logo

అభిమాన నాయకుడికి కన్నీటి వీడ్కోలు

భాజపా నేత, మాజీ ఎంపీ రమేష్‌ రాఠోడ్‌(57) అంత్యక్రియలకు అభిమానులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తరలివచ్చారు.

Published : 01 Jul 2024 05:19 IST

మాజీ ఎంపీ రమేష్‌ రాఠోడ్‌ అంతిమ యాత్రకు తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు

అంత్యక్రియల్లో భాజపా ఎంపీ ఈటల రాజేందర్, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు

ఉట్నూరు, ఉట్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే : భాజపా నేత, మాజీ ఎంపీ రమేష్‌ రాఠోడ్‌(57) అంత్యక్రియలకు అభిమానులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య ఆదివారం ఉదయం 10 గంటలకు రాఠోడ్‌ ఇంటి నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర జై రాఠోడ్‌.. అమర్‌హై రాఠోడ్‌ నినాదాల మధ్య ఆరు కిలోమీటర్ల మేర సాగింది. ఉట్నూరు-ఎక్స్‌రోడ్‌లోని రాఠోడ్‌ వ్యవసాయ క్షేత్రంలో లంబాడీ సంప్రదాయం ప్రకారం ఆయన చితికి పెద్ద కుమారుడు రితేష్‌ రాఠోడ్‌ నిప్పు అంటించి దహనసంస్కారాలు పూర్తి చేశారు.

అంతిమయాత్రలో జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్,  ఎమ్మెల్యేలు  రామారావు పటేల్, పాయల్‌ శంకర్, అనిల్‌ జాదవ్, ఎంపీ గోడం నగేష్, తదితరులు

నేతల శ్రద్ధాంజలి

అంతియ యాత్రకు రాష్ట్ర, జిల్లా నాయకులు, పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటించి కడసారిచూసేందుకు భారీగా వచ్చారు. భాజపా ఎంపీలు ఈటల రాజేందర్, గోడం నగేష్, ఎమ్మెల్యేలు వెడ్మబొజ్జు, పాయల్‌ శంకర్, మహేశ్వర్‌రెడ్డి, అనిల్‌జాదవ్, హరీశ్‌బాబు, కోవలక్ష్మి, జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌రాఠోడ్, మాజీ మంత్రులు ఐకేరెడ్డి, జోగు రామన్న, మాజీ ఎంపీ సోయం బాపురావు, బోడ జనార్దన్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ మంత్రి అమర్‌సింగ్‌తిలావత్, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి రాఠోడ్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. ఆదిలాబాద్‌ పుర మాజీ అధ్యక్షురాలు మనీషా, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మాజీ ఎమ్మెల్యే కోనప్ప, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, దుర్గం ట్రస్ట్‌ ఛైర్మన్‌ దుర్గం శేఖర్, ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు పైడిపల్లి రవీందర్‌రావు, కాంగ్రెస్‌ నాయకులు భార్గవ్‌దేశ్‌పాండే, నరేష్‌ జాదవ్, సాజిద్‌ఖాన్, శ్యాంనాయక్, హరినాయక్, భారాస నాయకులు యూనూస్‌అక్బానీ, అబ్దుల్‌కలాం, భరత్‌చౌహాన్, మాజీ ఎంపీపీ కలాం, భాజపా నాయకులు బ్రహ్మానంద్, అల్జాపూర్‌ శ్రీనివాస్, రావుల రాంనాథ్, అయ్యన్నగారి భూమయ్య, శ్రీరాం నాయక్, రమేష్, రాంచందర్, రవీందర్, లింగాగౌడ్, దేవిదాస్, కిరణ్, రాజేశ్వర్, రాజశేఖర్, ధన్‌లాల్, కె.రమేష్, జడ్పీటీసీ సభ్యులు గణేష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్, చారులత, జడ్పీ మాజీ సభ్యులు గంగన్న, జగ్జీవన్, రాములు నాయక్, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ శ్రీరాంనాయక్,   టీపీటీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు భుజంగ్‌రావుతోపాటు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రి సీతక్క, కాంగ్రెస్‌ నేతలు ఆత్రం సుగుణ, సత్తు మల్లేష్, శ్యాంనాయక్, ఆడె గజేందర్, తదితరులు

దిగ్భ్రాంతికి లోనయ్యా

రమేష్‌ రాఠోడ్‌ మృతి విషయం తెలుసుకొని దిగ్భ్రాంతికి లోనయ్యానని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పేర్కొన్నారు. శనివారం అర్ధరాత్రి 2 గంటల తరువాత ఉట్నూరుకు వచ్చిన ఆయన  ఎమ్మెల్యే పాయల్‌ శంకర్, భాజపా శాసనసభ పక్షనేత మహేశ్వర్‌రెడ్డితో కలిసి రాఠోడ్‌  భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, జడ్పీ ఛైర్మన్‌గా పదవులు చేపట్టి గిరిజన నాయకుడిగా ఎన్నో సేవలు అందించారన్నారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా అంకితభావంతో పని చేసే రమేష్‌ రాఠోడ్‌ భౌతికంగా దూరం కావడం పార్టీకి   తీరని లోటన్నారు. ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే సుమన్‌ రాఠోడ్, తనయుడు రితేష్‌ రాఠోడ్‌లను బండి సంజయ్‌ పరామర్శించి సంతాపం ప్రకటించారు.

అంతిమయాత్రలో  అభిమానులు, నాయకులు, కార్యకర్తలు

కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌

మాజీ మంత్రులు ఐకేరెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యే వెడ్మబొజ్జు, మాజీ  ఎమ్మెల్సీ పురాణం సతీష్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని