logo

తాగుడికి బానిసైన భర్త..

రోజూ తాగొచ్చి గొడవ చేసే భర్తతో.. ఆ ఇల్లాలు, సంతానం అనేక అవస్థలు పడుతున్నారు. గతంలో అతను హత్యాయత్నం చేసిన ఘటనలో నమోదైన కేసులో జైలుకు వెళ్లాడు.

Published : 02 Jul 2024 05:41 IST

పురుగుమందు తాగిన తల్లీ, ముగ్గురు కుమార్తెలు..
ఇద్దరి పరిస్థితి విషమం

ఈనాడు, ఆసిఫాబాద్‌: రోజూ తాగొచ్చి గొడవ చేసే భర్తతో.. ఆ ఇల్లాలు, సంతానం అనేక అవస్థలు పడుతున్నారు. గతంలో అతను హత్యాయత్నం చేసిన ఘటనలో నమోదైన కేసులో జైలుకు వెళ్లాడు. ఇటీవలే బెయిల్‌పై వచ్చిన అతను మళ్లీ తాగుతూ ఇంట్లో నానా యాగీ చేయడంతో.. విరక్తి చెందిన తల్లీకూతుళ్లు చావే శరణ్యమనుకుని మూకుమ్మడిగా పురుగుమందు తాగారు. సీఐ రాంబాబు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్‌ మండలం గజ్జిగూడ గ్రామానికి చెందిన చిలుకూరి ప్రతాప్‌-అనిత దంపతులకు నలుగురు ఆడపిల్లలు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. ప్రతాప్‌ సోమవారం సాయంత్రం తాగి ఇంటికొచ్చి భార్యతో గొడపపడ్డాడు. మనస్తాపం చెందిన అనిత(45), కుమార్తెలు లక్ష్మి(21), రమ్య(16), ఐశ్వర్య(14) సమీపంలోని పంట చేనుకు వెళ్లి పురుగుమందు తాగారు. గమనించిన చుట్టు పక్కన రైతులు వెంటనే బాధితులను కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇందులో లక్ష్మి, రమ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈమేరకు ప్రతాప్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ రాంబాబు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని