పర్యావరణ ప్రేమికులు
రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించే దిశగా చర్యలు ప్రారంభించింది. జిల్లా యంత్రాంగం ఇందుకోసం నడుం బిగించింది.
న్యూస్టుడే, ఆదిలాబాద్ పాలనాప్రాంగణం
రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించే దిశగా చర్యలు ప్రారంభించింది. జిల్లా యంత్రాంగం ఇందుకోసం నడుం బిగించింది.ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా కలెక్టరేట్లో జరిగే సమావేశాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు వాడకుండా కట్టడి చేశారు. ఇప్పుడు ఏ సమావేశం జరిగినా అధికారుల ముందు స్టీలు బాటిళ్లు కనిపిస్తున్నాయి. ఇదే స్ఫూర్తితో ఇటీవల జడ్పీ సమావేశంలోనూ గాజుసీసాలు, కాగితపు గ్లాసులను వినియోగించారు. బుధవారం అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవ వేళ పర్యావరణ స్పృహ కలిగి ఏళ్లుగా ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉన్న వారిపై కథనం.
వినియోగిస్తూ.. అవగాహన కల్పిస్తూ..
ద్విచక్ర వాహనంపై బట్ట సంచితో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు కందుల గజేందర్. ఆదిలాబాద్ పట్టణం కుమార్పేట్కాలనీకి చెందిన ఈయన జైనథ్ మండలం గూడ జడ్పీఎస్ఎస్ ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తున్నారు. గతంలో బస్సులో పయనిస్తున్న సమయంలో చెరువంతా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి కనిపించింది. వర్షం పడితే చుక్క నీరు ఇంకలేని పరిస్థితిని గమనించిన తాను ఇక ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. అలా పదిహేనేళ్లుగా ప్లాస్టిక్ వాడటం లేదని చెబుతున్నారు. విధులకు వెళ్లినా.. సరకులకు, కూరగాయలకు వెళ్లినా వెంట సంచిని తీసుకెళ్లడం అలవాటుగా మార్చుకున్నారు. తాను పని చేసినా చోట పిల్లలకు అవగాహన కల్పిస్తూ బట్ట సంచులను పంచిపెడుతున్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు వివరిస్తూ చైతన్యపరుస్తున్నారు. ఈయన మాదిరిగా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వాడకం మానేస్తే పర్యావరణహితులుగా మారచ్చు.
ఆదర్శం.. ఈ చిరువ్యాపారి
ఆదిలాబాద్ పట్టణం పాతబస్టాండ్ సమీపంలో చికెన్ విక్రయ దుకాణాదారు ఈయన. పేరు కిరణ్. అయిదేళ్లుగా తన వద్దకు వచ్చే వినియోగదారులకు ప్లాస్టిక్ కవర్లలో పెట్టి మాంసం విక్రయించడం మానేశారు. ప్లాస్టిక్కు బదులు బట్ట సంచులను వినియోగిస్తూ చిరువ్యాపారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్లాస్టిక్ వాడినపుడు అధికారులు జరిమానా విధిస్తారని క్షణక్షణం భయపడాల్సిన పరిస్థితి ఉండేదని.. ఇప్పుడు దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నట్లు చెబుతున్న కిరణ్.. బ్యాగుల వాడకంతో గిరాకీ పెరిగిందంటున్నారు. మొదట్లో తోటి వ్యాపారులు విచిత్రంగా చూసేవారని, హేళన చేసేవారని, ఇప్పుడు అధికారులు వచ్చి తనను స్ఫూర్తిగా తీసుకోవాలని ఇతర వ్యాపారులకు చెబుతుండటం సంతృప్తినిస్తోందని చెబుతున్నారు. చిరు వ్యాపారులు ప్లాస్టిక్ వాడకం విషయంలో కిరణ్ను ఆదర్శంగా తీసుకుంటే ప్లాస్టిక్ రహిత సంచుల వాడకం పెరగడం ఖాయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు మద్యం దుకాణాల్లో చోరీ
[ 07-07-2024]
పట్టణంలోని రెండు మద్యం దుకాణాల్లో చోరీ ఘటనలు ఆదివారం వెలుగు చూశాయి. -
సహకారం అందిస్తేనే అన్నదాతకు ప్రయోజనం
[ 07-07-2024]
విత్తనం తయారీకి గత యాసంగిలో దండేపల్లి మండలంలో సాగు చేసిన పొలం ఇది. ఒక ప్రైవేటు కంపెనీ ఆడ, మగ మూల విత్తనాలను పొలానికి చెందిన రైతుకు అందజేసి... పంట చేతికొచ్చే వరకు సలహాలు, సూచనలు అందజేశారు. -
సర్సిల్క్భూములు.. అన్యాక్రాంతం
[ 07-07-2024]
కాగజ్నగర్ మండలంలోని చింతగూడ, బల్గల శివారులో మూతబడిన సర్సిల్క్ మిల్లు స్థలాలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కొందరు యథేచ్ఛగా కబ్జాచేసి పంటలు సాగు చేసుకుంటున్నారు. -
చికిత్స పొందుతూ మరో యువతి మృతి
[ 07-07-2024]
కుటుంబ కలహాలతో జిల్లాలోని కాగజ్నగర్ మండలం గజ్జిగూడకు చెందిన ఓ తల్లీ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఈ నెల 1వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన కలకలం సృష్టించిన విషయం విదితమే. -
అడిగినంత ఇచ్చెయ్.. అక్రమంగా కట్టెయ్!
[ 07-07-2024]
మంచిర్యాలలోని గంగారెడ్డి రోడ్డులో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
మీ వెంటే మేమంటూ..
[ 07-07-2024]
విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు తమ సొంత పిల్లల్లా ఆలనా పాలన చూసుకుంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆ ఉపాధ్యాయులపై ఎంతటి అభిమానం ఉంటుందో తెలిపే చిత్రమిది. -
సర్కారు కళాశాలలు వెలవెల
[ 07-07-2024]
నిర్మల్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాలతో జనరల్, ఒకేషనల్ కోర్సులను బోధిస్తున్నారు -
నిధులు కరవు.. నిర్వహణ బరువు
[ 07-07-2024]
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతల సంక్షేమం కోసం నిర్మించిన రైతు వేదికలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. -
దృశ్యబోధన మరింత ప్రభావవంతం
[ 07-07-2024]
ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ టచ్స్క్రీన్ టీవీల ద్వారా దృశ్య బోధనను మరింత ప్రభావవంతం చేసేందుకు విద్యా శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది -
నగదు రహితం.. పారదర్శకతే లక్ష్యం
[ 07-07-2024]
మీసేవ కేంద్రాల్లో పారదర్శకంగా చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్రాల్లో అందించే పౌర సేవలకు నిర్వాహకులు దరఖాస్తుదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. -
మహారాష్ట్ర సరిహద్దులో రహదారి ప్రమాదం
[ 07-07-2024]
మహారాష్ట్ర సరిహద్దులో శనివారం జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, మహారాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాలిలా.. ధర్మాబాద్ తాలూకాలోని రత్నెల్లి గ్రామానికి చెందిన గణేష్ తన స్నేహితులతో కలిసి నిజామాబాద్ జిల్లా నవీపేట మేకల సంతకు వెళ్లారు -
అటవీఅనుమతి లేక.. ఆగిన వంతెన
[ 07-07-2024]
మూడు మండలాలు, వందకుపైగా గ్రామాలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రహదారి. ఆ దారిలో ఉన్న వాగుపై నిర్మించిన వంతెన అప్రోచ్ దారులు ఏటా కొట్టుకుపోతుండటంతో ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు -
జంతు వధశాల తరలింపునకు నిర్ణయం
[ 07-07-2024]
జిల్లా కేంద్రం శివారులో ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఉన్న జంతు వధశాల(స్లాటర్హౌజ్)ను ఎట్టకేలకు అక్కడి నుంచి తరలించాలని బల్దియా యంత్రాంగం నిర్ణయించింది