విపత్తుల నివారణదళం.. సన్నద్ధం
జిల్లాలో ఎక్కడైనా ప్రకృతి విపత్తులు ఏర్పడితే సహాయక చర్యల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ బాధలు ఎక్కువ. భారీ వర్షాల్లో ఎవరైనా చిక్కుకుంటే అంతే సంగతులు. కేంద్ర రక్షణ బృందాలు రావాలంటే ఆలస్యమౌతుంది.
20 మంది పోలీసులకు ప్రత్యేక శిక్షణ
న్యూస్టుడే, ఆదిలాబాద్ పట్టణం
జిల్లాలో ఎక్కడైనా ప్రకృతి విపత్తులు ఏర్పడితే సహాయక చర్యల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ బాధలు ఎక్కువ. భారీ వర్షాల్లో ఎవరైనా చిక్కుకుంటే అంతే సంగతులు. కేంద్ర రక్షణ బృందాలు రావాలంటే ఆలస్యమౌతుంది. దశాబ్దంన్నర కిందట పెన్గంగ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకు ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బయటపడ్డారు. కొందరైతే సమీప ఎత్తయిన భవనాల్లో, పాఠశాలల్లో తలదాచుకుంటే విపత్తు ప్రతిస్పందన బృందాలు వచ్చి వారిని క్షేమంగా సురక్షిత ప్రాంతానికి తరలించాయి. అప్పుడప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో, వాగులు ప్రవహించే గ్రామాల వద్ద ప్రజలకు భారీ వర్షాల సమయంలో ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. అలాంటి చోట ప్రాణనష్టం సంభవించకుండా తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టేలా జిల్లా స్థాయిలో విపత్తు ప్రతిస్పందన దళం(డిస్ట్రిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) ఏర్పాటైంది.
పదిరోజులపాటు శిక్షణ
జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ములుగు జిల్లాలో పని చేసిన సమయంలో విపత్తుల నివారణ బృందం పని తీరును గమనించి అలాంటి బృందాలు ఆదిలాబాద్ జిల్లాలోనూ అవసరమనే భావనతో ఏఆర్(ఆర్మ్డ్ రిజర్వు పోలీసు) విభాగంలోని 20 మందికి హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఒక ఏఆర్ ఎస్సై, 19మంది కానిస్టేబుళ్లు ఇందులో సభ్యులు. పదిరోజులపాటు వీరు శిక్షణ తీసుకున్నారు. సాధారణ రోజుల్లో తమ విధులు నిర్వర్తిస్తూనే జిల్లాలో ఎక్కడి నుంచైనా పిలుపువచ్చిన వెంటనే సహాయ చర్యల్లో వీరు రంగంలోకి దిగుతారు. అవసరమైతే పక్క ప్రాంతాలకు సైతం వెళ్తారు.
ప్రత్యేక పడవ.. రక్షణ జాకెట్లు
మోటారుతో నడిచే ప్రత్యేక పడవ వీరికి అందుబాటులో ఉంటుంది. పది మందిని తీసుకెళ్లే సామర్థ్యం ఈ పడవకు ఉంది. ఒక వేళ తక్కువ నీళ్లుంటే మోటారు కాకుండా చేతి సాయంతో పెడల్స్ వినియోగించి ముందుకు వెళతారు. నీటిలో మునిగే వాళ్ల ప్రాణాలు కాపాడేందుకు వీరి వద్ద లైవ్ జాకెట్లు ఉన్నాయి. నీటి ప్రాంతాల్లో ఇరుక్కుంటే గుండ్రటి ట్యూబ్కు తాడుకట్టి వారు బయటకు వచ్చేలా చర్యలు చేపడతారు.
చెట్లు పడిపోయినా.. ఇళ్లు కూలినా
వర్షాకాలంలో ఎక్కువగా భారీ చెట్లు కూలిపోవడం వల్ల రాకపోకలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అలాంటి చోట వీరు తక్షణమే వాలిపోతారు. ఛార్జింగ్ సాయంతో పనిచేసే రంపాలతో పడి పోయిన చెట్లను చిన్న భాగాలుగా చేసి అడ్డంకులు తొలగిస్తారు. ఎక్కడైనా నిర్మాణాలు కూలిపోయి శిథిలాల్లో ఇరుక్కుపోతే అక్కడా రంగంలోకి దిగుతారు. గాయపడిన వారిని పడుకోబెట్టి తీసుకొచ్చేందుకు స్ట్రెచర్ సైతం వీరి వద్ద అందుబాటులో ఉంటుంది. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, ఇతరశాఖల సమన్వయంతో వీరు పని చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జడ్పీలో ఇక ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం గురువారం ముగియనుండటంతో శుక్రవారం ప్రత్యేకాధికారి పాలన మొదలు కానుంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక పాలనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. -
ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురు
[ 04-07-2024]
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపాల్టీ వైస్ ఛైర్మన్పై అవిశ్వాసం నేపథ్యంలో ఆయన బుధవారం ఎక్స్ అఫీషియో సభ్యుడి కింద దరఖాస్తు చేసుకోగా సమయం మించిపోయిందని అధికారులు పేర్కొంటూ అవిశ్వాసానికి ఓటు లేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. -
ఆర్జీయూకేటీలో తగ్గిన ప్రవేశాలు
[ 04-07-2024]
ఆర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల జాబితాను బుధవారం విడుదల చేసింది. -
మృత్యు పాశాలు
[ 04-07-2024]
నిర్మల్ జిల్లా గొల్లపేటకు చెందిన ప్రమోద్ విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆదిలాబాద్ మండలం యాపల్గూడకు చెందిన మోతీరాం విద్యుత్తు స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో మరణించాడు. -
మైనింగ్ మెరికలు
[ 04-07-2024]
పదోతరగతి పూర్తికాగానే పాలిటెక్నిక్ చేసేందుకు విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. కోర్సు పూర్తికాగానే ఏడాదికి రూ.లక్షల్లో ప్యాకేజీ అందుకొంటుండటమే దీనికి కారణం. -
అపురూప చరిత్ర.. చిగురిస్తున్న ఆశ!
[ 04-07-2024]
కుమురంభీం జిల్లా ప్రకృతి సంపద, సహజ వనరులకు ఆలవాలం. అపార ఖనిజాలున్న అడవులతోపాటు, జలపాతాలు, విశాలమైన గోదావరి తీరం ఆకట్టుకుంటాయి. -
పత్తి విత్తనాలు మొలకెత్తలేదని యువ రైతు ఆత్మహత్మ
[ 04-07-2024]
పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదని మనోవేదనకు గురై ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. -
కుటుంబం ఛిన్నాభిన్నం!
[ 04-07-2024]
ఇంటి పెద్ద, కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన వాడే దారితప్పాడు. భార్యను పిల్లలను కంటికిరెప్పలా చూసుకోవాల్సి ఉండగా.. కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిస కావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. -
పదవీకాలం ముగింపు.. మిగిలిన పనుల పలకరింపు
[ 04-07-2024]
తాండూరు మండలంలోని కుర్మవాడలో ముడుగిరి భీమయ్య ఇంటి నుంచి మురికి రాజయ్య ఇంటి వరకు సిమెంట్ రహదారి నిర్మాణం కోసం రూ.3 లక్షల నిధులు కేటాయించారు. ఇప్పటికీ ఆ పనులు మొదలుపెట్టలేదు. -
పలుకు‘బడి’ బదిలీ
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నట్లు ఓ వైపు ప్రచారం చేస్తూనే.. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్నవారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తుండటం ఉపాధ్యాయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. -
కొత్త చట్టంతో సత్వర న్యాయం
[ 04-07-2024]
బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న న్యాయ చట్టాల్లో పలుమార్పులు, చేర్పులు చేసి నూతన విధానాలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. వీటివల్ల బాధితులకు త్వరగా న్యాయం జరిగే వీలుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. -
చెరిపేస్తున్నారు.. చక్కదిద్దేవరు?
[ 04-07-2024]
చెరువు.. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా ఇది ఉండటం ఎంతో ఆవశ్యకం. కేవలం సాగునీటి కోసమే కాదు.. అక్కడి ప్రజలు, జీవరాశుల ఇతర అవసరాలను తీర్చడంలో దాని ప్రాధాన్యం అంతాఇంతా కాదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రాజధాని అమరావతి స్థితిగతులివీ..
-
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
-
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
-
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన