వృత్తి వైద్యం.. ప్రవృత్తి సామాజిక సేవ
ప్రస్తుత రోజుల్లో వైద్యం వ్యాపారంగా మారింది. చికిత్స కోసం గంపెడాశలో ఆసుపత్రులకు వచ్చే వారిని నిలువు దోపిడీ చేస్తున్న ఘటనలు చూస్తున్నాం. కొంత మంది వైద్యులు మాత్రం ఒక పక్క వైద్య వృత్తిని కొనసాగిస్తూనే సమాజానికి తమ వంతుగా వివిధ రకాల సాయం అందిస్తున్నారు.
నేడు ‘జాతీయ వైద్యుల దినోత్సవం’
న్యూస్టుడే, ఆదిలాబాద్ వైద్య విభాగం: ప్రస్తుత రోజుల్లో వైద్యం వ్యాపారంగా మారింది. చికిత్స కోసం గంపెడాశలో ఆసుపత్రులకు వచ్చే వారిని నిలువు దోపిడీ చేస్తున్న ఘటనలు చూస్తున్నాం. కొంత మంది వైద్యులు మాత్రం ఒక పక్క వైద్య వృత్తిని కొనసాగిస్తూనే సమాజానికి తమ వంతుగా వివిధ రకాల సాయం అందిస్తున్నారు. ‘వైద్యో నారాయణ హరి’ నానుడిని నిజం చేస్తున్నారు. దివ్యాంగులకు చేయూతనందిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపటానికి, బాలికల చదువులను ప్రోత్సహించేలా కృషి చేస్తున్నారు. నేడు ‘జాతీయ వైద్యుల దినోత్సవం’ పురస్కరించుకొని స్ఫూర్తిదాయకంగా సేవలందిస్తున్న వారిపై కథనం..
పశ్చిమ బంగ రెండో ముఖ్యమంత్రిగా పని చేసిన డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ మంచి వైద్యుడు కూడా. వైద్య పరంగా ఎన్నో సేవలందించారు. ఆయన జయంతి, వర్ధంతి కూడా జులై ఒకటే. ఆయన సేవలకు గుర్తుగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఏటా జులై ఒకటిన ‘జాతీయ వైద్యుల దినోత్సవం’ నిర్వహిస్తున్నారు.
గ్రామాన్ని దత్తత తీసుకొని ఉచిత వైద్యం
ఆ దంపతులిద్దరు వైద్యులే. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన అశోక్ రిమ్స్లో విధులు నిర్వహిస్తుండగా భార్య రమ ప్రైవేటు నర్సింగ్హోం నిర్వహిస్తున్నారు. ఆ దంపతులు రమ-అశోక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. వారి ట్రస్ట్ ద్వారా ఒక నిరుపేద వైద్య విద్యార్థిని సైతం చదివించారు. ఏడాదిన్నర కిందట ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని అంకాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో ఉన్న గర్భిణులు, ఇతర వ్యాధులతో బాధపడే వారికి సైతం తమ జీవితాంతం ఉచిత వైద్యం అందించటానికి నిర్ణయించారు. ఆ గ్రామానికి చెందిన బాధితులకు తమ నర్సింగ్హోంలో చికిత్సలు అందిస్తున్నారు. బతికున్నతంత వరకు సేవలందిస్తామని పేర్కొన్నారు.
దివ్యాంగులకు చేయూత
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఆర్థోపెడిక్ వైద్యుడు అనిల్ చిద్రాల ఏటా దివ్యాంగులకు అవసరమైన సాయం అందిస్తుంటారు. చిద్రాల ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. కాళ్లు, చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ కాళ్లను, చేతులను అమరుస్తుంటారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో వాటిని తయారు చేయించి ఆయన ఆసుపత్రిలోనే బిగిస్తారు. ఇందుకు ఏటా రూ.పది లక్షల వరకు వ్యయం చేస్తుంటారు. వినికిడి లోపం ఉన్న వారికి యంత్రాలు, కృత్రిమ కాలు అమర్చటానికి వీలు లేకుండా ఉన్న వారికి చక్రాల కుర్చీలను సైతం అందజేస్తుంటారు. 20 సంవత్సరాలుగా సేవలను కొనసాగిస్తున్నారు.
బాలికలకు భరోసా
‘బేటీ పడావో.. బేటీ బచావో’ నినాదంతో స్ఫూర్తి పొందిన ఆదిలాబాద్కు చెందిన వైద్యుడు కల్లెం వెంకటరెడ్డి బాలికల చదువును ప్రోత్సహించటానికి కృషి చేస్తున్నారు. ఏటా తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. పాఠశాల దూరంగా ఉండి వెళ్లటానికి ఇబ్బందులు పడే నిరుపేద విద్యార్థినుల కోసం గతంలో ఆయన తన జన్మదినోత్సవం సందర్భంగా సైకిళ్లను పంపిణీ చేశారు. స్థానిక శిశుగృహలోని చిన్నారులకు తరచూ సాయం అందిస్తుంటారు. నిరుపేద ఆదివాసీలకు సందర్భాన్ని బట్టి సరకులు అందిస్తుంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 3న నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు అందించటానికి ప్రణాళిక చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జడ్పీలో ఇక ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం గురువారం ముగియనుండటంతో శుక్రవారం ప్రత్యేకాధికారి పాలన మొదలు కానుంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక పాలనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. -
ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురు
[ 04-07-2024]
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపాల్టీ వైస్ ఛైర్మన్పై అవిశ్వాసం నేపథ్యంలో ఆయన బుధవారం ఎక్స్ అఫీషియో సభ్యుడి కింద దరఖాస్తు చేసుకోగా సమయం మించిపోయిందని అధికారులు పేర్కొంటూ అవిశ్వాసానికి ఓటు లేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. -
ఆర్జీయూకేటీలో తగ్గిన ప్రవేశాలు
[ 04-07-2024]
ఆర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల జాబితాను బుధవారం విడుదల చేసింది. -
మృత్యు పాశాలు
[ 04-07-2024]
నిర్మల్ జిల్లా గొల్లపేటకు చెందిన ప్రమోద్ విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆదిలాబాద్ మండలం యాపల్గూడకు చెందిన మోతీరాం విద్యుత్తు స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో మరణించాడు. -
మైనింగ్ మెరికలు
[ 04-07-2024]
పదోతరగతి పూర్తికాగానే పాలిటెక్నిక్ చేసేందుకు విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. కోర్సు పూర్తికాగానే ఏడాదికి రూ.లక్షల్లో ప్యాకేజీ అందుకొంటుండటమే దీనికి కారణం. -
అపురూప చరిత్ర.. చిగురిస్తున్న ఆశ!
[ 04-07-2024]
కుమురంభీం జిల్లా ప్రకృతి సంపద, సహజ వనరులకు ఆలవాలం. అపార ఖనిజాలున్న అడవులతోపాటు, జలపాతాలు, విశాలమైన గోదావరి తీరం ఆకట్టుకుంటాయి. -
పత్తి విత్తనాలు మొలకెత్తలేదని యువ రైతు ఆత్మహత్మ
[ 04-07-2024]
పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదని మనోవేదనకు గురై ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. -
కుటుంబం ఛిన్నాభిన్నం!
[ 04-07-2024]
ఇంటి పెద్ద, కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన వాడే దారితప్పాడు. భార్యను పిల్లలను కంటికిరెప్పలా చూసుకోవాల్సి ఉండగా.. కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిస కావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. -
పదవీకాలం ముగింపు.. మిగిలిన పనుల పలకరింపు
[ 04-07-2024]
తాండూరు మండలంలోని కుర్మవాడలో ముడుగిరి భీమయ్య ఇంటి నుంచి మురికి రాజయ్య ఇంటి వరకు సిమెంట్ రహదారి నిర్మాణం కోసం రూ.3 లక్షల నిధులు కేటాయించారు. ఇప్పటికీ ఆ పనులు మొదలుపెట్టలేదు. -
పలుకు‘బడి’ బదిలీ
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నట్లు ఓ వైపు ప్రచారం చేస్తూనే.. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్నవారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తుండటం ఉపాధ్యాయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. -
కొత్త చట్టంతో సత్వర న్యాయం
[ 04-07-2024]
బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న న్యాయ చట్టాల్లో పలుమార్పులు, చేర్పులు చేసి నూతన విధానాలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. వీటివల్ల బాధితులకు త్వరగా న్యాయం జరిగే వీలుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. -
చెరిపేస్తున్నారు.. చక్కదిద్దేవరు?
[ 04-07-2024]
చెరువు.. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా ఇది ఉండటం ఎంతో ఆవశ్యకం. కేవలం సాగునీటి కోసమే కాదు.. అక్కడి ప్రజలు, జీవరాశుల ఇతర అవసరాలను తీర్చడంలో దాని ప్రాధాన్యం అంతాఇంతా కాదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కరకట్టపై దస్త్రాల దహనం.. విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశం
-
సందేహం అక్కర్లేదు.. నేనే అధ్యక్ష అభ్యర్థిని: బైడెన్
-
వరల్డ్ కప్ మెడల్తో పంత్.. ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్
-
ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
-
ఘనంగా వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్.. తారల సందడి
-
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ