logo

జీఎస్టీలో ఉత్తమ పురస్కారం

జీఎస్టీ దినోత్సవం పురస్కరించుకుని ఆలిండియా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 28 మంది జీఎస్టీ ఇన్‌స్పెక్టర్లను ఎంపిక చేశారు.

Published : 02 Jul 2024 05:35 IST

మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే: జీఎస్టీ దినోత్సవం పురస్కరించుకుని ఆలిండియా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 28 మంది జీఎస్టీ ఇన్‌స్పెక్టర్లను ఎంపిక చేశారు. వీరిలో మంచిర్యాల పట్టణంలోని లక్ష్మినగర్‌కు చెందిన దమ్మన్న నిఖిల్‌రెడ్డి ఉత్తమ పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం బెంగళూర్‌లో పనిచేస్తున్నారు. దిల్లీలో సోమవారం నిర్వహించిన జీఎస్టీ దినోత్సవ వేడుకల్లో నిఖిల్‌రెడ్డి ఉత్తమ అవార్డును ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్‌ అనిల్‌ కుమార్‌ గుప్తా చేతుల మీదుగా అందుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని