పల్లెవాసి.. పరిశోధనల్లో మెరిసి..!
ఆయనది పక్కా పల్లెటూరు. ఎర్రబస్సూ ఎరగని గ్రామం. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. ఊహ తెలియకముందే తండ్రి చనిపోయారు. తల్లి కష్టపడి ఆ ఇంటిని చక్కదిద్దారు. ఇలాంటి నేపథ్యమున్న ఏ వ్యక్తికైనా భవిష్యత్తు వడ్డించిన విస్తరేం కాదు.
హార్వర్డ్లో నోబెల్ గ్రహీతకు శిష్యుడై..
స్ఫూర్తిదాయకం.. రాజేందర్రెడ్డి ప్రస్థానం
-న్యూస్టుడే, మామడ/నిర్మల్ పట్టణం
పరిశోధనశాలలో..
ఆయనది పక్కా పల్లెటూరు. ఎర్రబస్సూ ఎరగని గ్రామం. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. ఊహ తెలియకముందే తండ్రి చనిపోయారు. తల్లి కష్టపడి ఆ ఇంటిని చక్కదిద్దారు. ఇలాంటి నేపథ్యమున్న ఏ వ్యక్తికైనా భవిష్యత్తు వడ్డించిన విస్తరేం కాదు. ప్రణాళికాబద్ధంగా, పద్ధతిగా జీవిస్తే తప్ప ఎంతో ఎత్తుకు ఎదగలేరు. ఇలాంటి అనేక ఒడిదుడుకులను అధిగమించి జాతీయస్థాయిలో మెరిసి, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి, మల్టీనేషనల్ కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్న ఆ విజేత ప్రస్థానం తెలుసుకుందామా..!
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మలక్చించోలికి చెందిన రాజవ్వ-గంగారెడ్డి దంపతులకు అయిదుగురు సంతానం. అందులో చిన్నవాడు డా.ఎల్.రాజేందర్రెడ్డి. డిగ్రీ వరకు స్థానికంగా చదువుకున్నారు. వీటన్నింటికీ పునాది ప్రభుత్వ ఉపకారవేతనాలే. ఓయూ నుంచి బీఎడ్, ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తిచేశారు. హైదరాబాద్ ఐఐసీటీలో పీహెచ్డీలో చేరారు. ఆ సమయంలోఉపాధ్యాయ ఉద్యోగం వచ్చినప్పటికీ అదికొనసాగించలేకపోయారు. తర్వాత జర్మనీలో సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ కొనసాగించారు. అక్కడ్నుంచి అమెరికాలోని ప్రసిద్ధ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మూడేళ్ల పాటు రీసెర్చ్ అసోసియేట్గా ఇ.జె.కోరెతో కలిసి పనిచేశారు. నోబెల్ బహుమతి సాధించిన ఇ.జె.కోరి పర్యవేక్షణలో ఆయన పీహెచ్డీ పూర్తిచేయడం విశేషం.
కెరీర్ అంతా కెమిస్ట్రీతోనే..
ప్రస్తుతం యువతరం అంతా సాఫ్ట్వేర్, వైద్యరంగంపైనే ప్రధానంగా దృష్టిపెడుతోంది. రాజేందర్రెడ్డి మాత్రం కెమిస్ట్రీతోనే తన భవిష్యత్తును ఉన్నతంగా నిర్మించుకున్నారు. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా ఆరింగ్ ప్రోదేవ్ అనే భారతీయ ప్రభుత్వేతర కంపెనీ సీఈఓగా పనిచేస్తున్నారు. ఇది వినూత్న రసాయన అభివృద్ధి, పరిశోధన కేంద్రం. డిగ్రీ తర్వాత పీజీలో చేరేందుకు అయన క్లిష్టమైన కర్బన రసాయనశాస్త్రం ఎంచుకోవడం గమనార్హం. తదనంతరం వివిధ సంస్థల్లో పనిచేస్తూ తనలోని ఆలోచనలు, పరిశోధనలకు కార్యరూపం ఇచ్చారు. తక్కువ ఖర్చుతో రసాయనాలు, ఔషధాలు తయారుచేయడం, ప్రక్రియను అభివృద్ధి చేయడం, సంక్లిష్టమైన సవాళ్లను అధిగమించేందుకు గల అవకాశాలు, పరిష్కారాలను సూచించడం.. ఇలా విభిన్న అంశాలతో శాస్త్రీయంగా అనుభవం సంపాదించారు. ఔషధ పరిశ్రమలో వివిధ కోణాల్లో నైపుణ్యం సాధించారు.
ఔనా.. నిర్మల్ వాసా..!
రాజేందర్రెడ్డి సందర్భం ఇప్పుడెందుకు వచ్చిందంటే.. తాజాగా, నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ రసాయనశాస్త్ర సదస్సు నిర్వహించారు. ఇందులో కీనోట్ స్పీకర్గా రాజేందర్రెడ్డి వ్యవహరించారు. బెంగళూరు నుంచి ఇక్కడకు అతిథిగా వచ్చిన వ్యక్తి ఎవరో కాదని, నిర్మల్ జిల్లావాసి అని, తాను చదువుకున్న కళాశాలలోనే ఉపన్యసించేందుకు, విద్యార్థులకు మార్గనిర్దేశనం చేసేందుకు వచ్చారని తెలుసుకొని ఆశ్చర్యపోయారు.
నోబెల్ గ్రహీత కోరెతో రాజేందర్రెడ్డి
ప్రతిభకు గుర్తింపు
రాజేందర్రెడ్డి తన ప్రతిభతో అంతర్జాతీయంగా గుర్తింపు సాధించారు. ఈయన చేసిన పలు పరిశోధనపత్రాలు అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. కవర్పేజీల్లో సైతం కనిపించడం విశేషం. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈతరహా గుర్తింపు పొందిన తొలి సీఈఓ ఈయనే కావడం గమనార్హం.
- ఈయన ప్రస్తుతం తన కంపెనీలోని 250 మందికి బాస్గా వ్యవహరిస్తున్నారు.
- గుజరాత్లోని సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయ అడ్హక్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యుడు
- అదే రాష్ట్రంలోని ఇంద్రశీల్ విశ్వవిద్యాలయ శాస్త్రీయ సలహా మండలి సభ్యుడిగా ఉన్నారు.
అపార అవకాశాలు: రాజేందర్రెడ్డి
రసాయనశాస్త్రం అనగానే చాలామంది నీరసిస్తారు. కానీ, ఆ శాస్త్రం అపార అవకాశాలు కల్పిస్తుంటుంది. విద్యార్థులు జీవితంలో స్థిరపడేందుకు, మెరుగైన ఉద్యోగాలను ఎంచుకునేందుకు మంచి సబ్జెక్టే. ఆర్గానిక్ కెమిస్ట్రీకి మరింత ప్రాధాన్యముటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నతవిద్య అభ్యసించేందుకు, పరిశోధనలు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జడ్పీలో ఇక ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం గురువారం ముగియనుండటంతో శుక్రవారం ప్రత్యేకాధికారి పాలన మొదలు కానుంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక పాలనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. -
ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురు
[ 04-07-2024]
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపాల్టీ వైస్ ఛైర్మన్పై అవిశ్వాసం నేపథ్యంలో ఆయన బుధవారం ఎక్స్ అఫీషియో సభ్యుడి కింద దరఖాస్తు చేసుకోగా సమయం మించిపోయిందని అధికారులు పేర్కొంటూ అవిశ్వాసానికి ఓటు లేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. -
ఆర్జీయూకేటీలో తగ్గిన ప్రవేశాలు
[ 04-07-2024]
ఆర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల జాబితాను బుధవారం విడుదల చేసింది. -
మృత్యు పాశాలు
[ 04-07-2024]
నిర్మల్ జిల్లా గొల్లపేటకు చెందిన ప్రమోద్ విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆదిలాబాద్ మండలం యాపల్గూడకు చెందిన మోతీరాం విద్యుత్తు స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో మరణించాడు. -
మైనింగ్ మెరికలు
[ 04-07-2024]
పదోతరగతి పూర్తికాగానే పాలిటెక్నిక్ చేసేందుకు విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. కోర్సు పూర్తికాగానే ఏడాదికి రూ.లక్షల్లో ప్యాకేజీ అందుకొంటుండటమే దీనికి కారణం. -
అపురూప చరిత్ర.. చిగురిస్తున్న ఆశ!
[ 04-07-2024]
కుమురంభీం జిల్లా ప్రకృతి సంపద, సహజ వనరులకు ఆలవాలం. అపార ఖనిజాలున్న అడవులతోపాటు, జలపాతాలు, విశాలమైన గోదావరి తీరం ఆకట్టుకుంటాయి. -
పత్తి విత్తనాలు మొలకెత్తలేదని యువ రైతు ఆత్మహత్మ
[ 04-07-2024]
పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదని మనోవేదనకు గురై ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. -
కుటుంబం ఛిన్నాభిన్నం!
[ 04-07-2024]
ఇంటి పెద్ద, కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన వాడే దారితప్పాడు. భార్యను పిల్లలను కంటికిరెప్పలా చూసుకోవాల్సి ఉండగా.. కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిస కావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. -
పదవీకాలం ముగింపు.. మిగిలిన పనుల పలకరింపు
[ 04-07-2024]
తాండూరు మండలంలోని కుర్మవాడలో ముడుగిరి భీమయ్య ఇంటి నుంచి మురికి రాజయ్య ఇంటి వరకు సిమెంట్ రహదారి నిర్మాణం కోసం రూ.3 లక్షల నిధులు కేటాయించారు. ఇప్పటికీ ఆ పనులు మొదలుపెట్టలేదు. -
పలుకు‘బడి’ బదిలీ
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నట్లు ఓ వైపు ప్రచారం చేస్తూనే.. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్నవారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తుండటం ఉపాధ్యాయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. -
కొత్త చట్టంతో సత్వర న్యాయం
[ 04-07-2024]
బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న న్యాయ చట్టాల్లో పలుమార్పులు, చేర్పులు చేసి నూతన విధానాలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. వీటివల్ల బాధితులకు త్వరగా న్యాయం జరిగే వీలుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. -
చెరిపేస్తున్నారు.. చక్కదిద్దేవరు?
[ 04-07-2024]
చెరువు.. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా ఇది ఉండటం ఎంతో ఆవశ్యకం. కేవలం సాగునీటి కోసమే కాదు.. అక్కడి ప్రజలు, జీవరాశుల ఇతర అవసరాలను తీర్చడంలో దాని ప్రాధాన్యం అంతాఇంతా కాదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్ రూ.5 వేలు
-
రాజధాని అమరావతి స్థితిగతులివీ..
-
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
-
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
-
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా