అభిమాన నాయకుడికి కన్నీటి వీడ్కోలు
భాజపా నేత, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్(57) అంత్యక్రియలకు అభిమానులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తరలివచ్చారు.
మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ అంతిమ యాత్రకు తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు
అంత్యక్రియల్లో భాజపా ఎంపీ ఈటల రాజేందర్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు
ఉట్నూరు, ఉట్నూరు గ్రామీణం, న్యూస్టుడే : భాజపా నేత, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్(57) అంత్యక్రియలకు అభిమానులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య ఆదివారం ఉదయం 10 గంటలకు రాఠోడ్ ఇంటి నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర జై రాఠోడ్.. అమర్హై రాఠోడ్ నినాదాల మధ్య ఆరు కిలోమీటర్ల మేర సాగింది. ఉట్నూరు-ఎక్స్రోడ్లోని రాఠోడ్ వ్యవసాయ క్షేత్రంలో లంబాడీ సంప్రదాయం ప్రకారం ఆయన చితికి పెద్ద కుమారుడు రితేష్ రాఠోడ్ నిప్పు అంటించి దహనసంస్కారాలు పూర్తి చేశారు.
అంతిమయాత్రలో జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాఠోడ్, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పాయల్ శంకర్, అనిల్ జాదవ్, ఎంపీ గోడం నగేష్, తదితరులు
నేతల శ్రద్ధాంజలి
అంతియ యాత్రకు రాష్ట్ర, జిల్లా నాయకులు, పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించి కడసారిచూసేందుకు భారీగా వచ్చారు. భాజపా ఎంపీలు ఈటల రాజేందర్, గోడం నగేష్, ఎమ్మెల్యేలు వెడ్మబొజ్జు, పాయల్ శంకర్, మహేశ్వర్రెడ్డి, అనిల్జాదవ్, హరీశ్బాబు, కోవలక్ష్మి, జడ్పీ ఛైర్మన్ జనార్దన్రాఠోడ్, మాజీ మంత్రులు ఐకేరెడ్డి, జోగు రామన్న, మాజీ ఎంపీ సోయం బాపురావు, బోడ జనార్దన్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ మంత్రి అమర్సింగ్తిలావత్, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్రెడ్డి, జడ్పీ మాజీ ఛైర్పర్సన్ సుహాసినిరెడ్డి రాఠోడ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. ఆదిలాబాద్ పుర మాజీ అధ్యక్షురాలు మనీషా, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మాజీ ఎమ్మెల్యే కోనప్ప, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు దామోదర్రెడ్డి, దుర్గం ట్రస్ట్ ఛైర్మన్ దుర్గం శేఖర్, ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు పైడిపల్లి రవీందర్రావు, కాంగ్రెస్ నాయకులు భార్గవ్దేశ్పాండే, నరేష్ జాదవ్, సాజిద్ఖాన్, శ్యాంనాయక్, హరినాయక్, భారాస నాయకులు యూనూస్అక్బానీ, అబ్దుల్కలాం, భరత్చౌహాన్, మాజీ ఎంపీపీ కలాం, భాజపా నాయకులు బ్రహ్మానంద్, అల్జాపూర్ శ్రీనివాస్, రావుల రాంనాథ్, అయ్యన్నగారి భూమయ్య, శ్రీరాం నాయక్, రమేష్, రాంచందర్, రవీందర్, లింగాగౌడ్, దేవిదాస్, కిరణ్, రాజేశ్వర్, రాజశేఖర్, ధన్లాల్, కె.రమేష్, జడ్పీటీసీ సభ్యులు గణేష్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, చంద్రశేఖర్, చారులత, జడ్పీ మాజీ సభ్యులు గంగన్న, జగ్జీవన్, రాములు నాయక్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ శ్రీరాంనాయక్, టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు భుజంగ్రావుతోపాటు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రి సీతక్క, కాంగ్రెస్ నేతలు ఆత్రం సుగుణ, సత్తు మల్లేష్, శ్యాంనాయక్, ఆడె గజేందర్, తదితరులు
దిగ్భ్రాంతికి లోనయ్యా
రమేష్ రాఠోడ్ మృతి విషయం తెలుసుకొని దిగ్భ్రాంతికి లోనయ్యానని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. శనివారం అర్ధరాత్రి 2 గంటల తరువాత ఉట్నూరుకు వచ్చిన ఆయన ఎమ్మెల్యే పాయల్ శంకర్, భాజపా శాసనసభ పక్షనేత మహేశ్వర్రెడ్డితో కలిసి రాఠోడ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, జడ్పీ ఛైర్మన్గా పదవులు చేపట్టి గిరిజన నాయకుడిగా ఎన్నో సేవలు అందించారన్నారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా అంకితభావంతో పని చేసే రమేష్ రాఠోడ్ భౌతికంగా దూరం కావడం పార్టీకి తీరని లోటన్నారు. ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే సుమన్ రాఠోడ్, తనయుడు రితేష్ రాఠోడ్లను బండి సంజయ్ పరామర్శించి సంతాపం ప్రకటించారు.
అంతిమయాత్రలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు
కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్
మాజీ మంత్రులు ఐకేరెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యే వెడ్మబొజ్జు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జడ్పీలో ఇక ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం గురువారం ముగియనుండటంతో శుక్రవారం ప్రత్యేకాధికారి పాలన మొదలు కానుంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక పాలనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. -
ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురు
[ 04-07-2024]
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్కు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపాల్టీ వైస్ ఛైర్మన్పై అవిశ్వాసం నేపథ్యంలో ఆయన బుధవారం ఎక్స్ అఫీషియో సభ్యుడి కింద దరఖాస్తు చేసుకోగా సమయం మించిపోయిందని అధికారులు పేర్కొంటూ అవిశ్వాసానికి ఓటు లేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. -
ఆర్జీయూకేటీలో తగ్గిన ప్రవేశాలు
[ 04-07-2024]
ఆర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల జాబితాను బుధవారం విడుదల చేసింది. -
మృత్యు పాశాలు
[ 04-07-2024]
నిర్మల్ జిల్లా గొల్లపేటకు చెందిన ప్రమోద్ విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆదిలాబాద్ మండలం యాపల్గూడకు చెందిన మోతీరాం విద్యుత్తు స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో మరణించాడు. -
మైనింగ్ మెరికలు
[ 04-07-2024]
పదోతరగతి పూర్తికాగానే పాలిటెక్నిక్ చేసేందుకు విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. కోర్సు పూర్తికాగానే ఏడాదికి రూ.లక్షల్లో ప్యాకేజీ అందుకొంటుండటమే దీనికి కారణం. -
అపురూప చరిత్ర.. చిగురిస్తున్న ఆశ!
[ 04-07-2024]
కుమురంభీం జిల్లా ప్రకృతి సంపద, సహజ వనరులకు ఆలవాలం. అపార ఖనిజాలున్న అడవులతోపాటు, జలపాతాలు, విశాలమైన గోదావరి తీరం ఆకట్టుకుంటాయి. -
పత్తి విత్తనాలు మొలకెత్తలేదని యువ రైతు ఆత్మహత్మ
[ 04-07-2024]
పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదని మనోవేదనకు గురై ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. -
కుటుంబం ఛిన్నాభిన్నం!
[ 04-07-2024]
ఇంటి పెద్ద, కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన వాడే దారితప్పాడు. భార్యను పిల్లలను కంటికిరెప్పలా చూసుకోవాల్సి ఉండగా.. కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిస కావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. -
పదవీకాలం ముగింపు.. మిగిలిన పనుల పలకరింపు
[ 04-07-2024]
తాండూరు మండలంలోని కుర్మవాడలో ముడుగిరి భీమయ్య ఇంటి నుంచి మురికి రాజయ్య ఇంటి వరకు సిమెంట్ రహదారి నిర్మాణం కోసం రూ.3 లక్షల నిధులు కేటాయించారు. ఇప్పటికీ ఆ పనులు మొదలుపెట్టలేదు. -
పలుకు‘బడి’ బదిలీ
[ 04-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నట్లు ఓ వైపు ప్రచారం చేస్తూనే.. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్నవారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తుండటం ఉపాధ్యాయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. -
కొత్త చట్టంతో సత్వర న్యాయం
[ 04-07-2024]
బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న న్యాయ చట్టాల్లో పలుమార్పులు, చేర్పులు చేసి నూతన విధానాలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. వీటివల్ల బాధితులకు త్వరగా న్యాయం జరిగే వీలుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. -
చెరిపేస్తున్నారు.. చక్కదిద్దేవరు?
[ 04-07-2024]
చెరువు.. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా ఇది ఉండటం ఎంతో ఆవశ్యకం. కేవలం సాగునీటి కోసమే కాదు.. అక్కడి ప్రజలు, జీవరాశుల ఇతర అవసరాలను తీర్చడంలో దాని ప్రాధాన్యం అంతాఇంతా కాదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 24,350 ఎగువన నిఫ్టీ
-
మత్తు ఊబిలో ఎంబీఏ విద్యార్థులు.. డ్రగ్ రాకెట్ను ఛేదించిన టీజీ న్యాబ్ పోలీసులు
-
వరంగల్ నిట్ విద్యార్థికి రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ
-
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వంచకుడు అంజాద్పై కేసు.. పెళ్లి చేసుకుంటానని బలవంతాన తీసుకెళ్లినట్లు తేజస్విని స్టేట్మెంట్