భారీగా ఎస్జీటీల స్థానచలనం
జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు భారీగా జరిగాయి. సోమవారం మొత్తం 812 మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కల్పిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూస్టుడే, పాలనాప్రాంగణం
జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు భారీగా జరిగాయి. సోమవారం మొత్తం 812 మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కల్పిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) అత్యధికంగా 792 మందికి ఉండగా.. భాషా పండితులు 14 మంది, పీఈటీలు ఆరుగురు ఉన్నారు. ఒకే చోట 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 617 మందిని కదిలించిన విద్యాశాఖ.. సాధారణ బదిలీ కింద 195 మంది ప్రస్తుతం పని చేస్తున్న చోటు నుంచి మరో పాఠశాలకు బదిలీ అయ్యారు. బదిలీ కోసం 998 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా. ఇందులో కోరుకున్న స్థానాలు లభించని 185 మంది యథాస్థానాల్లో ఉండిపోయారు.
జిల్లాలో ఉపాధ్యాయ పదోన్నతుల, బదిలీ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. దాదాపు నెలరోజులుగా సాగిన ఈ క్రతువుతో పాఠశాలల్లో చదువులు అంతంత మాత్రంగానే సాగాయి. మండలానికి అయిదారు పాఠశాలలను ఉపాధ్యాయులు ఎవరూ కోరుకోకపోవడంతో ఆ బడులకు రెగ్యులర్ ఉపాధ్యాయులు రావాలంటే డీఎస్సీ నియామకాలు జరగాల్సిందే. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులతో నెట్టుకొస్తారా? లేదా విద్యా వాలంటీర్లను నియమిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. సోమవారం మధ్యాహ్నం తర్వాత ఎస్జీటీల బదిలీల ఉత్తర్వులు వెలువడటం.. ఆదివారం రిలీవ్ అయినా సోమవారం కొత్త స్థానాల్లో జాయిన్ కావాలని ఆదేశించడంతో ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉన్న పాఠశాలకు, ఆ తర్వాత కేటాయించిన పాఠశాలలో చేరేందుకు ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఎంతమంది విధుల్లో చేరారు. మరెంత మంది రిలీవ్ కాలేదనే సమాచారం డీఈవో కార్యాలయానికి రావాల్సి ఉంది. ఈ విషయంలో మంగళవారం స్పష్టత రావచ్చు.
బడులు మూతపడకుండా చర్యలు
బదిలీల నేపథ్యంలో పాఠశాలలు మూతపడకుండా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఏ పాఠశాల మూతపడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎక్కడైతే ఒక ఉపాధ్యాయుడు ఉండి.. ఆ ఉపాధ్యాయుడు బదిలీ అయితే.. ఆ స్థానం ఖాళీగా ఉంటే అలాంటి వారిని రిలీవ్ చేయొద్దని ఆదేశాలు వచ్చాయని జిల్లా విద్యాశాఖాధికారి టి.ప్రణీత వెల్లడించారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నచోట ఏం చర్యలు తీసుకోవాలనేది ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ ఖాళీలు చూపించారని చెబుతున్నా... క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించలేదని స్పష్టమవుతోంది. భీంపూర్ మండలం గుంజాల ప్రాథమిక పాఠశాలలో 72 మంది విద్యార్థులు ఉండగా.. బదిలీల్లో కొత్తగా ముగ్గురు వస్తుండగా.. ఇప్పటికే పని చేస్తున్న ఒకరితో కలిపి మొత్తం నలుగురు బోధకులు ఉంటారన్నమాట. అదే మండలం అంతర్గాంలో ఉన్న ఒక్క ఉపాధ్యాయుడికి స్థానచలనం కలగగా.. అక్కడ 81 మంది విద్యార్థులు ఉండటం గమనార్హం. ఇదే మండలంలో గుడిబి ప్రాథమికోన్నత పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఆ ఇద్దరికి తాజా బదిలీల్లో స్థానచలనం కలగడం.. అక్కడి ఏ ఒక్కరు రాకపోవడం ఖాళీల గుర్తింపులో విద్యాశాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
పదోన్నతిపై ఒకరు.. బదిలీపై మరొకరు
ఇది భీంపూర్ మండలం అంతర్గాం ప్రాథమిక పాఠశాల. ప్రస్తుతం 81 మంది విద్యార్థులు ఉండగా.. మూడు పోస్టులు ఉన్నాయి. ఏడాది కిందట ఇక్కడి హెచ్ఎం అనారోగ్యంతో చనిపోగా.. ఇటీవల జరిగిన పదోన్నతిపై ఒకరు.. తాజా బదిలీల్లో మరొకరు బదిలీ అయ్యారు. ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధ్యాయుడిని రిలీవ్ చేస్తే పాఠశాలలో విద్యార్థులే తప్ప ఉపాధ్యాయులు ఉండరన్న మాట.
అయిదు పాఠశాలల ఉపాధ్యాయులు ఖాళీ
భీంపూర్ మండలం అంతర్గాంతోపాటు మందపల్లి, భగవాన్పూర్, రాజుల్వాడి, గుబిడి గ్రామాల్లోని పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులంతా బదిలీ అయ్యారు. ఆ స్థానాలను ఏ ఒక్కరూ కోరుకోలేదు. ఫలితంగా ఆ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత తగ్గే ప్రమాదముంది. రోడ్డు మార్గం అధ్వానంగా ఉండటంతోనే చాలామంది ఇతర మండలాల ఖాళీలను ఎంపిక చేసుకున్నారని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జడ్పీలో ఇక ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం గురువారం ముగియనుండటంతో శుక్రవారం ప్రత్యేకాధికారి పాలన మొదలు కానుంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక పాలనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. -
ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురు
[ 04-07-2024]
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపాల్టీ వైస్ ఛైర్మన్పై అవిశ్వాసం నేపథ్యంలో ఆయన బుధవారం ఎక్స్ అఫీషియో సభ్యుడి కింద దరఖాస్తు చేసుకోగా సమయం మించిపోయిందని అధికారులు పేర్కొంటూ అవిశ్వాసానికి ఓటు లేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. -
ఆర్జీయూకేటీలో తగ్గిన ప్రవేశాలు
[ 04-07-2024]
ఆర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల జాబితాను బుధవారం విడుదల చేసింది. -
మృత్యు పాశాలు
[ 04-07-2024]
నిర్మల్ జిల్లా గొల్లపేటకు చెందిన ప్రమోద్ విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆదిలాబాద్ మండలం యాపల్గూడకు చెందిన మోతీరాం విద్యుత్తు స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో మరణించాడు. -
మైనింగ్ మెరికలు
[ 04-07-2024]
పదోతరగతి పూర్తికాగానే పాలిటెక్నిక్ చేసేందుకు విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. కోర్సు పూర్తికాగానే ఏడాదికి రూ.లక్షల్లో ప్యాకేజీ అందుకొంటుండటమే దీనికి కారణం. -
అపురూప చరిత్ర.. చిగురిస్తున్న ఆశ!
[ 04-07-2024]
కుమురంభీం జిల్లా ప్రకృతి సంపద, సహజ వనరులకు ఆలవాలం. అపార ఖనిజాలున్న అడవులతోపాటు, జలపాతాలు, విశాలమైన గోదావరి తీరం ఆకట్టుకుంటాయి. -
పత్తి విత్తనాలు మొలకెత్తలేదని యువ రైతు ఆత్మహత్మ
[ 04-07-2024]
పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదని మనోవేదనకు గురై ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. -
కుటుంబం ఛిన్నాభిన్నం!
[ 04-07-2024]
ఇంటి పెద్ద, కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన వాడే దారితప్పాడు. భార్యను పిల్లలను కంటికిరెప్పలా చూసుకోవాల్సి ఉండగా.. కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిస కావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. -
పదవీకాలం ముగింపు.. మిగిలిన పనుల పలకరింపు
[ 04-07-2024]
తాండూరు మండలంలోని కుర్మవాడలో ముడుగిరి భీమయ్య ఇంటి నుంచి మురికి రాజయ్య ఇంటి వరకు సిమెంట్ రహదారి నిర్మాణం కోసం రూ.3 లక్షల నిధులు కేటాయించారు. ఇప్పటికీ ఆ పనులు మొదలుపెట్టలేదు. -
పలుకు‘బడి’ బదిలీ
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నట్లు ఓ వైపు ప్రచారం చేస్తూనే.. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్నవారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తుండటం ఉపాధ్యాయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. -
కొత్త చట్టంతో సత్వర న్యాయం
[ 04-07-2024]
బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న న్యాయ చట్టాల్లో పలుమార్పులు, చేర్పులు చేసి నూతన విధానాలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. వీటివల్ల బాధితులకు త్వరగా న్యాయం జరిగే వీలుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. -
చెరిపేస్తున్నారు.. చక్కదిద్దేవరు?
[ 04-07-2024]
చెరువు.. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా ఇది ఉండటం ఎంతో ఆవశ్యకం. కేవలం సాగునీటి కోసమే కాదు.. అక్కడి ప్రజలు, జీవరాశుల ఇతర అవసరాలను తీర్చడంలో దాని ప్రాధాన్యం అంతాఇంతా కాదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వరల్డ్ కప్ మెడల్తో పంత్.. ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్
-
ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
-
ఘనంగా వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్.. తారల సందడి
-
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
అన్లిమిటెడ్ క్లెయిం మొత్తంతో ఐసీఐసీఐ ఆరోగ్య బీమా పాలసీ!
-
వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 33 వేల మరణాలు: లాన్సెట్