అమల్లోకి కొత్త చట్టాలు
భారత ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నేర, న్యాయ చట్టాలు-2023 సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి.
తొలి కేసు లక్ష్మణచాంద పీఎస్లో..
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే
భారత ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నేర, న్యాయ చట్టాలు-2023 సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. గతంలో ఉన్న ఐపీసీ, సీఆర్పీసీ, భారత సాక్ష్యాధార చట్టాల స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్(బీఎస్ఏ) చట్టాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. బాధితుల హక్కులను పరిరక్షిస్తూనే, కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వరన్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా ఇవి నిర్దేశించారు. దర్యాప్తు విధానాలతో పాటు విచారణ పద్ధతుల్లోనూ సమూలంగా మార్పులొస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తయిన శిక్షణ..
ఇప్పటివరకు అమలైన వాటితో పోలిస్తే కొత్త చట్టాల్లో ఉన్న మార్పులు, చేర్పులు, ఇతరత్రా అంశాలపై పోలీసులందరికీ అవగాహన కల్పించారు. డీఎస్పీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది అందరికీ విడతల వారీగా శిక్షణ కొనసాగించారు. విశ్రాంత న్యాయవాదుల సహకారంతో, ఇప్పటికే శిక్షణ పొందిన పోలీసు అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రొజెక్టర్ల సాయంతో చట్టాల్లోని అంశాలను కూలంకషంగా వివరించారు. సందేహాలను నివృత్తి చేస్తూ మానసికంగా సన్నద్ధం చేశారు. కాగా.. సమకాలీన అంశాలు, అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా పలురకాల నియమ నిబంధనలను నవీన చట్టాల్లో చేర్చారు.
ప్రమాదవశాత్తు మృతిపై తొలి కేసు
జిల్లా పరిధిలో సోమవారం పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో కేసులూ నమోదయ్యాయి. అయితే.. తొలి కేసు మాత్రం నిర్మల్ ఉపమండలం పరిధిలోని సోన్ సర్కిల్లో నమోదవడం గమనార్హం. లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యు) గ్రామానికి చెందిన పోశెట్టి అనే వ్యక్తి సోమవారం ఉదయం గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వల చుట్టుకొని అతడు నీటిలో మునిగి చనిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత చట్టంలోని సెక్షన్ 194 (1) ప్రకారం ఎస్హెచ్ఓ సుమలత కేసు నమోదుచేశారు. జిల్లా పోలీసు అధికారి జానకి షర్మిల, డీఎస్పీ గంగారెడ్డి, సోన్ సీఐ నవీన్కుమార్ కేసు నమోదును పర్యవేక్షించారు. మారిన చట్టాలకు అనుగుణంగా జిల్లా పరిధిలో ఇది తొలి కేసుగా నమోదైంది.
అవగాహన కల్పించాం
- జానకి షర్మిల, జిల్లా పోలీసు అధికారి
నూతనంగా అమల్లోకి వచ్చిన క్రిమినల్ చట్టాల్లో సమూల మార్పులున్నాయి. వీటివల్ల బాధిత వ్యక్తుల హక్కుల పరిరక్షణ, నేర విచారణ మరింత సులభం, సమర్థవంతమవుతుంది. చట్టాలు, కేసుల నమోదు, దర్యాప్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై పోలీసులందరికీ అవగాహన కల్పించాం. కొత్త విధానాలతో దేశ అంతర్గత భద్రతలో నూతన శకం మొదలవుతుంది. ప్రజలకు ఎంతో సౌలభ్యంగా, వేగంగా, నాణ్యంగా సేవలు అందించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జడ్పీలో ఇక ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం గురువారం ముగియనుండటంతో శుక్రవారం ప్రత్యేకాధికారి పాలన మొదలు కానుంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక పాలనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. -
ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురు
[ 04-07-2024]
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపాల్టీ వైస్ ఛైర్మన్పై అవిశ్వాసం నేపథ్యంలో ఆయన బుధవారం ఎక్స్ అఫీషియో సభ్యుడి కింద దరఖాస్తు చేసుకోగా సమయం మించిపోయిందని అధికారులు పేర్కొంటూ అవిశ్వాసానికి ఓటు లేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. -
ఆర్జీయూకేటీలో తగ్గిన ప్రవేశాలు
[ 04-07-2024]
ఆర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల జాబితాను బుధవారం విడుదల చేసింది. -
మృత్యు పాశాలు
[ 04-07-2024]
నిర్మల్ జిల్లా గొల్లపేటకు చెందిన ప్రమోద్ విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆదిలాబాద్ మండలం యాపల్గూడకు చెందిన మోతీరాం విద్యుత్తు స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో మరణించాడు. -
మైనింగ్ మెరికలు
[ 04-07-2024]
పదోతరగతి పూర్తికాగానే పాలిటెక్నిక్ చేసేందుకు విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. కోర్సు పూర్తికాగానే ఏడాదికి రూ.లక్షల్లో ప్యాకేజీ అందుకొంటుండటమే దీనికి కారణం. -
అపురూప చరిత్ర.. చిగురిస్తున్న ఆశ!
[ 04-07-2024]
కుమురంభీం జిల్లా ప్రకృతి సంపద, సహజ వనరులకు ఆలవాలం. అపార ఖనిజాలున్న అడవులతోపాటు, జలపాతాలు, విశాలమైన గోదావరి తీరం ఆకట్టుకుంటాయి. -
పత్తి విత్తనాలు మొలకెత్తలేదని యువ రైతు ఆత్మహత్మ
[ 04-07-2024]
పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదని మనోవేదనకు గురై ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. -
కుటుంబం ఛిన్నాభిన్నం!
[ 04-07-2024]
ఇంటి పెద్ద, కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన వాడే దారితప్పాడు. భార్యను పిల్లలను కంటికిరెప్పలా చూసుకోవాల్సి ఉండగా.. కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిస కావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. -
పదవీకాలం ముగింపు.. మిగిలిన పనుల పలకరింపు
[ 04-07-2024]
తాండూరు మండలంలోని కుర్మవాడలో ముడుగిరి భీమయ్య ఇంటి నుంచి మురికి రాజయ్య ఇంటి వరకు సిమెంట్ రహదారి నిర్మాణం కోసం రూ.3 లక్షల నిధులు కేటాయించారు. ఇప్పటికీ ఆ పనులు మొదలుపెట్టలేదు. -
పలుకు‘బడి’ బదిలీ
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నట్లు ఓ వైపు ప్రచారం చేస్తూనే.. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్నవారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తుండటం ఉపాధ్యాయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. -
కొత్త చట్టంతో సత్వర న్యాయం
[ 04-07-2024]
బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న న్యాయ చట్టాల్లో పలుమార్పులు, చేర్పులు చేసి నూతన విధానాలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. వీటివల్ల బాధితులకు త్వరగా న్యాయం జరిగే వీలుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. -
చెరిపేస్తున్నారు.. చక్కదిద్దేవరు?
[ 04-07-2024]
చెరువు.. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా ఇది ఉండటం ఎంతో ఆవశ్యకం. కేవలం సాగునీటి కోసమే కాదు.. అక్కడి ప్రజలు, జీవరాశుల ఇతర అవసరాలను తీర్చడంలో దాని ప్రాధాన్యం అంతాఇంతా కాదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వరల్డ్ కప్ మెడల్తో పంత్.. ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్
-
ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
-
ఘనంగా వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్.. తారల సందడి
-
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
అన్లిమిటెడ్ క్లెయిం మొత్తంతో ఐసీఐసీఐ ఆరోగ్య బీమా పాలసీ!
-
వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 33 వేల మరణాలు: లాన్సెట్