ఆదాయం పెంచుకునే దిశగా బల్దియా
బల్దియాకు ఆర్థిక అవసరాలు పెరిగిపోయాయి. కార్మికుల జీతభత్యాల చెల్లింపు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర కార్యకలాపాలకు రూ.లక్షల్లో ఖర్చు అవుతోంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతి నెలా రావాల్సిన నిధులు సకాలంలో విడుదల కావడం లేదు.
40 అద్దె దుకాణాల వేలానికి కసరత్తు
న్యూస్టుడే, ఆదిలాబాద్ అర్బన్
శివాజీ కూడలిలోని పాత కూరగాయల మార్కెట్ వద్ద షాప్ నెంబర్ 1-10, 12,
14, 15, 16, 18లు మొత్తం 15 దుకాణాలకు వేలంలోకి రానున్నాయి.
బల్దియాకు ఆర్థిక అవసరాలు పెరిగిపోయాయి. కార్మికుల జీతభత్యాల చెల్లింపు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర కార్యకలాపాలకు రూ.లక్షల్లో ఖర్చు అవుతోంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతి నెలా రావాల్సిన నిధులు సకాలంలో విడుదల కావడం లేదు. దీంతో బల్దియా యంత్రాంగం ఆదాయ వనరులు పెంచుకోవడంపై దృష్టి సారించింది. సాధారణంగా ఆస్తి పన్నుల వసూళ్ల విషయంలో సిబ్బంది ఆర్థిక సంవత్సరం చివరి మూడు నాలుగు నెలల్లో వసూళ్లను ముమ్మరం చేస్తారు. పురపాలక కమిషనర్ ఎండీ ఖమర్ అహ్మద్ ఇప్పటి నుంచే ఆస్తి పన్ను వసూళ్లపై దృష్టి సారించారు. ప్రతి నెలా ఎక్కువ ఆదాయం తీసుకొచ్చిన సిబ్బందిని గుర్తించి సన్మానించడంతో పాటు నగదు ప్రోత్సాహకం అందజేస్తూ సిబ్బందిలో పోటీతత్వాన్ని పెంచుతున్నారు. ఇటీవలే తైబజార్కు వేలం నిర్వహించగా 9 నెలల కాలానికే గతంలో కంటే రూ.5.07 లక్షల అదనపు ఆదాయం వచ్చింది. తాజాగా లీజు గడువు ముగిసిన అద్దె దుకాణాలను వేలంపాట వేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా బల్దియాలో తీర్మానం చేసి ఆమోదించడంతో అందరి దృష్టి అద్దె దుకాణాలపై పడింది.
అద్దె షాపుల లీజు బూజు దులిపి
బల్దియాకు వినాయక్ కూడలి, పాత బస్టాండ్, శివాజీచౌక్లోని పాత కూరగాయల మార్కెట్లో రూ.కోట్లు విలువ చేసే స్థలాల్లో 121 అద్దె దుకాణాలున్నాయి. వ్యాపారులకు ఇచ్చిన లీజు గడువు ముగిసినా గతంలో అధికారులు పట్టించుకోలేదు. ఆయా షాపుల్లో అసలైన లబ్ధిదారులు ఇతరులకు అద్దెకు ఇచ్చేసి వ్యాపారాలు చేస్తున్నారు. బల్దియాకు సక్రమంగా అద్దె చెల్లించకపోవడంతో ఇప్పటికీ వీటికి సంబంధించి రూ.2.24 కోట్లు అద్దె బకాయిలు పేరుకుపోయాయి. అద్దె దుకాణాలపై సమీక్ష నిర్వహించడం 40 షాపుల లీజు గడువు ముగిసినట్లు తేలింది. దీంతో ఆయా దుకాణాలకు బహిరంగ వేలం వేయాలని నిర్ణయించారు. ఆ వెంటనే తీర్మానాన్ని కౌన్సిల్ ముందుంచడం, ఆమోదించడం జరిగిపోయింది. రెండేళ్ల కిందట ఏడు దుకాణాలను గుట్టుచప్పుడు కాకుండా, కౌన్సిలర్లకు సైతం తెలియకుండా నిర్వహించిన వేలంపాటపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైన నేపథ్యంలో ఈ 40 షాపులకు సంబంధించిన వేలంపాటను పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నారు. ఎక్కువ మంది బిడ్డర్లు పోటీపడేలా చేసి బల్దియాకు ఆదాయం పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు.
పాత రిజర్వేషన్ల ప్రకారమే వేలం
- ఎండీ ఖమర్ అహ్మద్, బల్దియా కమిషనర్
బల్దియాలో 30 ఏళ్లు లీజు గడువు ముగిసిన 40 దుకాణాలకు వేలంపాట నిర్వహించాలన్న తీర్మానాన్ని కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. త్వరలో షాపులను స్వాధీనం చేసుకుంటాం. ఆయా షాపులకు గతంలో ఏ రిజర్వేషన్లు ఉన్నాయో అవే వర్తిస్తాయి. వేలంపాటపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించి పారదర్శకంగా నిర్వహిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జడ్పీలో ఇక ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం గురువారం ముగియనుండటంతో శుక్రవారం ప్రత్యేకాధికారి పాలన మొదలు కానుంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక పాలనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. -
ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురు
[ 04-07-2024]
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపాల్టీ వైస్ ఛైర్మన్పై అవిశ్వాసం నేపథ్యంలో ఆయన బుధవారం ఎక్స్ అఫీషియో సభ్యుడి కింద దరఖాస్తు చేసుకోగా సమయం మించిపోయిందని అధికారులు పేర్కొంటూ అవిశ్వాసానికి ఓటు లేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. -
ఆర్జీయూకేటీలో తగ్గిన ప్రవేశాలు
[ 04-07-2024]
ఆర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల జాబితాను బుధవారం విడుదల చేసింది. -
మృత్యు పాశాలు
[ 04-07-2024]
నిర్మల్ జిల్లా గొల్లపేటకు చెందిన ప్రమోద్ విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆదిలాబాద్ మండలం యాపల్గూడకు చెందిన మోతీరాం విద్యుత్తు స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో మరణించాడు. -
మైనింగ్ మెరికలు
[ 04-07-2024]
పదోతరగతి పూర్తికాగానే పాలిటెక్నిక్ చేసేందుకు విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. కోర్సు పూర్తికాగానే ఏడాదికి రూ.లక్షల్లో ప్యాకేజీ అందుకొంటుండటమే దీనికి కారణం. -
అపురూప చరిత్ర.. చిగురిస్తున్న ఆశ!
[ 04-07-2024]
కుమురంభీం జిల్లా ప్రకృతి సంపద, సహజ వనరులకు ఆలవాలం. అపార ఖనిజాలున్న అడవులతోపాటు, జలపాతాలు, విశాలమైన గోదావరి తీరం ఆకట్టుకుంటాయి. -
పత్తి విత్తనాలు మొలకెత్తలేదని యువ రైతు ఆత్మహత్మ
[ 04-07-2024]
పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదని మనోవేదనకు గురై ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. -
కుటుంబం ఛిన్నాభిన్నం!
[ 04-07-2024]
ఇంటి పెద్ద, కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన వాడే దారితప్పాడు. భార్యను పిల్లలను కంటికిరెప్పలా చూసుకోవాల్సి ఉండగా.. కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిస కావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. -
పదవీకాలం ముగింపు.. మిగిలిన పనుల పలకరింపు
[ 04-07-2024]
తాండూరు మండలంలోని కుర్మవాడలో ముడుగిరి భీమయ్య ఇంటి నుంచి మురికి రాజయ్య ఇంటి వరకు సిమెంట్ రహదారి నిర్మాణం కోసం రూ.3 లక్షల నిధులు కేటాయించారు. ఇప్పటికీ ఆ పనులు మొదలుపెట్టలేదు. -
పలుకు‘బడి’ బదిలీ
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నట్లు ఓ వైపు ప్రచారం చేస్తూనే.. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్నవారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తుండటం ఉపాధ్యాయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. -
కొత్త చట్టంతో సత్వర న్యాయం
[ 04-07-2024]
బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న న్యాయ చట్టాల్లో పలుమార్పులు, చేర్పులు చేసి నూతన విధానాలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. వీటివల్ల బాధితులకు త్వరగా న్యాయం జరిగే వీలుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. -
చెరిపేస్తున్నారు.. చక్కదిద్దేవరు?
[ 04-07-2024]
చెరువు.. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా ఇది ఉండటం ఎంతో ఆవశ్యకం. కేవలం సాగునీటి కోసమే కాదు.. అక్కడి ప్రజలు, జీవరాశుల ఇతర అవసరాలను తీర్చడంలో దాని ప్రాధాన్యం అంతాఇంతా కాదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
-
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
-
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం