రైతు నేస్తం.. సాంకేతిక ఫలం
జిల్లాల్లో నిర్మించిన రైతు వేదికల్లో రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు వీలుగా దృశ్యశ్రవణ పరికరాలను బిగించి రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
మండలాల వారీగా రైతు వేదికల్లో దృశ్య శ్రవణ కేంద్రాలు
న్యూస్టుడే, ఆదిలాబాద్ వ్యవసాయం
జిల్లాల్లో నిర్మించిన రైతు వేదికల్లో రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు వీలుగా దృశ్యశ్రవణ పరికరాలను బిగించి రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫాలితాలను ఇవ్వడంతో మరిన్ని సేవలు అందించేందుకు మండలానికి ఒక రైతు వేదికను ఎంపిక చేసి ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికోసం ఒక్కో రైతువేదికకు రూ.3.70 లక్షలు మంజూరు చేసింది. ఇందుకోసం ఇప్పటికే కొన్ని మండలాల్లో దృశ్యశ్రవణ పరికరాలను బిగించారు. మరి కొన్ని మండలాల్లో పనులు జరుగుతున్నాయి.
జిల్లాల్లో గత ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికల ద్వారా రైతులకు సేవలందించేందుకు వీలుగా ఆధునిక, సాంకేతికత పద్ధతులను ఉపయోగించుకొని రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు శాస్త్రవేత్తలతో అందించేలా దృశ్యశ్రవణ పరికరాలను ఏర్పాటు చేశారు. తొలివిడతలో ప్రయోగాత్మకంగా ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ డివిజన్ల వారీగా రైతులకు అందుబాటులో ఉండే ఒక రైతు వేదికను దృశ్య శ్రవణ కేంద్రంగా తీర్చిదిద్దారు. తాజాగా జిల్లాలోని అన్ని మండలాల్లో ఒక రైతువేదికలో రైతు నేస్తం కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
చకచకా ఏర్పాట్లు..
- ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, ఇచ్చోడ, కేస్లాపూర్, జైనథ్, బండల్నాగాపూర్ రైతు వేదికల్లో ఇప్పటికే దృశ్య శ్రవణ కేంద్రాలను ఏర్పాటు చేయగా, తాజాగా మండలానికి ఒకటి చొప్పున ఆదిలాబాద్ జిల్లాలో అంకోలి, మావల, కాప్సి, ధనోరా, బరంపూర్, బజార్హత్నూర్, నేరడిగొండ, సిరికొండ, గుడిహత్నూర్, శ్యాంపూర్, తడిహత్నూర్, గాదిగూడ రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమాలను రైతులు వీక్షించేందుకు వీలుగా దృశ్యశ్రవణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- నిర్మల్ జిల్లాలోని మూడు వ్యవసాయ డివిజన్ల పరిధిలో కడెం, కుభీరు మండలంలోని సొనారి, సోన్ మండలంలోని బ్రహ్మన్గావ్ రైతు వేదికలను ఎంపిక చేశారు. లక్ష్మణచాందా, సోన్, పరిమండల్, బన్సపెల్లి, అక్కాపూర్, నర్సాపూర్(జి), నిర్మల్, చుచుండ్, కుభీరు, ముథోల్, దౌలతాబాద్, బాసర, సత్తెనపల్లి, దస్తూరాబాద్, ఇటిక్యాల రైతు వేదికల్లో పరికరాలను బిగిస్తున్నారు.
- మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి, భీమిని, చెన్నూరు డివిజన్ పరిధిలో కిష్టంపేట, లక్షెట్టిపేట రైతు వేదికల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొత్తగా మండలానికి ఒకటి చొప్పున సౌకర్యాలు ఉండే రైతు వేదికలను ఎంపిక చేసి దృశ్యశ్రవణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.కుమురం భీం జిల్లాలో సిర్పూరు(యు) మండలం మహాగావ్, ఆసిఫాబాద్ డివిజన్లో రాజంపేట, సిర్పూరు (టి)లోని రైతు వేదికల్లో ఇప్పటికే ఏర్పాటు చేశారు. కొత్తగా బెజ్జూర్, దహెగాం, కౌటాల, చింతలమానెపల్లి, తిర్యాణి, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, లింగాపూర్ మండలాల్లో ఏర్పాటు చేస్తున్నారు.
పరికరాలు బిగిస్తున్నారు..
-పుల్లయ్య జిల్లా వ్యవసాయాధికారి, ఆదిలాబాద్
రైతు వేదికలను దృశ్య శ్రవణ కేంద్రాలుగా మార్చడం వల్ల రైతులకు మేలు జరుగుతుంది. వ్యవసాయ సంబంధిత సమాచారంతో పాటు పంటల వారీగా నేరుగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల నుంచి సలహాలు, సూచనలు పొందే వీలుంది. గతంలో ప్రయోగాత్మకంగా జిల్లాకు నాలుగు రైతు వేదికల్లో కార్యక్రమాన్ని నిర్వహించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలానికి ఒకటి చొప్పున జిల్లాల వారీగా అన్ని మండలాల్లో పరికరాలను బిగిస్తున్నారు. వారం రోజుల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జడ్పీలో ఇక ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం గురువారం ముగియనుండటంతో శుక్రవారం ప్రత్యేకాధికారి పాలన మొదలు కానుంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక పాలనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. -
ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురు
[ 04-07-2024]
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపాల్టీ వైస్ ఛైర్మన్పై అవిశ్వాసం నేపథ్యంలో ఆయన బుధవారం ఎక్స్ అఫీషియో సభ్యుడి కింద దరఖాస్తు చేసుకోగా సమయం మించిపోయిందని అధికారులు పేర్కొంటూ అవిశ్వాసానికి ఓటు లేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. -
ఆర్జీయూకేటీలో తగ్గిన ప్రవేశాలు
[ 04-07-2024]
ఆర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల జాబితాను బుధవారం విడుదల చేసింది. -
మృత్యు పాశాలు
[ 04-07-2024]
నిర్మల్ జిల్లా గొల్లపేటకు చెందిన ప్రమోద్ విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆదిలాబాద్ మండలం యాపల్గూడకు చెందిన మోతీరాం విద్యుత్తు స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో మరణించాడు. -
మైనింగ్ మెరికలు
[ 04-07-2024]
పదోతరగతి పూర్తికాగానే పాలిటెక్నిక్ చేసేందుకు విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. కోర్సు పూర్తికాగానే ఏడాదికి రూ.లక్షల్లో ప్యాకేజీ అందుకొంటుండటమే దీనికి కారణం. -
అపురూప చరిత్ర.. చిగురిస్తున్న ఆశ!
[ 04-07-2024]
కుమురంభీం జిల్లా ప్రకృతి సంపద, సహజ వనరులకు ఆలవాలం. అపార ఖనిజాలున్న అడవులతోపాటు, జలపాతాలు, విశాలమైన గోదావరి తీరం ఆకట్టుకుంటాయి. -
పత్తి విత్తనాలు మొలకెత్తలేదని యువ రైతు ఆత్మహత్మ
[ 04-07-2024]
పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదని మనోవేదనకు గురై ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. -
కుటుంబం ఛిన్నాభిన్నం!
[ 04-07-2024]
ఇంటి పెద్ద, కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన వాడే దారితప్పాడు. భార్యను పిల్లలను కంటికిరెప్పలా చూసుకోవాల్సి ఉండగా.. కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిస కావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. -
పదవీకాలం ముగింపు.. మిగిలిన పనుల పలకరింపు
[ 04-07-2024]
తాండూరు మండలంలోని కుర్మవాడలో ముడుగిరి భీమయ్య ఇంటి నుంచి మురికి రాజయ్య ఇంటి వరకు సిమెంట్ రహదారి నిర్మాణం కోసం రూ.3 లక్షల నిధులు కేటాయించారు. ఇప్పటికీ ఆ పనులు మొదలుపెట్టలేదు. -
పలుకు‘బడి’ బదిలీ
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నట్లు ఓ వైపు ప్రచారం చేస్తూనే.. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్నవారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తుండటం ఉపాధ్యాయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. -
కొత్త చట్టంతో సత్వర న్యాయం
[ 04-07-2024]
బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న న్యాయ చట్టాల్లో పలుమార్పులు, చేర్పులు చేసి నూతన విధానాలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. వీటివల్ల బాధితులకు త్వరగా న్యాయం జరిగే వీలుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. -
చెరిపేస్తున్నారు.. చక్కదిద్దేవరు?
[ 04-07-2024]
చెరువు.. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా ఇది ఉండటం ఎంతో ఆవశ్యకం. కేవలం సాగునీటి కోసమే కాదు.. అక్కడి ప్రజలు, జీవరాశుల ఇతర అవసరాలను తీర్చడంలో దాని ప్రాధాన్యం అంతాఇంతా కాదు.
తాజా వార్తలు (Latest News)
-
ఘనంగా వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్.. తారల సందడి
-
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
అన్లిమిటెడ్ క్లెయిం మొత్తంతో ఐసీఐసీఐ ఆరోగ్య బీమా పాలసీ!
-
వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 33 వేల మరణాలు: లాన్సెట్
-
రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 24,350 ఎగువన నిఫ్టీ
-
మత్తు ఊబిలో ఎంబీఏ విద్యార్థులు.. డ్రగ్ రాకెట్ను ఛేదించిన టీజీ న్యాబ్ పోలీసులు