ఇంటి నంబర్లు రావు.. రిజిస్ట్రేషన్లు కావు
పంచాయతీ నుంచి పురపాలికగా ప్రకటించిన అనంతరం దస్త్రాల బదలాయింపు, డిజిటల్ కీ రాకపోవడంతో.. ఆసిఫాబాద్ పట్టణంలో పురపాలన నిలిచిపోయింది.
నెలల తరబడి ప్రజల ఇబ్బందులు.. రూ.50 లక్షల నిధులకు లెక్కల్లేవ్!
ఈనాడు, ఆసిఫాబాద్
పంచాయతీ నుంచి పురపాలికగా ప్రకటించిన అనంతరం దస్త్రాల బదలాయింపు, డిజిటల్ కీ రాకపోవడంతో.. ఆసిఫాబాద్ పట్టణంలో పురపాలన నిలిచిపోయింది. మరోవైపు పట్టణంలోని రాజంపేట ప్రాంతాన్ని పంచాయతీగా ప్రకటించినా అందుకు సంబంధించిన గెజిట్ విడుదల కాకపోవడంతో.. ఇళ్లు కట్టుకోవడానికి, భూములు కొనుగోలు చేయడానికి ప్రజలకు పాట్లు తప్పడం లేదు. రిజిస్ట్రేషన్లు సైతం జరగకపోవడంతో.. జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం జనన, మరణ ధ్రువపత్రాల కోసం సైతం ఎదురుచూపులు తప్పడం లేదు. అయిదు నెలల నుంచి పట్టణంలో ఈ పరిస్థితి ఉండగా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆసిఫాబాద్ పురపాలికలను 20 వార్డులతో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన ఉత్తర్వులు జారీ చేసింది. 8వ షెడ్యూల్లో ఉన్న రాజంపేటను పంచాయతీగా ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. గెజిట్ విడుదల చేస్తేనే పంచాయతీగా రాజంపేట ఏర్పడుతుంది. గవర్నర్ వద్ద ఫైలు పెండింగ్లో ఉండడంతో గెజిట్ విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలు కొత్తగా ఇల్లు కట్టుకుందామన్నా, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలన్నా అనుమతులు లభించని పరిస్థితి. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో.. అనేక చోట్ల విద్యార్థుల జనన ధ్రువీకరణ పత్రాలు అవసరమున్నా, ఇక్కడ జారీ కాకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల్లో స్పందన కరవు..
ఆసిఫాబాద్ వివరాలు ఏవీ పురపాలిక వెబ్సైట్లో పొందుపర్చకపోవడం, పట్టణ పటం రెవెన్యూ అధికారులు ఇవ్వకపోవడం, పుర కమిషనర్కు డిజిటల్ కీ రాకపోవడంతో.. మ్యూటేషన్లు, రిజిస్ట్రేషన్లు కావడం లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఇళ్లు కట్టుకునే వారు, బ్యాంకుల రుణం పొందే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని నెలలుగా ఈ సమస్య ఉన్నా, సంబంధిత అధికారుల్లో స్పందన కరవైంది.
రూ.50 లక్షలు పక్కదారి..
ఫిబ్రవరిలో పంచాయతీ నుంచి పురపాలికగా మారిన తరుణంలో రూ.50 లక్షల మేర నిధులు ఆసిఫాబాద్ పంచాయతీలో ఉండేవి. పంచాయతీకి పన్నులు, ఇతరాత్ర వచ్చిన ఆదాయమే ఇది. వీటిని ఖజానా శాఖలో సంబంధిత అధికారులు జమచేయాలి. అలా కాకుండా పంచాయతీలో ఉండే ఇద్దరు వ్యక్తులు పక్కదారి పట్టించారు. ఆడిట్ అధికారులు ఈ అంశం మార్చిలోనే గుర్తించారు. రెండు నెలలు దాటినా ఈ నిధులు ఎవరు పక్కదారి పట్టించారనే విషయం అధికారులు తేల్చకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. నిధుల లేమితో కునారిల్లుతున్న పట్టణంలో అడుగడుగునా అసౌకర్యాలు కనిపిస్తున్నాయి. ఈ నిధులను జేబులో వేసుకున్న వారిని గుర్తించి, డబ్బులు వెంటనే రికవరీ చేయాలనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇళ్లు లేకున్నా 92 మందికి ఇంటి నంబర్లు మంజూరు చేశారు. ఈ వ్యవహరంలో సైతం అక్రమాలకు పాల్పడిన వారిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. లేని ఇళ్లకు నంబర్లు కేటాయించారని గుర్తించి సంబంధిత అధికారులు చేతులు దులుపుకోవడం గమనార్హం.
త్వరలోనే అన్ని రకాల అనుమతులు
-దీపక్ తివారీ, జిల్లా అదనపు పాలనాధికారి
ఆసిఫాబాద్ పురపాలికతోపాటు రాజంపేట పంచాయతీకి అవసరమైన అన్ని అనుమతులు వారం, పది రోజుల్లో వస్తాయి. ఇందుకోసం సంబంధిత అధికారులు హైదరాబాద్కు వెళ్లారు. పంచాయతీ గెజిట్ గవర్నర్ నుంచి విడుదల కావాల్సి ఉంది. ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జడ్పీలో ఇక ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం గురువారం ముగియనుండటంతో శుక్రవారం ప్రత్యేకాధికారి పాలన మొదలు కానుంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక పాలనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. -
ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురు
[ 04-07-2024]
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపాల్టీ వైస్ ఛైర్మన్పై అవిశ్వాసం నేపథ్యంలో ఆయన బుధవారం ఎక్స్ అఫీషియో సభ్యుడి కింద దరఖాస్తు చేసుకోగా సమయం మించిపోయిందని అధికారులు పేర్కొంటూ అవిశ్వాసానికి ఓటు లేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. -
ఆర్జీయూకేటీలో తగ్గిన ప్రవేశాలు
[ 04-07-2024]
ఆర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల జాబితాను బుధవారం విడుదల చేసింది. -
మృత్యు పాశాలు
[ 04-07-2024]
నిర్మల్ జిల్లా గొల్లపేటకు చెందిన ప్రమోద్ విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆదిలాబాద్ మండలం యాపల్గూడకు చెందిన మోతీరాం విద్యుత్తు స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో మరణించాడు. -
మైనింగ్ మెరికలు
[ 04-07-2024]
పదోతరగతి పూర్తికాగానే పాలిటెక్నిక్ చేసేందుకు విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. కోర్సు పూర్తికాగానే ఏడాదికి రూ.లక్షల్లో ప్యాకేజీ అందుకొంటుండటమే దీనికి కారణం. -
అపురూప చరిత్ర.. చిగురిస్తున్న ఆశ!
[ 04-07-2024]
కుమురంభీం జిల్లా ప్రకృతి సంపద, సహజ వనరులకు ఆలవాలం. అపార ఖనిజాలున్న అడవులతోపాటు, జలపాతాలు, విశాలమైన గోదావరి తీరం ఆకట్టుకుంటాయి. -
పత్తి విత్తనాలు మొలకెత్తలేదని యువ రైతు ఆత్మహత్మ
[ 04-07-2024]
పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదని మనోవేదనకు గురై ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. -
కుటుంబం ఛిన్నాభిన్నం!
[ 04-07-2024]
ఇంటి పెద్ద, కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన వాడే దారితప్పాడు. భార్యను పిల్లలను కంటికిరెప్పలా చూసుకోవాల్సి ఉండగా.. కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిస కావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. -
పదవీకాలం ముగింపు.. మిగిలిన పనుల పలకరింపు
[ 04-07-2024]
తాండూరు మండలంలోని కుర్మవాడలో ముడుగిరి భీమయ్య ఇంటి నుంచి మురికి రాజయ్య ఇంటి వరకు సిమెంట్ రహదారి నిర్మాణం కోసం రూ.3 లక్షల నిధులు కేటాయించారు. ఇప్పటికీ ఆ పనులు మొదలుపెట్టలేదు. -
పలుకు‘బడి’ బదిలీ
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నట్లు ఓ వైపు ప్రచారం చేస్తూనే.. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్నవారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తుండటం ఉపాధ్యాయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. -
కొత్త చట్టంతో సత్వర న్యాయం
[ 04-07-2024]
బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న న్యాయ చట్టాల్లో పలుమార్పులు, చేర్పులు చేసి నూతన విధానాలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. వీటివల్ల బాధితులకు త్వరగా న్యాయం జరిగే వీలుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. -
చెరిపేస్తున్నారు.. చక్కదిద్దేవరు?
[ 04-07-2024]
చెరువు.. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా ఇది ఉండటం ఎంతో ఆవశ్యకం. కేవలం సాగునీటి కోసమే కాదు.. అక్కడి ప్రజలు, జీవరాశుల ఇతర అవసరాలను తీర్చడంలో దాని ప్రాధాన్యం అంతాఇంతా కాదు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్
-
వివేకా హత్య కేసులో కీలక సాక్షి రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం
-
కన్నబిడ్డ కసిరింది.. కన్నపేగు కుమిలింది
-
ఆరు నెలల చిన్నారి చికిత్సకు.. ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు
-
క్షమించండి.. నెలలో తిరిగిస్తా.. ఉత్తరం రాసి చోరీకి పాల్పడ్డ దొంగ
-
తూర్పుగోదావరి జిల్లాలో ప్రాణం నిలిపిన పింఛను!