. ఈ కేంద్రానికి ఆయా లేకపోవటంతో టీచరే పిల్లలను కేంద్రానికి తీసుకురావటం, వారికి మధ్యాహ్న భోజనంచేసి పెట్టడం, సమావేశాలకు వెళ్లటం, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సర్వేలు చేయాల్సి వస్తోంది. -
గుంపులుగా కోతులు.. ప్రజలకు వెతలు
[ 06-07-2024]
జిల్లాలో కోతుల బెడదకు ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లోకి చొరబడి దాడులకు పాల్పడుతున్నాయి. -
పుర క్యాంపు రాజకీయాలు షురూ
[ 06-07-2024]
ఆదిలాబాద్లో క్యాంపు రాజకీయాలు ఆరంభమయ్యాయి. ఓ పక్క కాంగ్రెస్ పార్టీ భారాస కౌన్సిలర్లకు గాలం వేస్తూ తమ పార్టీలో చేర్చుకుంటుండగా మరోపక్క ఎదుటి పక్షం సైతం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
అమ్మకు ఆపద.. ఎన్నేళ్లయినా తీరదా..?
[ 06-07-2024]
‘ఓ వైపు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది. మరోవైపు పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణి పడవలో ప్రయాణం.. కింద సుడులు తిరుగుతున్న నీళ్లు. -
శిరస్త్రాణంపై నిర్లక్ష్యం.. మూల్యం ప్రాణం
[ 06-07-2024]
ద్విచక్ర వాహనం నడిపే ప్రతి చోదకుడు ఇంటి నుంచి బయటకి వెళ్లే క్రమంలోనే విధిగా శిరస్త్రాణం ధరించి ప్రయాణించాలి. -
రెండు రోజులకో ఆత్మహత్య
[ 06-07-2024]
భర్త ఇంటికి తాగొచ్చి గొడవ పడుతున్నాడనే కారణంతో.. కాగజ్నగర్ మండలం గజ్జిగూడ గ్రామానికి చెందిన ముగ్గురు కూతుళ్లతో కలిసి భార్య ఒకేసారి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. -
నీరున్నా ఎత్తిపోయవు!
[ 06-07-2024]
జిల్లాలో నీటి వనరులకు కొదువలేదు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తారు. వీటితోపాటు ఎత్తిపోతల పథకాల కింద వేలాది ఎకరాలకు సాగు నీరు అందించాలని నిర్ణయించి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 40 నిర్మించారు. -
ఆరోగ్య మహిళ.. కావాలి మరింత శ్రద్ధ
[ 06-07-2024]
ప్రత్యేక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి మంగళవారం మహిళా వైద్యులు, సిబ్బందితో ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. -
బది‘లీలలు’ఇన్నిన్ని కాదయా..!
[ 06-07-2024]
ఉపాధ్యాయ బదిలీలు.. సుదీర్ఘకాలంగా ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సందర్భమిది. ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉండాలని, అందరికీ న్యాయం జరగాలని పదేపదే అభ్యర్థించారు. -
మైనర్ డ్రైవింగ్.. యజమానిపై కేసు
[ 06-07-2024]
నిబంధనలకు విరుద్ధంగా మైనర్కు వాహనం ఇచ్చిన యజమానిపై పట్టణ పోలీసులు కేసు నమోదుచేశారు. సీఐ ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘ఎట్టకేలకు 400 సీట్లు.. కానీ’: భాజపాపై థరూర్ సెటైర్
-
సంస్కరణవాదికే పట్టం.. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్..!
-
కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు
-
రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
-
ఓపెనర్గా రావాలనుకుంటున్నా.. రోహిత్, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్మన్ గిల్
-
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్