ఊరించి.. ఉసూరుమనిపించి!
ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చినట్లే వచ్చిన నైరుతి రుతుపవనాల జాడ లేక వర్షాలు ఆలస్యం కావడంతో విత్తుకున్న రైతుల్లో ఆందోళన మొదలైంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు కొన్ని మండలాలకే పరిమితమయ్యాయి.
24 మండలాల్లో ఇంకా లోటు వర్షపాతం
60 శాతం మాత్రమే సాగు
న్యూస్టుడే, ఆదిలాబాద్ వ్యవసాయం
మొలకలు రాని చోట తిరిగి విత్తుతున్న రైతు
ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చినట్లే వచ్చిన నైరుతి రుతుపవనాల జాడ లేక వర్షాలు ఆలస్యం కావడంతో విత్తుకున్న రైతుల్లో ఆందోళన మొదలైంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు కొన్ని మండలాలకే పరిమితమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ఇంకా 24 మండలాల్లో వర్షానికి లోటు ఉంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. మంచిర్యాల జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, మిగిలిన మూడు జిల్లాల్లో జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు విత్తుకున్న పంటలు మొలక దశలో ఉన్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో కొన్ని మండలాల్లోని రైతులు పంటలపై ఆశలు పెంచుకోగా, వర్షం లేని మండలాలకు చెందిన రైతులు వర్షం జాడ లేక, నాట్లు వేసుకోలేక దిక్కులు చూస్తున్నారు.
జిల్లాలో వర్షాలు భిన్నంగా ఉన్నాయి. కొన్ని మండలాల్లో సాధారణ వర్షం కురవగా, మరి కొన్ని మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో జిల్లా మొత్తంలో వర్షం ఒక్కతీరుగా లేదు. వాతావరణం చూస్తే మబ్బులు కమ్ముకొని జోరు వాన పడుతుందని భావిస్తే, చిరుజల్లులు కురిసి మబ్బులు మాయం అవుతున్నాయి. జిల్లా సాధారణ సాగు 17.32 లక్షల ఎకరాలు కాగా, జూన్ నెలాఖరులోగా 10.56 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతంలో మాదిరిగా ఈ సీజన్లో రైతులు పత్తి పంట వైపు మొగ్గు చూపారు. ఇప్పటికే 8 లక్షల ఎకరాల్లో విత్తుకోవడం పూర్తయినట్లు వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదిక తెలియచేస్తోంది. వరి సాగుకు నెలాఖరు వరకు అవకాశం ఉండటంతో వర్షాలు పడకపోతాయా అనే ధీమాతో రైతులు నారు పోసుకొని సిద్ధంగా ఉన్నారు. వర్షం కొంత ఊరటనివ్వడంతో రైతులు కలుపు తీయడం, ఎరువులు వేయడం చేస్తున్నారు.
కొన్ని మండలాల్లోనే వర్షం
జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షం ఒక తీరుగా లేదు. 24 మండలాల్లో ఇంకా లోటు ఉంది. ఉమ్మడి జిల్లాలోని కొన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో నార్నూర్, మావల మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. మిగిలిన మండలాల్లో మెట్ట పంటల సాగుకు అనుకూలంగా సాధారణ వర్షపాతం నమోదైంది. కుమురంభీం జిల్లాలో తిర్యాణి, రెబ్బెన, కాగజ్నగర్, కౌటాల, బెజ్జూర్, పెంచికల్పేట, దహెగాం, మండలాల్లో తక్కువ వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో హాజీపూర్, బెల్లంపల్లి, నస్పూర్ మండలాల్లో మినహా మిగిలిన 15 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నిర్మల్ జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షం కురిసింది. ఎనిమిది మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, మిగిలిన మండలాలు సాధారణ వర్షపాతానికి చేరువగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జడ్పీలో ఇక ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం గురువారం ముగియనుండటంతో శుక్రవారం ప్రత్యేకాధికారి పాలన మొదలు కానుంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక పాలనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. -
ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురు
[ 04-07-2024]
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపాల్టీ వైస్ ఛైర్మన్పై అవిశ్వాసం నేపథ్యంలో ఆయన బుధవారం ఎక్స్ అఫీషియో సభ్యుడి కింద దరఖాస్తు చేసుకోగా సమయం మించిపోయిందని అధికారులు పేర్కొంటూ అవిశ్వాసానికి ఓటు లేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. -
ఆర్జీయూకేటీలో తగ్గిన ప్రవేశాలు
[ 04-07-2024]
ఆర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల జాబితాను బుధవారం విడుదల చేసింది. -
మృత్యు పాశాలు
[ 04-07-2024]
నిర్మల్ జిల్లా గొల్లపేటకు చెందిన ప్రమోద్ విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆదిలాబాద్ మండలం యాపల్గూడకు చెందిన మోతీరాం విద్యుత్తు స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో మరణించాడు. -
మైనింగ్ మెరికలు
[ 04-07-2024]
పదోతరగతి పూర్తికాగానే పాలిటెక్నిక్ చేసేందుకు విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. కోర్సు పూర్తికాగానే ఏడాదికి రూ.లక్షల్లో ప్యాకేజీ అందుకొంటుండటమే దీనికి కారణం. -
అపురూప చరిత్ర.. చిగురిస్తున్న ఆశ!
[ 04-07-2024]
కుమురంభీం జిల్లా ప్రకృతి సంపద, సహజ వనరులకు ఆలవాలం. అపార ఖనిజాలున్న అడవులతోపాటు, జలపాతాలు, విశాలమైన గోదావరి తీరం ఆకట్టుకుంటాయి. -
పత్తి విత్తనాలు మొలకెత్తలేదని యువ రైతు ఆత్మహత్మ
[ 04-07-2024]
పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదని మనోవేదనకు గురై ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. -
కుటుంబం ఛిన్నాభిన్నం!
[ 04-07-2024]
ఇంటి పెద్ద, కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన వాడే దారితప్పాడు. భార్యను పిల్లలను కంటికిరెప్పలా చూసుకోవాల్సి ఉండగా.. కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిస కావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. -
పదవీకాలం ముగింపు.. మిగిలిన పనుల పలకరింపు
[ 04-07-2024]
తాండూరు మండలంలోని కుర్మవాడలో ముడుగిరి భీమయ్య ఇంటి నుంచి మురికి రాజయ్య ఇంటి వరకు సిమెంట్ రహదారి నిర్మాణం కోసం రూ.3 లక్షల నిధులు కేటాయించారు. ఇప్పటికీ ఆ పనులు మొదలుపెట్టలేదు. -
పలుకు‘బడి’ బదిలీ
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నట్లు ఓ వైపు ప్రచారం చేస్తూనే.. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్నవారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తుండటం ఉపాధ్యాయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. -
కొత్త చట్టంతో సత్వర న్యాయం
[ 04-07-2024]
బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న న్యాయ చట్టాల్లో పలుమార్పులు, చేర్పులు చేసి నూతన విధానాలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. వీటివల్ల బాధితులకు త్వరగా న్యాయం జరిగే వీలుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. -
చెరిపేస్తున్నారు.. చక్కదిద్దేవరు?
[ 04-07-2024]
చెరువు.. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా ఇది ఉండటం ఎంతో ఆవశ్యకం. కేవలం సాగునీటి కోసమే కాదు.. అక్కడి ప్రజలు, జీవరాశుల ఇతర అవసరాలను తీర్చడంలో దాని ప్రాధాన్యం అంతాఇంతా కాదు.